తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రావాలి
పదేళ్ల యూపీఏ హయాంలో, తొమ్మిదిన్నరేళ్ల ఎన్డీయే ప్రభుత్వ హయాంలో తెలంగాణ అభివృద్ధికి ఏం చేశారన్న అంశంపై చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సవాల్ విసిరారు.
యూపీఏ, ఎన్డీయే హయాంలలో ఎవరేం చేశారో తేలుద్దాం
సీఎం రేవంత్రెడ్డికి కిషన్రెడ్డి సవాల్
ఈనాడు, హైదరాబాద్: పదేళ్ల యూపీఏ హయాంలో, తొమ్మిదిన్నరేళ్ల ఎన్డీయే ప్రభుత్వ హయాంలో తెలంగాణ అభివృద్ధికి ఏం చేశారన్న అంశంపై చర్చకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సవాల్ విసిరారు. ప్రెస్ క్లబ్ లేదా అమరవీరుల స్తూపం లేదంటే భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు చర్చకు రావాలన్నారు. సీఎం తన నెత్తిపై ‘గాడిద గుడ్డు’ బొమ్మ పెట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీన్ని ప్రజలు నమ్మరని అన్నారు. బహుశా ప్రజలకు తాను ఇచ్చేది ‘గాడిద గుడ్డు’ మాత్రమేనని ఇలా చేస్తున్నారేమోనని ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను గాలికొదిలేశారని, చేసిన, చేయబోయే పనుల గురించి చెప్పడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్రెడ్డి నిజస్వరూపాన్ని తెలంగాణ ప్రజలు తెలుసుకుంటున్నారన్నారు. బుధవారం భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డితో కలసి కిషన్రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్పై రోజురోజుకు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలుస్తామని మొదట రేవంత్రెడ్డి చెప్పారని.. ఇప్పుడు తన కాళ్ల కింద భూమి కదిలిపోతుండటంతో ఏం చేయాలో తెలియక రోజుకొకలా మాట్లాడుతున్నారని విమర్శించారు. గుజరాత్ పెత్తనానికి, తెలంగాణ పౌరుషానికి పోటీ అని ఆయన అంటున్నారని.. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ భాజపా పౌరుషం చాలని చెప్పారు. రేవంత్రెడ్డి ఏరోజైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అని కిషన్రెడ్డి ప్రశ్నించారు. ఆయన ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడారన్నారు.
కాంగ్రెస్ పార్టీది ఇటలీ డీఎన్ఏ అని.. అది ఇటలీ నేషనల్ కాంగ్రెస్ అని విమర్శించారు. రాహుల్ గాంధీ, రేవంత్రెడ్డిలను చూసి కాంగ్రెస్ను తెలంగాణ ప్రజలు గెలిపించలేదని.. కేసీఆర్పై కోపంతో, భారాస కుటుంబ పాలన, అవినీతి కారణంగానే హస్తం పార్టీని గెలిపించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ పేరుతో వసూళ్లు చేసి.. దిల్లీకి సూట్కేసులు పంపుతున్నారని ఆరోపించారు. రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ ఫేక్ వీడియోలు సృష్టించింది కాంగ్రెస్ పార్టీయేనని, దీనికి సీఎం పూర్తి బాధ్యత వహించాలన్నారు. మార్ఫింగ్ వీడియోలు సృష్టించినవారు జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదని హెచ్చరించారు. రిజర్వేషన్లను రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ అబద్ధాలు చెబుతుండగా.. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని భారాస తప్పుడు ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. భాజపాకు తెలంగాణ ప్రజలే రక్షణ కవచమని చెప్పారు. లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాంగ్రెస్, భారాసలను పాతరేయడం ఖాయమన్నారు. ప్రధాని మోదీని తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ రాజ్యాంగం కావాలో.. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అనుసరించే మోదీ పాలన కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. ఈ సందర్భంగా వరంగల్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన భారాస కార్పొరేటర్ కల్పన, ఇతర నేతలు భాజపాలో చేరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్