కాంగ్రెస్ వ్యతిరేక మార్పు మొదలైంది
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మార్పు మొదలైందని చెప్పిందో.. పార్లమెంటు ఎన్నికల్లో నిజంగానే కాంగ్రెస్కు వ్యతిరేకంగా మార్పు మొదలైందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు.
ఆరు గ్యారంటీల్లో ఒక్కటీ అమలు చేయలేదు
రాష్ట్రానికి ఒక్క మేలూ చేయని భాజపాకు ఎందుకు ఓటేయాలి?
ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవం వస్తోంది
అత్యధిక ఎంపీ సీట్లలో భారాసదే గెలుపు
‘మీట్ ది మీడియా’లో హరీశ్రావు ధీమా
ఈనాడు-హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మార్పు మొదలైందని చెప్పిందో.. పార్లమెంటు ఎన్నికల్లో నిజంగానే కాంగ్రెస్కు వ్యతిరేకంగా మార్పు మొదలైందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు స్పష్టం చేశారు. ‘‘కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. పంట చేతికొచ్చినా పెట్టుబడి సాయం అందని మార్పు మొదలైంది. కేసీఆర్ కిట్ నిలిచిపోయి.. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లే మార్పు మొదలైంది. రివర్స్గేర్లో పోతున్న కాంగ్రెస్ నుంచి ప్రజలు మార్పు కోరుకుంటున్నారు’’ అని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వస్తోందని, కాంగ్రెస్, భాజపాల కంటే భారాసనే అత్యధిక ఎంపీ సీట్లను గెలుచుకోబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘మీట్ ది మీడియా’ కార్యక్రమంలో హరీశ్రావు మాట్లాడారు. టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, తదితరులు పాల్గొన్నారు.
గ్యారంటీల అమలు పచ్చి అబద్ధం
‘‘ఆరు గ్యారంటీల్లో ఐదింటిని అమలు చేశామని కాంగ్రెస్ ప్రభుత్వం పచ్చి అబద్ధాలు చెబుతోంది. మొదటి గ్యారంటీ.. మహాలక్ష్మి కింద 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.2500 ఇచ్చే హామీ అమలు చేశారా? రెండోది.. రైతుబంధు రూ.15వేలు, రూ.2 లక్షల రుణమాఫీ, వడ్లు, మొక్కజొన్నలకు క్వింటాకు రూ.500 బోనస్, వ్యవసాయ కూలీలకు రూ.12వేలు ఇచ్చారా? మూడో గ్యారంటీ.. ఇందిరమ్మ ఇళ్లు కింద రూ.5 లక్షలు, 250 గజాల స్థలం..ఇళ్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇచ్చారా? నాలుగోది.. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు? ఐదో గ్యారంటీ.. చేయూత కింద పింఛన్లను రూ.4వేలకు పెంచుతామన్నారు.. పెంచారా? గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఉచిత కరెంటును 91 లక్షల మంది లబ్ధిదారులకుగాను.. 30 లక్షల మందికే అమలు చేస్తున్నారు. హామీలను అమలు చేస్తామని బాండ్ పేపర్ రాసిచ్చి మాటనిలుపుకోని ఆపార్టీకి ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.
రాష్ట్రం పరువు తీసేలా రేవంత్ భాష
ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ను ఉద్దేశించి.. పేగులు తీసి మెడలో వేసుకుంటా.. గుడ్లు తీసి గోళీలాడుకుంటా.. అని అసభ్యకర భాషను రేవంత్ ఉపయోగించడాన్ని ప్రజలు ఆమోదించడం లేదు. ప్రజాపాలనలో ప్రజలకు అందుబాటులో ఉంటానన్న ముఖ్యమంత్రి.. కేవలం ఒక్క మొదటిరోజు మాత్రమే కనిపించి మాయమయ్యారు. పార్టీ మారితే వెంటనే సభ్యత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే.. భారాస ఎమ్మెల్యే దానం నాగేందర్ సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ చెబుతున్న దానికి.. రేవంత్ చేస్తున్నదానికీ పొంతన లేదు.
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కుట్ర
తెలంగాణలోని 7 మండలాలను, సీలేరు ప్రాజెక్టును కేంద్రం ఏపీలో కలిపింది. వీటిపై భాజపా ప్రభుత్వం పెట్టిన బిల్లుకు కాంగ్రెస్ మద్దతిచ్చింది. దీన్ని వ్యతిరేకించిన పార్టీ భారాసనే. రేవంత్ భాజపాలో చేరుతారని ఆ పార్టీ నేతలే చెబుతుంటే.. వారి మాటలను ఆయన ఎందుకు ఖండించడం లేదు? 8 సీట్లలో భాజపా గెలుపునకు రేవంత్ సహకరిస్తున్నారు. వచ్చే జూన్ 2తో పదేళ్ల ఉమ్మడి రాజధాని గడువు ముగిసిపోతోంది. ఇప్పుడు మరికొన్నాళ్లు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని కుట్ర చేస్తున్నారు. పార్లమెంటులో భారాస ఎంపీలుంటేనే ఉమ్మడి రాజధాని కుట్రను అడ్డుకోగలరు. రిజర్వేషన్ల రద్దు అనేది కాంగ్రెస్, భాజపా ఆడుతున్న నాటకం. గత పదేళ్ల పాలనలో భాజపా రాష్ట్రానికి ఒక్క మేలూ చేయలేదు. అలాంటివారికి ఎందుకు ఓటేయాలి? అసెంబ్లీ ఎన్నికలప్పుడు కవితను అరెస్టు చేయలేదు గనుక.. భాజపా, భారాస ఒక్కటేనని ప్రచారం చేసి మైనారిటీల ఓట్లు కాంగ్రెస్ సంపాదించుకుంది. ఇప్పుడు కవిత అరెస్టు అయ్యారు. కుమ్మక్కైతే ఎందుకు అరెస్టు చేస్తారు? కేంద్రంలో ప్రాంతీయ పార్టీలే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తాయి. కేసీఆర్ ప్రధానమంత్రి అవుతారో లేదో ఇప్పుడే చెప్పలేం’’ అని హరీశ్రావు వెల్లడించారు.
తీరికలేని ప్రచారం.. కాలిబాటపైనే అల్పాహారం
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారాస నేత, మాజీమంత్రి హరీశ్రావు తీరిక లేకుండా పాల్గొంటున్నారు. మెదక్, జహీరాబాద్, కరీంనగర్ లోక్సభ స్థానాల పరిధిలో ఆయా అభ్యర్థుల తరఫున కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ నుంచి దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట-భూంపల్లిలో ప్రచారానికి వెళ్తూ, సిద్దిపేట పట్టణంలోని హౌసింగ్బోర్డు చౌరస్తాలో కాలిబాటపై ఫుడ్కోర్టు వద్ద అల్పాహారం చేశారు. ఆయన వెంట మెదక్ లోక్సభ భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి ఉన్నారు. అనంతరం కొందరు హరీశ్రావుతో స్వీయచిత్రాలు దిగారు.
న్యూస్టుడే, సిద్దిపేట టౌన్
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో
-
చివరి మ్యాచ్లో ముంబయిపై లఖ్నవూ గెలుపు.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ఇరు జట్లు
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు
-
మరో 30 ఏళ్లకు మనం అంగారకుడి సిటీలో: ఎలాన్ మస్క్ ఆసక్తికర పోస్ట్
-
గాల్లో ఉండగా విమానం ‘ఏసీ’లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్!
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు