కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ.. బయ్యారంలో ఉక్కు కర్మాగారం
రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ‘ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సౌభాగ్యం’ పేరుతో తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోను శుక్రవారం ప్రకటించింది.
విభజన చట్టం హామీలు అమలు చేస్తాం
ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలు వెనక్కి..
హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్
పాలమూరు ఎత్తిపోతల, మేడారం జాతరలకు జాతీయ హోదా
తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ‘ఇందిరమ్మ రాజ్యం.. ఇంటింటా సౌభాగ్యం’ పేరుతో తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోను శుక్రవారం ప్రకటించింది. ఇందులో 23 అంశాలున్నాయి. ఐటీ, పారిశ్రామిక, విద్య, వైద్య, సాగునీటి రంగాల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాల కల్పనతో అన్ని ప్రాంతాలకు ప్రయోజనం కలిగించేలా ఎన్నికల ప్రణాళికను రూపొందించినట్లు వివరించింది. ‘ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీలు’ పేరిట ఎన్నికల ప్రణాళికను పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ, మంత్రి శ్రీధర్బాబు గాంధీభవన్లో శుక్రవారం విడుదల చేశారు. ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌధరీ, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్, అజారుద్దీన్, అంజన్కుమార్ యాదవ్, చిన్నారెడ్డి, జానయ్య, దానం నాగేందర్, రోహిణ్రెడ్డి, కోదండరెడ్డి, నిరంజన్, మ్యానిఫెస్టో కమిటీ సభ్యులు హాజరయ్యారు. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వచ్చాక.. 23 అంశాలతో తెలంగాణకు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేసింది. రాష్ట్రానికి సంబంధించి ఇస్తున్న హామీలను జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి ఆమోదం తీసుకుని మ్యానిఫెస్టోను విడుదల చేశామని కాంగ్రెస్ నేతలు వివరించారు.
‘న్యాయ్ పత్ర’ పేరుతో ఏఐసీసీ ఇప్పటికే మ్యానిఫెస్టోలోని హామీల్ని ‘ఐదు న్యాయాల’ పేరుతో తెలుగులో కాంగ్రెస్ నాయకులు విడుదల చేశారు. మ్యానిఫెస్టోను ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి విడుదల చేయాల్సి ఉండగా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తర్ప్రదేశ్కు వెళ్లడంతో హాజరు కాలేకపోయారు.
తెలంగాణకు ప్రత్యేక హామీలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారంటీలతో ఎన్నికల ప్రణాళిక విడుదల చేసిన కాంగ్రెస్.. లోక్సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టోను రూపొందించింది. ఇందులో 23 హామీలను ఇచ్చింది.
1. హైదరాబాద్ మహా నగరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్వెస్ట్మెంట్ రీజియన్(ఐటీఐఆర్) ప్రాజెక్టు పునఃప్రారంభం
2. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం..
- కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు
- బయ్యారంలో ఉక్కు కర్మాగారం నిర్మాణం
- హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)
- హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆనుకుని వేగవంతమైన రైల్వే ప్రాజెక్టు
- మైనింగ్ విశ్వవిద్యాలయం ఏర్పాటు
3. విలీనమైన గ్రామాలు వెనక్కి: భద్రాచలం ఆలయ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 అడ్డుగా ఉంది. ఏపీలో విలీనమైన ఐదు గ్రామాలు-ఎటపాక, గుండాల, పురుషోత్తపట్నం, కన్నెగూడెం, పిచ్చుకలపాడులను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తాం.
4. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా
5. హైదరాబాద్లో నీతి ఆయోగ్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు
6. నూతన విమానాశ్రయాల ఏర్పాటు
7. రామగుండం-మణుగూరు నూతన రైల్వే లైన్ నిర్మాణం
8. నూతనంగా నాలుగు సైనిక్ స్కూళ్ల ఏర్పాటు
9. కేంద్రీయ విద్యాలయాల సంఖ్య పెంపు
10. నవోదయ విద్యాలయాల సంఖ్య పెంపు
11. జాతీయ క్రీడల విశ్వవిద్యాలయం ఏర్పాటు
12. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(ఐఐఎస్ఈఆర్) ఏర్పాటు
13. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్(ఐఐఎఫ్టీ) ఏర్పాటు
14. భారత వ్యవసాయ పరిశోధన సంస్థ(ఐఏఆర్ఏ) ఏర్పాటు
15. నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు
16. అధునాతన వైద్య పరిశోధనల కోసం ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) పరిధిలో కేంద్ర వైద్య పరిశోధన సంస్థ ఏర్పాటు
17. 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం కేంద్ర ప్రభుత్వ నిధులు గ్రామ సర్పంచులకు నేరుగా బదిలీ
18. ప్రతి ఇంటికి సౌరశక్తితో కూడిన సొంత విద్యుదుత్పత్తి వ్యవస్థ
19. పారిశ్రామిక పురోగతికి కారిడార్లు..
- హైదరాబాద్-బెంగళూరు ఐటీ, పారిశ్రామిక కారిడార్
- హైదరాబాద్-నాగ్పుర్ కారిడార్
- హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్
- హైదరాబాద్-నల్గొండ-మిర్యాలగూడ పారిశ్రామిక కారిడార్
- సింగరేణి పారిశ్రామిక కారిడార్
20. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంస్కృతిక, వినోద కేంద్రం ఏర్పాటు
21. మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరకు జాతీయ హోదా 22. డ్రై పోర్టు ఏర్పాటు
23. హైదరాబాద్లో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్