భాజపా కనుసన్నల్లో ఎన్నికల కమిషన్
భాజపా కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని తాము స్పష్టమైన ఆరోపణ చేస్తున్నామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు.
విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన మోదీ, అమిత్షాలపై చర్యలేవీ?
రేవంత్రెడ్డి బూతులు ప్రవచనాల్లా ఉన్నాయా?
స్వయంప్రతిపత్తిని అపహాస్యం చేసేలా ఈసీ తీరు: కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: భాజపా కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని తాము స్పష్టమైన ఆరోపణ చేస్తున్నామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్షా దారుణంగా వ్యాఖ్యలు చేసి విద్వేషాలు సృష్టిస్తుంటే.. వారిపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. గురువారం కేటీఆర్ తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో, మూసాపేట, శ్రీరామ్నగర్ రోడ్షోలలో మాట్లాడారు. భాజపా సామాజిక మాధ్యమ వేదికగా ముస్లింలపై నేరుగా విషం చిమ్ముతూ పోస్టులు పెడుతున్నా, ముస్లింలే ఎక్కువ మంది పిల్లలను కంటారని మోదీ ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేసినా ఈసీ పట్టించుకోవడం లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో అమిత్షా దేవుడి ఫొటో పెట్టుకొని ప్రచారం చేసినా.. భాజపా అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో రాముడి ఫొటో పెట్టుకొని ఓట్లు అడుగుతున్నా.. ఎన్నికల సంఘం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేటీఆర్ నిలదీశారు. వీరి వ్యాఖ్యలపై దాదాపు 20 వేల ఫిర్యాదులు వచ్చినా.. కనీసం మోదీకి నోటీసులు ఇవ్వడానికి కూడా ఎన్నికల కమిషన్ భయపడుతోందని, భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డాకు నోటీసులు ఇచ్చి సరిపెట్టిందని కేటీఆర్ దుయ్యబట్టారు. కానీ, కేసీఆర్ ప్రచారంపై 48 గంటలపాటు నిషేధం విధించేందుకు మాత్రం.. ఈసీ ఆగమేఘాల మీద స్పందించి నోటీసులు ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. ఉస్మానియా వర్సిటీలో నీళ్లు, కరెంటు బంద్ అంశంలో తప్పుడు డాక్యుమెంట్ సృష్టించిందే సీఎం రేవంత్ అని ఆరోపించారు. తప్పు చేసిన ముఖ్యమంత్రిని వదిలేసి.. ఆ తప్పును ప్రశ్నించిన క్రిశాంక్ను జైలుకు పంపించడం ఎంత వరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు.
ఓటు ద్వారానే ప్రజలు సమాధానం చెప్పాలి
‘ఇటీవల సిరిసిల్లలో జరిగిన మీడియా సమావేశంలో కేసీఆర్ను కలిసిన నేతన్నలు.. తమకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వడం లేదని ఆవేదనతో చెబితే దానిపై ఆయన స్పందించారు. నేతన్నలు నిరోధ్లు, పాపడాలు అమ్ముకోవాలని ఒక దుర్మార్గుడు అంటే.. దాన్ని ఖండిస్తూ కేసీఆర్ కొంచెం కఠిన పదం వాడారు. దానిపై కాంగ్రెస్ ఫిర్యాదు చేయగానే.. ఎన్నికల కమిషన్ వేగంగా స్పందించి కేసీఆర్పై చర్యలు తీసుకుంది. మరి రేవంత్రెడ్డి అనేక వేదికలపై దుర్భాషలాడారు. అధ్వానమైన భాష వాడారు. ఆయన మాటలు నీతి సూక్తులు, ప్రవచనాలు, సుభాషితాలా? రేవంత్రెడ్డి మీద 8 సహా కాంగ్రెస్ నాయకులపై మొత్తం 27 ఫిర్యాదులు చేశాం. ఒక్క మంత్రి కొండా సురేఖను మందలించారంతే. మిగతా ఎవ్వరిపైనా చర్య తీసుకోలేదు ఎందుకు? రాజ్యాంగం ఇచ్చిన స్వయంప్రతిపత్తిని అపహాస్యం చేసేలా ఈసీ వ్యవహరిస్తోంది. కేసీఆర్ రోడ్షోల్లో ‘ఛోటే భాయ్.. బడే భాయ్’ల మోసాలను పూసగుచ్చినట్లు వివరిస్తున్నారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. దీన్నిచూసి కాంగ్రెస్, భాజపాలకు దడ పుట్టింది. ఆ పార్టీలు చేస్తున్న కుట్రలకు ప్రజలు ఓటు ద్వారానే సమాధానం చెప్పాలి’ అని కేటీఆర్ అన్నారు.
నేను చెప్పింది తప్పైతే.. జైలుకు వెళ్లడానికి సిద్ధం
‘ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నీళ్లు, కరెంటు సమస్యలపై విద్యార్థుల ఆందోళన అంశం కేసీఆర్ దృష్టికి రావడంతో.. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. దీనిపై సీఎం రేవంత్ స్పందించి.. 2023 మే నెలలోనూ ఇలాగే చేశారంటూ మరో పోస్ట్ చేశారు. నిజానికి గతేడాది మే నెలలో ఇచ్చిన నోటీసులో నీళ్లు, కరెంటు అంశాలు లేవు. రేవంతే ఆ అంశాలను చేర్చి.. తప్పుడు డాక్యుమెంట్ను పోస్ట్ చేశారు. దీనిపై ఉస్మానియా విద్యార్థులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించింది సీఎం అయితే.. దాన్ని ప్రశ్నించిన మా నాయకుడు క్రిశాంక్ను అరెస్టు చేశారు. నేను చెప్పింది తప్పయితే.. చంచల్గూడ జైలుకి వెళ్లటానికి సిద్ధం. లేదంటే రేవంత్రెడ్డి జైలుకు వెళ్తారా? వెంటనే ఈసీ స్పందించి, తప్పుడు డాక్యుమెంట్ సృష్టించిన రేవంత్రెడ్డిని జైల్లో పెట్టాలి’ అని కేటీఆర్ డిమాండ్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
అందరి కళ్లూ అటువైపే.. నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు వారిదేనంటున్న లారా
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస