గెలవకున్నా.. గెలుపోటములను శాసిస్తారు!
ఎన్నికల్లో స్వతంత్రులు, ఇతర గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులు ప్రధాన పార్టీల అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. పలు స్థానాల్లో ఫలితాలపై ప్రభావం చూపిస్తున్నారు.
ప్రధాన అభ్యర్థులకు దడ పుట్టిస్తున్న స్వతంత్రులు
గత ఎన్నికల్లో విజేతల మెజార్టీ కంటే.. పలు స్థానాల్లో వీరికే ఎక్కువ ఓట్లు
ఈనాడు, హైదరాబాద్: ఎన్నికల్లో స్వతంత్రులు, ఇతర గుర్తింపు పొందని పార్టీల అభ్యర్థులు ప్రధాన పార్టీల అభ్యర్థులకు దడ పుట్టిస్తున్నారు. పలు స్థానాల్లో ఫలితాలపై ప్రభావం చూపిస్తున్నారు. రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో ఆరు లోక్సభ నియోజకవర్గాల్లో గెలుపోటముల మధ్య తేడా చాలా స్వల్పంగా ఉంది. ఆయా నియోజకవర్గాల్లో ఎక్కువ మంది స్వతంత్రులు బరిలో నిలవడం ప్రధాన పార్టీల అభ్యర్థుల ఓట్లపై ప్రభావం చూపిందన్న విశ్లేషణలు ఉన్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల వ్యతిరేక ఓట్లను స్వతంత్ర అభ్యర్థులు పొందడంతో ఫలితాలు, లేదంటే మెజారిటీలు తారుమారవుతున్నాయన్న భావన ఉంది. గత పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా తెరాస (ప్రస్తుత భారాస) 41.71 శాతం ఓట్లు సాధించగా.. కాంగ్రెస్ 29.78 శాతం, భాజపా 19.65 శాతం, ఎంఐఎం 2.8 శాతం ఓట్లు పొందాయి. స్వతంత్రులు 3.17 శాతం ఓట్లు కైవసం చేసుకున్నారు. గుర్తింపు పొందని, ఇతర పార్టీలు కలిపి 1.7 శాతం ఓట్లు సాధించాయి. ఆ ఎన్నికల్లో మొత్తం 1.84 కోట్ల ఓట్లు పోలైతే, ఇందులో స్వతంత్ర అభ్యర్థులు సాధించిన ఓట్లు 5.86 లక్షలు ఉన్నాయి.
ఇవీ ఘటనలు...
- నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో విజేత అయిన భాజపా అభ్యర్థి ధర్మపురి అర్వింద్కు 45.20 శాతం ఓట్లు రాగా.. రెండో స్థానంలో నిలిచిన తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవితకు 38.53 శాతం ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థికి 6.51 శాతం ఓట్లు దక్కాయి. ఆ ఎన్నికలో ఇక్కడ ఎక్కువ మంది స్వతంత్ర, చిన్న పార్టీల తరఫున అభ్యర్థులు పోటీలో నిలవగా.. వారందరికీ కలిపి దాదాపు 9 శాతం ఓట్లు లభించాయి. విజేతకు లభించిన మెజారిటీ ఓట్ల కంటే వీరందరికీ పడిన ఓట్లు ఎక్కువ శాతం ఉండడం గమనార్హం. దీంతో వీరు ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపించారన్న భావన వ్యక్తమైంది.
- జహీరాబాద్ నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి బీబీ పాటిల్ (41.57%), కాంగ్రెస్ అభ్యర్థి మదన్మోహన్రావు (40.97%)కు వచ్చిన ఓట్ల మధ్య తేడా 0.6 శాతమే. ఆ ఎన్నికలో స్వతంత్రులు, ఇతర గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులు 3.5 శాతం ఓట్లు సాధించారు.
- మల్కాజిగిరి స్థానంలోనూ ఇదే పరిస్థితి. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి 38.61 శాతం ఓట్లు సాధిస్తే, ప్రస్తుత ఎమ్మెల్యే, అప్పటి తెరాస అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డి 37.91 శాతం ఓట్లు సాధించారు. ఇద్దరి మధ్య ఓట్ల వ్యత్యాసం 0.7 శాతమే. ఇక్కడ స్వతంత్ర, ఇతర చిన్న పార్టీల అభ్యర్థులు 2.6 శాతానికిపైగా ఓట్లు సాధించారు.
- చేవెళ్ల నియోజకవర్గంలో జి.రంజిత్రెడ్డి 40.59 శాతం ఓట్లు సాధించగా.. కొండా విశ్వేశ్వర్రెడ్డి 39.49 శాతం ఓట్లు పొందారు. ఇద్దరి మధ్య ఓట్ల తేడా 1.1 శాతమే. ఇక్కడ స్వతంత్రులు, ఇతర గుర్తింపులేని పార్టీల అభ్యర్థులు ఈ తేడా కన్నా మూడింతల ఎక్కువ ఓట్లు సాధించడం గమనార్హం.
- నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్కుమార్రెడ్డికి 44.73 శాతం ఓట్లు లభిస్తే, ప్రత్యర్థి తెరాస అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డికి 42.54 శాతం ఓట్లు వచ్చాయి. వీరి మధ్య ఓట్ల వ్యత్యాసం 2.19 శాతం కాగా.. ఇక్కడా స్వతంత్రులు, ఇతర గుర్తింపు లేని పార్టీల అభ్యర్థులు దాదాపు 6 శాతం ఓట్లు రాబట్టారు.
- భువనగిరిలో నాటి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తెరాస అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ మధ్య ఓట్ల తేడా 0.43 శాతం కాగా.. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు సాధించిన ఓట్లు 4 శాతానికి పైగా ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