భాజపా, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్
రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని.. తెలంగాణ ప్రజల అస్తిత్వమైన భారాసను లేకుండా చేయాలని కుట్ర పన్నాయని, మాజీ సీఎం కేసీఆర్ను దెబ్బతీయాలని చూస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
భారాసను లేకుండా చేయాలని కుట్ర
మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపణ
సిద్దిపేట టౌన్, హుస్నాబాద్ గ్రామీణం - న్యూస్టుడే: రాష్ట్రంలో భాజపా, కాంగ్రెస్ పార్టీలు ఒక్కటై మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని.. తెలంగాణ ప్రజల అస్తిత్వమైన భారాసను లేకుండా చేయాలని కుట్ర పన్నాయని, మాజీ సీఎం కేసీఆర్ను దెబ్బతీయాలని చూస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. సిద్దిపేటలో విలేకరుల సమావేశంలోను, అక్కన్నపేటలో కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్కుమార్ ఎన్నికల ప్రచారసభలోను ఆయన శుక్రవారం మాట్లాడారు. ‘‘భారాస ఉంటే ఏ రోజైనా మళ్లీ ప్రజలు కేసీఆర్ వైపు వెళ్తారన్న భయంతోనే భాజపా, కాంగ్రెస్ ఒక్కటయ్యాయి. చెరో 8 లోక్సభ స్థానాలను పంచుకుని, మిగిలినచోట్ల డమ్మీ అభ్యర్థులను నిలిపాయి. కాంగ్రెస్కు ఇచ్చిన స్థానాల్లో భాజపా ప్రచారం చేయదు.. భాజపాకు ఇచ్చిన సీట్లలో కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థులను పెట్టి నామమాత్రపు ప్రచారం చేస్తోంది. ఆగస్టు 15 తర్వాత సీఎం రేవంత్రెడ్డి సిద్దిపేటకు వస్తాననడాన్ని స్వాగతిస్తున్నా.. అయితే నేను చేసిన సవాల్ను వెంటనే స్వీకరించాలి. ఇప్పటికీ దాన్ని స్వీకరించకుండానే సీఎం ఏవేవో మాట్లాడుతున్నారు. ఆగస్టు 15లోపు ఆరు గ్యారంటీలు నెరవేర్చి, రైతు రుణమాఫీ చేస్తే నేనే సీఎం రేవంత్రెడ్డికి శాలువా కప్పి సిద్దిపేటకు స్వాగతిస్తా. నా రాజీనామాను ఆమోదింపజేసుకుంటా. ఒకవేళ హామీలు అమలు చేయకుండా, రాజీనామా చేయకపోతే కొడంగల్ చౌరస్తాలో ముక్కు నేలకు రాస్తారా? సీఎం హోదాలో రేవంత్రెడ్డి హుందాగా మాట్లాడితే బాగుంటుంది. ఆయన చేసిన అసందర్భ వ్యాఖ్యలతో రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా పోయాయి. స్థిరాస్తి రంగం కుదేలయింది. కేసీఆర్ బస్సుయాత్ర సూపర్హిట్ కావడంతోనే కాంగ్రెస్, భాజపాలు ‘నువ్వు కొట్టినట్టు చెయ్యు.. నేను తిట్టినట్టు చేస్తా’ అన్నట్లు ఒక్కటయ్యాయి. సీఎం నోట ఎప్పుడూ నిజాలు రావు. సిద్దిపేటలో అభివృద్ధి జరగలేదన్న దానికంటే అబద్ధం మరొకటి లేదు. ఆయన సీఎం అయ్యారంటే అది సిద్దిపేట పుణ్యమే. తెలంగాణ ఏర్పడకపోతే ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారు కాదు. సిద్దిపేటకు, కేసీఆర్కు ఆయన రుణపడి ఉండాలి. భాజపా మతాన్ని, కాంగ్రెస్ రిజర్వేషన్లను అడ్డం పెట్టుకుని ఓట్లు దండుకోవాలని చూస్తున్నాయి. రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ ఉందని స్వయంగా ప్రధాని మోదీ చెప్పారు. ఆ డబ్బులను దిల్లీకి పంపుతున్నారన్నారు. అది నిజమైతే ఈడీ, ఐటీలు ఎందుకు రావడం లేదు? దీనివల్ల ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం ఉందని అర్థమవుతోంది.
హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పొడిగించే కుట్ర..
వచ్చే జూన్ నాటికి తెలంగాణ ఏర్పడి పదేళ్లు పూర్తవుతాయి. హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు తెదేపా అధినేత చంద్రబాబుతో పాటు కొందరు ప్రయత్నిస్తున్నారు. దీన్ని అడ్డుకోవాలంటే పార్లమెంటులో గులాబీ జెండా ఉండాలి. కాంగ్రెస్, భాజపాలకు రాజకీయ ప్రయోజనాలు తప్ప రాష్ట్రం గురించి ఆలోచన లేదు. మా ప్రభుత్వ హయాంలో లంబాడాలకు ఎంతో మేలుచేశాం. చందూలాల్, సత్యవతి రాథోడ్లకు మంత్రి పదవులు ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం లంబాడాల్లో ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వలేదు’’ అని హరీశ్రావు విమర్శించారు. ఈ కార్యక్రమాల్లో కరీంనగర్ భారాస అభ్యర్థి వినోద్కుమార్, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్కుమార్, భారాస నాయకులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..