విద్యుత్ కోతలంటూ భారాస నాటకాలు
రాష్ట్రంలో విద్యుత్తు కోతలు లేనేలేవని, నిరంతరాయంగా సరఫరా చేస్తున్నా.. కరెంట్ కోతలు ఉన్నాయంటూ భారాస నేతలు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అసత్య ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్శాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
గత ఏడాది కంటే ఎక్కువ కరెంటు సరఫరా చేస్తున్నాం
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్తు కోతలు లేనేలేవని, నిరంతరాయంగా సరఫరా చేస్తున్నా.. కరెంట్ కోతలు ఉన్నాయంటూ భారాస నేతలు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి అసత్య ప్రచారం చేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్శాఖ మంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంటు పోతుందని, అసెంబ్లీ ఎన్నికల ముందు భారాస నేతలు చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం భారాస సమావేశాల్లో కరెంట్ కట్ అయినట్లు వారు నాటకాలాడుతున్నారని భట్టి విమర్శించారు. గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటివరకు రాష్ట్రమంతటా గతేడాదికన్నా ఎక్కువ విద్యుత్తును సరఫరా చేశామని వివరించారు. 2022 డిసెంబరు నుంచి 2023 ఏప్రిల్ వరకు భారాస పాలనలో రాష్ట్రంలో మొత్తం 36,207 మిలియన్ యూనిట్లు(మి.యూ) విద్యుత్తు సరఫరా కాగా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2023 డిసెంబరు నుంచి 2024 ఏప్రిల్ 30 వరకు 38,155 మి.యూ. సరఫరా చేశామని వివరించారు. ఒకరోజు గరిష్ఠ డిమాండ్ 15,497 మెగావాట్లకు చేరినా కోతల్లేకుండా చేసినట్లు వెల్లడించారు. వేసవిలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరడంతో అక్కడక్కడా లోడ్ పెరిగి ఒక్కోసారి కరెంటు సరఫరాలో సాంకేతిక అవాంతరాలు తలెత్తితే సిబ్బంది పరిష్కరిస్తున్నారని తెలిపారు. గత ఏడాది ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 30 వరకు భారాస పాలనలో గ్రేటర్ హైదరాబాద్ నగర పరిధిలో 1369 సార్లు 11 కేవీ లైన్లు ట్రిప్ అయి 580 గంటలు విద్యుత్ సరఫరాకు అంతరాయం వాటిల్లిందన్నారు. ఈ ఏడాది అదేవారంలో 272 చోట్ల 11 కేవీ లైన్లు ట్రిప్ అయి 89 గంటలు మాత్రమే సరఫరాలో అంతరాయం కలిగిందని చెప్పారు. గత ఏడాది ఇదేవారంలో 301 ట్రాన్స్ఫార్మర్లు ఫెయిలవ్వగా.. ఈసారి 193 విఫలమైనట్లు ఆ ప్రకటనలో భట్టి పేర్కొన్నారు.
మోదీ, నవీన్ పట్నాయక్ ఒడిశాకు నష్టం చేస్తున్నారు
ఒడిశాలో మోదీ, నవీన్ పట్నాయక్లు కలిసి ఉంటూ.. దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలకు నష్టం చేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. ఒడిశా రాష్ట్రం రాయగడ లోక్సభ నియోజకవర్గం పరిధిలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో బాక్సైట్ తవ్వకాలకు వేదాంత కంపెనీ సిద్ధం కాగా రాహుల్గాంధీ వచ్చి ఓ సైనికుడిలా అడ్డుకున్నారని ఆయన తెలిపారు. ఒడిశా వనరులు స్థానిక ప్రజలకే చెందాలని రాహుల్గాంధీ గట్టిగా చేసిన పోరాటం వల్లనే బాక్సైట్ గనులు సురక్షితంగా ఉన్నాయని భట్టి చెప్పారు. రాహుల్ ఈ బహిరంగ సభకు హాజరు కావాల్సి ఉన్నా రాయబరేలిలో నామినేషన్ కార్యక్రమం ఉండటంతో రాలేకపోయినట్లు తెలిపారు. దేశ సంపదను అంబానీ, అదానీ వంటి కొద్దిమంది మిత్రులకు మోదీ పంచి పెట్టడాన్ని రాహుల్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇండియా కూటమిని గెలిపించి దేశ సంపదను కాపాడుకుందామని భట్టి పిలుపునిచ్చారు. ఈ సభకు తెలుగువారు పెద్దఎత్తున హాజరయ్యారు. కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. సభలో ఏఐసీసీ నాయకులు భక్త చరణ్దాస్, ఆర్.సి.కుంతియా, మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి