ప్రచారానికి పదకొండు రోజులే..!
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది.
వేగం పెంచిన కాంగ్రెస్
జాతీయస్థాయి నాయకులతో భారీ సభలకు సన్నాహాలు
పార్టీ శ్రేణులు, నేతలకు దిశానిర్దేశం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. బుధవారం నుంచి ఇంకా 11 రోజులే (మే నెల 11 వరకు) ప్రచారానికి గడువు ఉంది. ఈ లోగా పెద్దఎత్తున ప్రచారం చేయాలని పార్టీ నిర్ణయించింది. మే మొదటివారంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేతలు రాహుల్, ప్రియాంకాగాంధీలతో రాష్ట్రంలో భారీ సభల ఏర్పాటుకు పార్టీ నేతలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మే 4, 5 తేదీల్లో రాహుల్గాంధీ సభలుంటాయని సమాచారం. అలాగే పల్లెల్లో ప్రజల దృష్టిని ఆకర్షించేలా ప్రచారంపైనా దృష్టిపెట్టాలని పార్టీ శ్రేణులు, నేతలకు కాంగ్రెస్ దిశానిర్దేశం చేసింది. ఇప్పటికీ కొన్ని లోక్సభ నియోజకవర్గాల్లో గ్రామాలకు ప్రచారం చేరలేదని సమాచారం. ఏ నియోజకవర్గంలో ప్రచారం ఎలా సాగుతుందనే విషయమై పార్టీ వార్రూంల ద్వారా అధిష్ఠానానికి ఎప్పటికప్పుడు సమాచారం వెళుతోంది. ఇక ప్రచారానికి తక్కువ సమయమే ఉందని మంత్రులు, లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జులు, అభ్యర్థులతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఏఐసీసీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్లు జూమ్ ద్వారా ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు. భవిష్యత్ కార్యాచరణపై వారు నేతలతో చర్చించారు. ప్రణాళికాబద్ధంగా ప్రచారంలో ముందుకెళ్లాలని అభ్యర్థులకు సీఎం సూచనలిచ్చారు. ప్రతి మండల, గ్రామ, పోలింగ్ బూత్ స్థాయిల్లో ఓటర్లను పార్టీ శ్రేణులు కలసి ఓటు అడిగేలా పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని సీఎం స్పష్టంచేశారని అభ్యర్థులు తెలిపారు.
కష్టపడేవారికి గుర్తింపు..
ఈ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి మంచి భవిష్యత్ ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు పార్టీ శ్రేణులకు, కిందిస్థాయి కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఎన్నికల తరవాత త్వరలో సంక్షేమ పథకాల అమలుకు గ్రామస్థాయిలో ఇందిరమ్మ కమిటీలను ఏర్పాటుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ఎన్నికల్లో బాగా కష్టపడి, పార్టీకి ఓట్లు రాబట్టడానికి కృషిచేసే ముఖ్యమైన కార్యకర్తలను ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో గుర్తించి వారికి ఇందిరమ్మ కమిటీల్లో చోటు కల్పించాలని పార్టీ నిర్ణయించింది. ఈ విషయం కార్యకర్తలకు వివరించాలని నేతలకు నిర్దేశించింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ తగ్గకుండా ప్రతి నియోజకవర్గంలో మరిన్ని ఎక్కువగా ఓట్లు వచ్చేలా చూసుకోవాల్సిన బాధ్యత జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జులకు పార్టీ అప్పగించింది. ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిందేనని, ఏ ఒక్కరికీ మినహాయింపు ఉండదని రేవంత్రెడ్డి హెచ్చరించినట్లు తెలుస్తోంది. గత 120 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలుచేసిన పథకాలు, పేదలకు చేకూరుతున్న లబ్ధిని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని పార్టీ నిర్ణయించింది. వచ్చే ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని నేతలందరికీ సీఎం సూచించారు. పార్టీలో అక్కడక్కడా నేతలు, కార్యకర్తల మధ్య సమన్వయానికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే దీపా దాస్మున్షీ, ఏఐసీసీ కార్యదర్శుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలకు పార్టీ ఆదేశాలిచ్చింది. కొన్నిచోట్ల ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి ఎప్పటినుంచో కాంగ్రెస్లో ఉన్నవారు సహకరించకపోతే అందరికీ నచ్చజెప్పాలని అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు, లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జి నేతలకు సూచనలిచ్చారు. ప్రచారంలో, పార్టీ విజయానికి ఎవరికి కేటాయించిన బాధ్యతలను వారు కచ్చితంగా నిర్వహించాల్సిందేనని పీసీసీ స్పష్టం చేసింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోయే పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలని సీఎం సూచించినట్లు నేతలు వివరించారు. రాబోయే 11 రోజుల పాటు నిర్వహించే ప్రచార ప్రణాళిక అమలును గాంధీభవన్ నుంచి పర్యవేక్షించాలని పార్టీ నిర్ణయించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
అప్పుడు.. ఒక్కసారి కూడా స్కోరు బోర్డు చూడలేదు: యశ్ దయాళ్
-
సీసీ ఫుటేజీని, సాక్ష్యాలను బిభవ్ ధ్వంసం చేసుండొచ్చు: దిల్లీ పోలీసులు
-
ఆప్ అంతానికి భాజపా ‘ఆపరేషన్ ఝాడు’: కేజ్రీవాల్
-
ధోనీకి ఎప్పుడేం చేయాలో తెలుసు: చెన్నై కోచ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఒకప్పుడు న్యాయం కోసం వీధుల్లోకి వచ్చాం.. ఇప్పుడు?.. ఆప్ నిరసనపై మాలీవాల్