కాంగ్రెసోళ్లు ఏమీ చేయరు
‘పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఎవరి మధ్య అంటే ఆగర్భ శ్రీమంతుడికి... భూగర్భ కార్మికుడికి మధ్య. కార్మికుడు గెలవాలా? ఆగర్భ శ్రీమంతుడు గెలవాలా? ఆలోచించండి.
అడ్డగోలు హామీలు తప్ప అమల్లేదు
రైతులకు రుణ మాఫీపై సీఎం రేవంత్ దేవుళ్ల మీద ఒట్లు పెడుతున్నారు
ఉచిత బస్సు ప్రయాణ పథకంతో సిగలు పట్టుకొని కొట్లాడుతున్న మహిళలు
మాజీ సీఎం కేసీఆర్
ఈటీవీ- ఆదిలాబాద్, మంచిర్యాల పట్టణం, న్యూస్టుడే: ‘పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఎవరి మధ్య అంటే ఆగర్భ శ్రీమంతుడికి... భూగర్భ కార్మికుడికి మధ్య. కార్మికుడు గెలవాలా? ఆగర్భ శ్రీమంతుడు గెలవాలా? ఆలోచించండి. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. భాజపాతో మనకేం ఒరగలేదు. ఒక్క భారాసయే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్ష’ అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తరఫున ఆయన శనివారం రాత్రి మంచిర్యాల ఐబీ చౌరస్తాలో ఏర్పాటుచేసిన రోడ్షోలో మాట్లాడారు. ‘‘నోటికి ఏదొస్తే అది అన్నట్లు సీఎం రేవంత్రెడ్డి అడ్డగోలు హామీలు ఇచ్చారు. రైతులకు రుణ మాఫీపై ఏ ఊరికివెళ్తే ఆ ఊరి దేవుడి మీద ఒట్టు పెడుతున్నారు. మొదట డిసెంబరు 9 అన్నారు అది పోయింది.. మళ్లీ ఇప్పుడు ఆగస్టు 15 అంటున్నారు. కాంగ్రెసోళ్ల మాట నమ్మేటట్లు ఉందా? ఏమీ చేయరని తేలింది’ అని అన్నారు. ‘‘రైతుబంధు ఇవ్వడం లేదు. సీఎం సహాయ నిధి కింద సాయాన్ని నిలిపివేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, తులం బంగారం ఏమయ్యాయి? భారాస ప్రభుత్వంలో దళితబంధు పథకం తెచ్చాం. 1.30 లక్షల మందికి మంజూరు చేశాం. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆ డబ్బులను వాపసు తీసుకుంది. దళితులు అర్హులు కారా? వారికోసం కేటాయించిన డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు? గిరిజనులకు నాలుగున్నర లక్షల ఎకరాల పోడుభూములు ఇచ్చాం. వారికీ భారాస ప్రభుత్వం రైతు బంధు, బీమా ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రూపాయి కూడా ఇవ్వడం లేదు. విద్యార్థులకు ఉపకార వేతనాలు లేవు. వీధిదీపాలు పోతే మరమ్మతులు లేవు. కేసీఆర్ కిట్లు లేవు. కొత్త వైద్యకళాశాలలకు అనుమతులు లేవు. ధాన్యాన్ని కొనరు. వరికి బోనస్.. బోగస్సే. సీఎం రేవంత్ ఎవరినీ గౌరవించరు. ఐదునెలల్లో పథకాలన్నింటినీ ఆపేశారు. చెన్నూరు ఎత్తిపోతల పథకం, మంచిర్యాల మార్కెట్ సమీకృత భవన సముదాయాన్ని నిలిపివేశారు. ఈ అన్యాయాన్ని అరికట్టాలంటే, ప్రజలకు న్యాయం జరగాలంటే భారాస బలమే మన బలం అని గుర్తించాలి. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పింది. అందులో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పనికిమాలిన పథకం. దానివల్ల మహిళలు సిగలు పట్టుకొని కొట్టుకుంటున్నారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటోరిక్షా కార్మికుల బతుకులు ఆగమై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు’’ అని కేసీఆర్ అన్నారు.
