కాంగ్రెస్, భాజపా మిలాఖత్ కాకపోతే.. సీఎం రేవంత్పై విచారణ జరపండి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడిన మాటలు నిజమైతే.. వెంటనే సీఎంపై విచారణ జరిపించాలని భారాస అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ చేసిన ఆర్ఆర్ ట్యాక్స్ వ్యాఖ్యలపై కేసీఆర్
ఈడీ, ఐటీలను రంగంలోకి దించాలన్న భారాస అధినేత
కొత్తగూడెంలో రోడ్షో
ఈటీవీ, ఖమ్మం: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడిన మాటలు నిజమైతే.. వెంటనే సీఎంపై విచారణ జరిపించాలని భారాస అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్, భాజపా మిలాఖత్ కాకపోతే.. ఈడీ, ఐటీలను రంగంలోకి దించి దొంగలను పట్టుకోవాలని అన్నారు. అది మోదీకి చేతకాదని, పైకి నాటకాలు ఆడతారని.. ముమ్మాటికీ వారిద్దరూ ఒకటేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ లోక్సభ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లో ఏపార్టీకి ఓటేసినా గోదావరిలో వేసినట్టేనని.. తెలంగాణ ప్రజలకు లాభం జరగదని చెప్పారు. భారాస మహబూబాబాద్, ఖమ్మం అభ్యర్థులు మాలోత్ కవిత, నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రోడ్షోలో కేసీఆర్ ప్రసంగించారు.
కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి
‘‘శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపింది. అడ్డగోలు హామీలు ఇచ్చింది. ప్రజలను దారుణంగా మోసగించింది. మేము రైతుబంధు రూ.10వేలు ఇస్తే వాళ్లు రూ.15 వేలు ఇస్తామన్నారు. మరి రైతుబంధు అందరికీ వచ్చిందా? కల్యాణలక్ష్మి పథకం కింద భారాస ప్రభుత్వంలో రూ.లక్ష ఇస్తే వారు అదనంగా తులం బంగారం అందజేస్తామన్నారు. ఎవరికైనా తులం బంగారం వచ్చిందా..? అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించి ప్రజలకు న్యాయం చేస్తామని చెప్పారు. ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి. తెలంగాణ సమస్యలు తీరాలన్నా, నదుల నీళ్లు రాష్ట్రానికి దక్కాలన్నా, కేంద్రం నిధులు రావాలన్నా.. రాష్ట్ర అస్తిత్వం, ఆత్మగౌరవం నిలబడాలన్నా భారాసతోనే సాధ్యం.
జిల్లాలు తీసేస్తామంటున్నారు...
ప్రజలకు పరిపాలనా సౌలభ్యం కోసం నాడు కొత్త జిల్లాలను ఏర్పాటు చేశాం. ఆ క్రమంలో కొత్తగూడెం జిల్లా ఏర్పడింది. బ్రహ్మాండమైన కలెక్టరేట్ నిర్మించాం. వైద్య కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల నెలకొల్పాం. పట్టణాన్ని అభివృద్ధి చేశాం. ఏజెన్సీ ప్రాంతాలకు జిల్లా కేంద్రం దూరంగా ఉండకూడదన్న ఉద్దేశంతో జిల్లాను ఏర్పాటు చేశాం. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్తగూడెం జిల్లా తీసేస్తామని స్పష్టంగా చెబుతున్నారు. మరి ఈ జిల్లా ఉండాలా తీసేయాలా? ఈ జిల్లా ఉండాలన్నా, ఇక్కడ ప్రజలకు లాభం జరగాలన్నా భారాస అభ్యర్థులు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవితను గెలిపించాలి.
సింగరేణిపై చోటే భాయ్, బడే భాయ్ కుట్ర
భారాస హయాంలోనే సింగరేణిని లాభాల బాటలో నడిపించాం. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కార్మికులకు ప్రత్యేక బోనస్, ఇంక్రిమెంట్ ఇచ్చాం. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణిని ముంచే కార్యక్రమం చేస్తోంది. చోటే భాయ్ రేవంత్రెడ్డి, బడే భాయ్ మోదీ కలిసి సింగరేణిని ముంచే కుట్ర చేస్తున్నారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదాని ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన బొగ్గును కొనుగోలు చేయాలని మోదీ పంచాయితీ పెట్టారు. మాకు సింగరేణి బొగ్గు ఉంది. ఆస్ట్రేలియా బొగ్గు ఎందుకని, ఎట్టి పరిస్థితుల్లో టన్ను కూడా కొనమని చెప్పాం. సింగరేణిని కాపాడుకున్నాం.
భాజపా ఒక్క హామీ నెరవేర్చలే
భాజపా ప్రభుత్వం పదేళ్ల కిందట గద్దెనెక్కింది. దశాబ్ద కాలంలో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మోదీ ప్రభుత్వం వంటి దరిద్ర పరిపాలన మళ్లీ చూడబోం. మతాల మధ్య పంచాయితీలు పెట్టి ఉద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకోవడం తప్ప ఒక్క మంచి పనీ చేయలేదు. పైగా ఇప్పుడు గోదావరి నదిని ఎత్తుకుపోయి తమిళనాడు, కర్ణాటకకు నీళ్లిస్తానని మోదీ అంటున్నారు. తెలంగాణకు ఒకే ఒక్క ఆధారం గోదావరి. ఆ నది పోతే తెలంగాణ బతుకేం కావాలి? సీఎం ఎందుకు మాట్లాడటం లేదు? దీని వెనుక ఉన్న మతలబు ఏంటో తేలాలి. గతంలో మోదీ రైతుల బావులకు మీటర్లు పెట్టాలంటే.. నా తల తెగిపడ్డా మీటర్లు పెట్టేది లేదని చెప్పా. ఇప్పుడు భారాసకు కాకుండా కాంగ్రెస్, భాజపాలకు ఓటేస్తే మోటార్లకు మీటర్లు రావటం ఖాయం. తస్మాత్ జాగ్రత్త. మీటర్లు పెట్టొద్దంటే పేగులు తెగేదాక కొట్లాడే భారాస ఎంపీ అభ్యర్థులను గెలిపించండి’’ అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ముగిసిన బస్సు యాత్ర
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రెండ్రోజుల కేసీఆర్ బస్సు యాత్ర మంగళవారం ముగిసింది. ఆరు నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగింది. రెండు చోట్ల కేసీఆర్ రోడ్షోలు నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ఖమ్మం నుంచి బస్సు యాత్ర మొదలైంది. వైరా, తల్లాడ మీదుగా కొత్తగూడెం చేరుకుంది. తల్లాడ వద్ద మాజీ ఎమ్మెల్యే సండ్ర ఆధ్వర్యంలో భారాస శ్రేణులు కేసీఆర్ బస్సు యాత్రకు స్వాగతం పలికారు. బస్సులో నుంచే కేసీఆర్ అభివాదం చేశారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, బానోత్ హరిప్రియ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ బస్సు యాత్ర బుధవారం మహబూబాబాద్ జిల్లాలో సాగనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.