icon icon icon
icon icon icon

నామినేషన్లు ఉపసంహరించుకున్నా: సర్వే

కంటోన్మెంట్‌ అసెంబ్లీ, మల్కాజిగిరి ఎంపీ స్థానాలకు తాను వేసిన నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ప్రకటించారు.

Updated : 30 Apr 2024 22:48 IST

మారేడుపల్లి, న్యూస్‌టుడే: కంటోన్మెంట్‌ అసెంబ్లీ, మల్కాజిగిరి ఎంపీ స్థానాలకు తాను వేసిన నామినేషన్లను ఉపసంహరించుకున్నట్లు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ప్రకటించారు. కన్నతల్లి లాంటి కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా వెళ్లబోనని స్పష్టం చేశారు. సోమవారం మహేంద్రహిల్స్‌లోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. పార్టీకి విధేయతతో ఉంటూ ప్రచారాల్లో పాల్గొని అభ్యర్థులను గెలిపించుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img