9లోగా సంపూర్ణంగా రైతు భరోసా
‘‘రైతుభరోసా నిధులు జమ చేయలేదని కేసీఆర్, హరీశ్రావులు అంటున్నారు. డిసెంబరులోనే జమ చేయడం మొదలుపెట్టాం.
ఏ ఒక్కరికి అందకున్నా ముక్కు నేలకు రాస్తా
రూ.7,500 కోట్లు జమ చేస్తే కేసీఆర్ క్షమాపణ చెబుతారా?
భాజపాకు ఓటేస్తే ప్రజాస్వామ్యానికి, రిజర్వేషన్లకు చేటు
ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తలదూర్చను
కొత్తగూడెం జనజాతర సభ, కొత్తకోట, సీతాఫల్మండి, ముషీరాబాద్ కార్నర్ మీటింగ్లలో సీఎం రేవంత్రెడ్డి
ఈటీవీ-ఖమ్మం, ఈనాడు-మహబూబ్నగర్, హైదరాబాద్, ముషీరాబాద్, సికింద్రాబాద్, రాంనగర్-న్యూస్టుడే: ‘‘రైతుభరోసా నిధులు జమ చేయలేదని కేసీఆర్, హరీశ్రావులు అంటున్నారు. డిసెంబరులోనే జమ చేయడం మొదలుపెట్టాం. 69 లక్షల మంది రైతులకు గాను ఇప్పటివరకు 65 లక్షల మందికి అందించాం. మిగిలిన 4 లక్షల మంది ఖాతాల్లోకి మే 9వ తేదీలోపు సొమ్ము జమ చేస్తాం. ఖమ్మం నుంచి అలంపూర్ వరకు ఏ ఒక్క రైతుకైనా ఆలోపు అందకపోతే అమరవీరుల స్తూపం వద్ద బహిరంగ చర్చకు, ముక్కు నేలకు రాసేందుకు సిద్ధం. ఒకవేళ 9లోపు రైతులందరికీ రూ.7,500 కోట్లు జమ చేస్తే.. క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసేందుకు కేసీఆర్ సిద్ధమా’’ అని పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి సవాల్ విసిరారు. కొత్తకోట కురుమూర్తిస్వామి సాక్షిగా ఆగస్టు 15లోగా రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తానన్నారు. గత భారాస ప్రభుత్వం తమపై రూ.7 లక్షల కోట్ల అప్పుల కుంపటి పెట్టినా.. రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మే 9 వరకు అందరి ఖాతాల్లో ‘ఆసరా’ పింఛన్ సొమ్ము జమ చేస్తామన్నారు. 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మార్చుతామన్న భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి దుశ్యంత్ కుమార్ గౌతమ్ వ్యాఖ్యలపై ఆ పార్టీకి చెందిన తెలంగాణ నేతలు సమాధానం చెప్పాలన్నారు. భాజపాకు వేసే ప్రతి ఓటూ ప్రజాస్వామ్యం, రిజర్వేషన్లకు చేటు చేస్తుందన్నారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో, వనపర్తి జిల్లా కొత్తకోటలో రోడ్షో, కూడలి సమావేశంలో, సికింద్రాబాద్లోని సీతాఫల్మండి, ముషీరాబాద్లలో రోడ్షోలు, కార్నర్ మీటింగ్లలో రేవంత్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ‘‘రాష్ట్రంలో 2004 నుంచి 2014 వరకూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే రాజధాని నగరంలో అభివృద్ధి జరిగింది. అప్పట్లో ఎంపీగా ఉన్న అంజన్కుమార్, మంత్రిగా ఉన్న దానం నాగేందర్ అభివృద్ధి పనులు చేపట్టారు. 1.5 కోట్ల మంది తాగునీటి సమస్య తీర్చేందుకు కృషి చేశారు. నగరంలో ఫ్లైఓవర్లు, పీవీ ఎక్స్ప్రెస్ వే, నెక్లెస్ రోడ్ వంటివి కాంగ్రెస్సే తీసుకొచ్చింది. శిల్పారామం కూడా తీసుకొచ్చాం. నగరంలో పరుగులు పెడుతున్న మెట్రోరైలును వైఎస్, జైపాల్రెడ్డిలు అందుబాటులోకి తెచ్చారు. కాంగ్రెస్ అందుబాటులోకి తెచ్చిన ఐటీ, ఫార్మా పరిశ్రమలు, ఓఆర్ఆర్లను భారాస, భాజపాలు కాస్త అభివృద్ధి చేశాయి. విభజన హామీలు పదేళ్లైనా పూర్తి చేయకుండా రాష్ట్రానికి భాజపా గాడిదగుడ్డు ఇచ్చింది.
కత్తులు తీసుకుని బయలుదేరారు..
పాలమూరును అభివృద్ధి చేద్దామని, నీళ్లు ఇచ్చి పచ్చని పైర్లు పండించాలని, చదువుకున్న నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు ఇవ్వాలని నేను చూస్తోంటే.. కుర్చీల్లోంచి దించేసేందుకు కొందరు కత్తులు, గొడ్డళ్లు తీసుకుని బయలుదేరారు. రేవంత్రెడ్డిని జైలుకు పంపైనా సరే.. రిజర్వేషన్లు రద్దు చేస్తామని భాజపా అంటోంది. ఆ పార్టీకి డి.కె.అరుణ వత్తాసు పలుకుతున్నారు. మోదీతో, అమిత్షాలతో మాట్లాడి దిల్లీ పోలీసులను తీసుకొచ్చారు. తనపై రేవంత్రెడ్డి పగబట్టారని, కాంగ్రెస్ను ఓడగొట్టేవరకు ఊరుకోబోనని ఆమె అంటున్నారు. పానగల్ నుంచి జడ్పీటీసీ సభ్యురాలిని చేసినందుకు, గద్వాల నుంచి ఎమ్మెల్యే చేసినందుకు, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిని చేసినందుకు కాంగ్రెస్ను ఓడించాలా? పాలమూరును ఎడారిగా మార్చేలా, నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకునేలా కుట్ర జరుగుతోంది. దాన్ని తిప్పికొట్టాలి. సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్ను గెలిపిస్తే ఆయనను కేంద్రమంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా. కిషన్రెడ్డి హైదరాబాద్ అభివృద్ధికి నిధులు తీసుకురాలేదు. మూడేళ్ల క్రితం వరదలొస్తే కేంద్రం నుంచి రూ.పది కూడా తేలేదు. రాష్ట్రానికి రావాల్సిన రైల్వే, అభివృద్ధి ప్రాజెక్టులు గుజరాత్కు తరలిపోతుంటే అడ్డుకోలేదు.
దేశానికి దిక్సూచి.. ఖమ్మం జిల్లా
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జరిగిన ఉద్యమాల స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇక్కడి ప్రజలు 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 10 శాసనసభ స్థానాలకు గాను భారాసను ఒక్కో సీటుకే పరిమితం చేశారు. ఇదే స్ఫూర్తితో ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల పరిధిలోని ప్రజలు కదలాలి. రెండుచోట్లా కాంగ్రెస్ అభ్యర్థులకు 3 లక్షల చొప్పున మెజారిటీ ఇవ్వాలి. దేశంలోనే అత్యధిక మెజారిటీ వచ్చిన లోక్సభ స్థానంగా ఖమ్మంను నిలపాలి. నేను కాంగ్రెస్లో చేరాక అహ్మద్ పటేల్ను కలిశాను. గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్కు వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 22 జిల్లాలకు మాత్రమే సీఎం అని, ఖమ్మం జిల్లాలో ప్రతి కార్యకర్త సీఎం లాంటి శక్తిమంతుడే అని ఆయనకు అధిష్ఠానం చెప్పిందని అహ్మద్ పటేల్ గుర్తుచేశారు. అందుకే దేశానికి దిక్సూచిగా ఉండే ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఎక్కువగా తలదూర్చను’’ అని రేవంత్ సరదాగా వ్యాఖ్యానించారు.
