గడప గడపకూ భారాస
ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఓటమిని పక్కనబెట్టి.. ఈ లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారాస పూర్తి స్థాయిలో సమాయత్తమవుతోంది.
లోక్సభలో తెలంగాణ గొంతుకకు అవకాశమివ్వాలని విన్నపం
క్షేత్రస్థాయిలో గులాబీ దళం ప్రచారం
ఈనాడు-హైదరాబాద్: ఇటీవల శాసనసభ ఎన్నికల్లో ఓటమిని పక్కనబెట్టి.. ఈ లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భారాస పూర్తి స్థాయిలో సమాయత్తమవుతోంది. ఎన్నికల ప్రచారానికి గడువు మరో 11 రోజులే ఉండడంతో.. ప్రజాక్షేత్రంలో ఈ అంకాన్ని బలంగా నిర్వహించేందుకు పక్కా ప్రణాళిక రూపొందించింది. గడప గడపకూ పార్టీ శ్రేణులు వెళ్లాలన్నది లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని, భారాస ప్రభుత్వ పథకాలను అమలు చేయడం లేదని ప్రధానంగా ఓటర్ల ముందు ప్రస్తావించేలా.. పార్టీ నాయకులు, కార్యకర్తలకు శిక్షణ ఇచ్చారు. పోలింగ్కు గడువు సమీపిస్తుండడంతో.. వేర్వేరు స్థాయుల్లో ప్రచారాన్ని ఉద్ధృతంగా కొనసాగించాలని అధిష్ఠానం నిర్ణయించింది.
గ్రామ స్థాయి నాయకులతోనూ కేసీఆర్ భేటీ
మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడ గెలుపు అవకాశాలు అధికంగా ఉంటాయని పార్టీ భావిస్తుందో.. ఆయా నియోజకవర్గాలపై భారాస ఎక్కువగా దృష్టి కేంద్రీకరించింది. అధినేత కేసీఆర్ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. ప్రతి రోజు ఉదయం.. సాయంత్రం రోడ్షోలు, కార్నర్ మీటింగ్ల అనంతరం మండల, గ్రామ స్థాయి నాయకులతోనూ కేసీఆర్ సమావేశమవుతున్నారు. ఓటర్లకు చేరువ కావడానికి ఏం చేయాలనే దానిపై మార్గనిర్దేశం చేస్తున్నారు. మరోవైపు కేటీఆర్, హరీశ్రావులు కూడా వేర్వేరుగా ప్రచారాలను కొనసాగిస్తున్నారు.
బూత్ స్థాయిలో ప్రణాళికలు సిద్ధం
మొదటిదశలో లోక్సభ నియోజకవర్గ స్థాయిలో ఇప్పటికే పార్టీ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో కేసీఆర్ సమావేశాలు పూర్తయ్యాయి. రెండోదశలో అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో సుమారు 2-3 వేల మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కేటీఆర్, హరీశ్రావు సమావేశాలను నిర్వహించి, వారిని కార్యోన్ముఖులను చేశారు. నియోజకవర్గ ఇన్ఛార్జులుగా పార్టీ ఎమ్మెల్యేలకు, శాసనసభ్యులు లేని చోట ఎమ్మెల్సీలు లేదా మాజీ ఎమ్మెల్యేలకు భారాస సమన్వయ బాధ్యతలు అప్పగించింది. మూడోదశలో ప్రస్తుతం వారు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు కొనసాగిస్తున్నారు. వాటితో పాటు గ్రామాల్లో పర్యటిస్తూ స్థానిక ముఖ్య నాయకులను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు. కుల, యువజన, కార్మిక, కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులతోనూ భేటీ అవుతున్నారు. వచ్చే పది రోజుల్లో ప్రచారాన్ని మరింత ఉద్ధృతం చేసి, బూత్ స్థాయిలోనూ ఓటర్లను కలవడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రజలను ఓటు అభ్యర్థించే క్రమంలో గత పదేళ్ల భారాస పాలనలో సంక్షేమ, అభివృద్ధి పనులను గుర్తు చేయడంతో పాటు.. ప్రస్తుతం ఆయా కార్యక్రమాలు అమలవుతున్నాయా అనే కోణంలో ప్రచారానికి ప్రాధాన్యమిస్తున్నారు. కరపత్రాలను కూడా ముద్రించి ఓటర్లకు పంచుతున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం గత పదేళ్లలో తెలంగాణకు ఏమీ చేయలేదని చెబుతూ.. లోక్సభలో తెలంగాణ పక్షాన కొట్లాడే గొంతుకకు అవకాశమివ్వాలని కోరుతున్నారు.
అసంతృప్తులకు బుజ్జగింపులు
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన కొందరు భారాస అభ్యర్థులు, మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎంపీ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. ఈ ప్రభావం పార్టీ ఎన్నికల ప్రచారంపై పడకుండా అధిష్ఠానం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. ఎక్కడైనా ఎమ్మెల్యే, దిగువ స్థాయి ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు వేరే పార్టీల్లో చేరిన చోట్ల.. స్థానికంగా చురుగ్గా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను ప్రోత్సహిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ పట్ల అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్