మంచిర్యాల జిల్లా ఉండాలా? పోవాలా?
‘‘ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పరిపాలనా సౌలభ్యం కోసం నాడు భారాస ప్రభుత్వం విభజించింది. కొత్తగా మంచిర్యాల, నిర్మల్, కుమురంభీం జిల్లాలను ఏర్పాటు చేసింది. ఎన్నికలైన మరుసటి రోజు నుంచే జిల్లాలను రద్దు చేస్తానని రేవంత్రెడ్డి అంటున్నారు. మంచిర్యాల జిల్లా ఉండాలా? పోవాలా? మంచిర్యాల జిల్లా ఉండాలంటే భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ని గెలిపించండి. మంచిర్యాల జిల్లా పోయినా పర్వాలేదనేవాళ్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించి పుణ్యం కట్టుకోండి.
నరేంద్ర మోదీది గ్యాస్ కంపెనీ.. అన్నీ ఉత్తి మాటలే
పదేళ్ల కిందట గెలిచినప్పుడు మోదీ జన్ధన్ఖాతాలలో రూ.15 లక్షల చొప్పున వేస్తానన్నారు.. వచ్చాయా? బేటీ బచావో.. బేటీ పఢావో అన్నారు.. ఏం జరిగింది? నరేంద్ర మోదీది గ్యాస్ కంపెనీ... అన్నీ ఉత్తి మాటలే. అందుకే భాజపాకు ఓటేసినా గోదావరిలో పడేసినా ఒకటే. అందుకని అత్యధిక మెజార్టీతో కొప్పుల ఈశ్వర్ని గెలిపించండి.
జైళ్లకు భయపడను..
తెలంగాణ హక్కులు కాపాడటం కోసం పోరాడతా. నేనున్నంత వరకు తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోను. నా ప్రాణాలను బలిపెట్టి అయినా కాపాడుకుంటా. జైళ్లకు భయపడను’’ అని కేసీఆర్ అన్నారు.
అడుగడుగునా ఘనస్వాగతం
గోదావరిఖని నుంచి బస్సులో ఇందారం, శ్రీరాంపూర్ మీదుగా మంచిర్యాలకు చేరుకున్న కేసీఆర్కు అడుగడుగునా ఘనస్వాగతం లభించింది. మంచిర్యాల ఐబీ చౌరస్తాకు భారీగా జనం తరలి వచ్చారు. కాగితపు పూలు, టపాసుల పేలుళ్లు, డప్పుల దరువులు, కళాకారుల ఆటపాటల మధ్య కోలాహలం నెలకొంది. సాయంత్రం ఆరుగంటల నుంచి రోడ్షో ముగిసేవరకు జనం వేచి ఉన్నారు. రోడ్షోలో పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యేలు దివాకర్రావు, బాల్క సుమన్, దుర్గం చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి ప్రైవేటుపరమైతే బతుకులు ఆగమే..
ముఖ్యమంత్రి రేవంత్ దావోస్, ఆస్ట్రేలియా వెళ్లి సింగరేణిపై ఒప్పందం చేసుకున్నారు. నరేంద్రమోదీ నా మెడపై కత్తి పెట్టి ఆస్ట్రేలియా బొగ్గు కొనాలని, అదానీ బొగ్గు కొనాలని ఒత్తిడి చేస్తే నేను కొనలేదు. ఈ ముఖ్యమంత్రి అదానీని ఆహ్వానించారు. సింగరేణిని ప్రైవేటుపరం చేసే కుట్ర చేస్తున్నారు. తెలంగాణ కొంగుబంగారమైన సింగరేణి ప్రైవేటుపరమైతే మన బతుకులు ఏవిధంగా ఆగమవుతాయో ఆలోచించాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
పుతిన్, జిన్పింగ్ ఆలింగనంపై.. వైట్హౌస్ జోకులు