తప్పుడు కేసులకు కాంగ్రెస్ భయపడదు: భట్టి
రిజర్వేషన్లపై ముఖ్యమంత్రి నినాదానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని.. తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. కొత్తగూడెం సభలో ఆయన మాట్లాడారు. ‘‘ఐదేళ్లలో మహిళలకు రూ.లక్ష కోట్ల వడ్డీలేని రుణాలిస్తాం. సింగరేణిని నిండా ముంచిన కేసీఆర్.. ఆ సంస్థ గురించి మాట్లాడటం తగదు. సింగరేణికి బొగ్గుబావులు అందకుండా చేసిందే భారాస ప్రభుత్వం’’ అని ధ్వజమెత్తారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇన్ని రోజులు, అన్ని రోజులు ఉంటుందని మాట్లాడుతున్న వారికి బుద్ధిచెప్పేందుకు లోక్సభ ఎన్నికలు ముమ్మాటికీ రిఫరెండమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భాజపా ఏమాత్రం ప్రభావం చూపదని, భారాసది ముగిసిన అధ్యాయమని పేర్కొన్నారు. మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న భాజపాకు బుద్ధి చెప్పాలని కోరారు. కేంద్రం ఎన్ని కేసులు పెట్టినా, గత భారాస ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా బెదరని చిరుత రేవంత్రెడ్డి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సింగరేణి సంపదను కేసీఆర్, ఆయన కుటుంబం దోచేసిందని ఆరోపించారు. కార్యక్రమాల్లో రాజ్యసభ సభ్యులు రేణుకాచౌదరి, అనిల్కుమార్ యాదవ్, తెజస అధ్యక్షుడు కోదండరాం, ఎంపీ అభ్యర్థులు రఘురాంరెడ్డి(ఖమ్మం), బలరాంనాయక్(మహబూబాబాద్), వంశీచంద్రెడ్డి(మహబూబ్నగర్), మల్లు రవి(నాగర్కర్నూల్), ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, నాయకులు జితేందర్రెడ్డి, అంజన్కుమార్, మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కొత్తగూడెంలో సీఎం హెలికాప్టర్ను, కాన్వాయ్ను, ఖమ్మంలోని పుట్టకోట చెక్పోస్టు వద్ద వాహన శ్రేణిని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీ చేశారు.
భాజపా, భారాస గూడుపుఠాణి
లోక్సభ ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వంలో నామా నాగేశ్వరరావును కేంద్ర మంత్రి చేస్తానని కేసీఆర్ అంటున్నారు. ఏ ప్రభుత్వంలో చేరుతారో ఆయన చెప్పాలి. భారాస కాకిని కూడా కాంగ్రెస్ ఇంటిపై వాలనీయబోమని మా కార్యకర్తలు చెబుతున్నారు. ఇక మిగిలింది భాజపాతో కలవడమే. 2014 నుంచి 2023 వరకు మోదీ తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలు, పెద్ద నోట్లు, ట్రిపుల్ తలాక్ రద్దు, జీఎస్టీ బిల్లు లాంటి అనేక చట్టాలకు కేసీఆర్ మద్దతిచ్చారు. కాంగ్రెస్ ఎక్కువ స్థానాల్లో గెలవకుండా భాజపా, భారాస కలిసి గూడుపుఠాణి చేస్తున్నాయి. వాటి కుట్రలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది.
హైదరాబాద్ను విశ్వనగరంగా మార్చేందుకు కాంగ్రెస్ శ్రీకారం చుట్టింది. రాజధాని నగరంలో ఐటీ, ఫార్మా పరిశ్రమలు మా హయాంలోనే వచ్చాయి. జంట నగరాల వాసులు తాగునీరు లేక ఇబ్బందులు పడుతుంటే కృష్ణా, గోదావరి జలాలను తీసుకువచ్చాం.
సీఎం రేవంత్రెడ్డి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.