ప్రతి ఓటరును కలిసేలా కమల వ్యూహం
లోక్సభ ఎన్నికలలో ప్రతి ఓటరును కలిసే పక్కా ప్రణాళికకు ప్రాధాన్యం ఇస్తూ భాజపా కార్యాచరణను అమలు చేస్తోంది. నేరుగా కుటుంబం వద్దకు పార్టీ బాధ్యులు చేరుకునేలా కార్యక్రమాలను చేపట్టింది.
బూత్, పన్నా కమిటీలతో ప్రచారానికి పదును
బహుముఖ ఎన్నికల కార్యాచరణపై భాజపా నజర్
ఈనాడు, హైదరాబాద్: లోక్సభ ఎన్నికలలో ప్రతి ఓటరును కలిసే పక్కా ప్రణాళికకు ప్రాధాన్యం ఇస్తూ భాజపా కార్యాచరణను అమలు చేస్తోంది. నేరుగా కుటుంబం వద్దకు పార్టీ బాధ్యులు చేరుకునేలా కార్యక్రమాలను చేపట్టింది. బూత్ కమిటీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వస్తున్న పార్టీ తాజాగా పన్నా ప్రముఖ్ కమిటీలతో ఆ ప్రణాళికకు మరింత పదును పెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 వేలకు పైగా బూత్ కమిటీలు ఉండగా వాటి పరిధిలో పన్నా కమిటీలను ఏర్పాటు చేసింది. 10 నుంచి 12 కుటుంబాలకు చేరువ కావాలన్నది లక్ష్యం. ఓటరు జాబితా ఆధారంగా వాటిని నెలకొల్పింది. సగటున ప్రతి 30 మంది ఓటర్లకు ఒకరు బాధ్యత తీసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో అత్యంత కీలకంగా ఉండేలా వాటికి కార్యక్రమాలను నిర్దేశించారు. భాజపా గురించి, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి వివరించడం.. పోలింగ్లోపు కనీసం రెండు మూడు సార్లు తమ పరిధిలోని కుటుంబాలను కలవడం అనేది కీలక అంశంగా ఉంది. ఓటర్లు విధిగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసేలా చూడాల్సి ఉంటుంది. బూత్ కమిటీలను భాజపా.. కళ్లు, చెవులుగా భావిస్తోంది. వాటికి ఛైర్మన్ ఇతర బాధ్యులను నియమించి వారికి పక్కాగా పార్టీ బాధ్యతలను అప్పగించింది. బాధ్యులతో భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రత్యేకంగా సమావేశమై దిశానిర్దేశం చేశారు. ప్రతి బూత్కు స్థానిక ముఖ్యనేత కోఆర్డినేటర్గా వ్యవహరిస్తారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి సహా రాష్ట్రంలోని భాజపా నాయకులు అందరూ కూడా తమతమ బూత్లకు కోఆర్డినేటర్లుగా ఉన్నారు. తమ పరిధిలో నిర్దేశించిన కార్యక్రమాల అమలుకు వారు సహకారం అందిస్తున్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల జాబితాలను పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ కమిటీలకు అందచేశారు. పన్నా ప్రభారీలు (ఓటరు జాబితా పేజీ ఇన్ఛార్జి) ఆ బూత్ కమిటీ బాధ్యులు లబ్ధిదారులను కలసి భాజపా ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తున్నారు. ఇంతవరకు వారు పొందిన ప్రయోజనాన్ని తెలియజేస్తున్నారు. జిల్లా, రాష్ట్ర పార్టీకి అవసరమైన క్షేత్ర స్థాయి సమాచారాన్ని అందిస్తున్నారు.
పార్టీకి ఓటు... ఓటింగ్ శాతం పెంచడం
క్షేత్రస్థాయిలోని పన్నా, బూత్ కమిటీల వారు తమ పరిధిలోని ఓటరు ఓటింగ్కు వచ్చారా? లేదా? అనేది పూర్తిస్థాయిలో పర్యవేక్షించనున్నారు. పోలింగ్శాతం పెరగడం కీలకమైన అంశంగా భాజపా అగ్రనేతలు భావిస్తున్నారు. ప్రధానంగా పార్టీ ఓటర్లు అని భావించిన వారంతా విధిగా ఓటేసేలా చూడాలని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే అగ్రనేతల ప్రచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నిర్వహిస్తున్న సభలు, కార్యక్రమాలకు ప్రతి బూత్ నుంచి జనసమీకరణ, సభ్యుల హాజరు ఉండాలని ఆయా కమిటీల వారికి నేతలు నిర్దేశించారు. ‘భాజపా సూక్ష్మ ప్రణాళిక గుజరాత్, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో సత్ఫలితాలు ఇచ్చింది. అందుకే తెలంగాణలోనూ పక్కాగా బూత్, పన్నా కమిటీల కార్యాచరణ అమలు చేయాలని జాతీయ పార్టీ నిర్దేశించింది. ఆ దిశగా ముందుకు వెళ్తున్నాం’ అని ఆ పార్టీ ముఖ్యనేతలు స్పష్టం చేస్తున్నారు.
ఐదువేల స్ట్రీట్ కార్నర్ సమావేశాలు
రాష్ట్రంలో బుధవారం నుంచి ఎనిమిదో తేదీలోపు 5,000 స్ట్రీట్ కార్నర్ సమావేశాలు నిర్వహించనున్నారు. మాట్లాడేందుకు 30 మంది నేతల్ని ఎంపిక చేశారు. వారు మాట్లాడాల్సిన అంశాలను రాష్ట్ర పార్టీ అందజేసింది. పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం, ఇంకోసారి మోదీ ప్రధాని కావాల్సిన ఆవశ్యకత, భాజపా ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వారు వివరించనున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
తెలంగాణ కేబినెట్ భేటి.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!