రాష్ట్రానికి రూ.9 లక్షల కోట్లు ఇస్తే గాడిద గుడ్డు అంటారా?
తెలంగాణలో భాజపా అత్యధిక స్థానాలు సాధించేందుకు, మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఎంతో సానుకూల వాతావరణం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు.
రిజర్వేషన్లపై సీఎం మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారు
కాంగ్రెస్ గద్దె దిగేందుకు ఐదేళ్లు చాలా ఎక్కువ
రాష్ట్రంలో అత్యధిక స్థానాలు భాజపాకే
భారాసకు ఓటు వేస్తే వృథాయే
మీట్ ది ప్రెస్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో భాజపా అత్యధిక స్థానాలు సాధించేందుకు, మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఎంతో సానుకూల వాతావరణం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. మరోసారి మోదీ ప్రభుత్వం(ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్) అనేది భాజపా నినాదంగా కాకుండా ప్రజానినాదంగా మారిందని చెప్పారు. క్షేత్రస్థాయిలో సునామీలాంటి ‘అండర్ కరెంట్’ పరిస్థితి కనబడుతోందని జూన్ 4న వెలువడే ఫలితాల్లో ఈ ప్రభంజనాన్ని చూస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భారాస గద్దె దిగేందుకు పదేళ్లు పడితే కాంగ్రెస్కు ఐదేళ్లు చాలా ఎక్కువ అని చెప్పారు. రాష్ట్రానికి రూ.9 లక్షలకోట్లు ఇస్తే కేంద్రం ఇచ్చింది గాడిద గుడ్డు అంటారా? అని రేవంత్ను ప్రశ్నించారు. ఈ వైఖరిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. భారాస ఒక ఎంపీ సీటు గెలిచినా గెలవకున్నా రాష్ట్రానికి వచ్చే లాభం లేదు.. ఆ పార్టీకి ఓటు వేస్తే వృథాయే అని అన్నారు. అవినీతి, కుంభకోణాల కాంగ్రెస్ పార్టీయా? అవినీతిరహిత పాలన, శక్తిమంతమైన నాయకత్వం అందించే భాజపా కావాలా? అనేది ప్రజలు నిర్ణయించుకోవాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(టీయూడబ్ల్యూజేె) ఆదివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కిషన్రెడ్డి పాల్గొన్నారు. టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్అలీ, సీనియర్ జర్నలిస్ట్ రవికాంత్రెడ్డి సహా పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్రెడ్డి మాట్లాడుతూ ‘‘వికసిత భారత్ లక్ష్యంగా భాజపా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 32 ఏళ్ల తర్వాత 2014లో దేశంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. పదేళ్ల ముందు దేశంలో ఉగ్రవాదం, తీవ్రవాదం, శాంతిభద్రతలు లోపించడం, ఆర్థిక సంక్షోభాలు, అవినీతి, కుంభకోణాలే చర్చనీయాంశంగా ఉండేవి. ఇప్పుడు దేశంలో పూర్తిగా పరిస్థితి మారిపోయింది. పదేళ్లుగా కేంద్ర ప్రభుత్వంపై, మంత్రులపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు. దేశంలో మతకలహాలు, కర్ఫ్యూలు, శాంతిభద్రతల సమస్యలు లేవు. దేశంలో మౌలిక వసతుల కల్పన అద్భుతంగా జరుగుతోంది. రూ.26 వేల కోట్లతో నిర్మించే రీజినల్ రింగ్రోడ్డు రాష్ట్రానికి గేమ్ ఛేంజర్గా మారుతుంది. రూ.300 కోట్లతో చర్లపల్లిలో చేపట్టిన కొత్త రైల్వే టెర్మినల్ నిర్మాణం పూర్తి కావచ్చింది. ఆగస్టులో ప్రధాని జాతికి అంకితం చేస్తారు.
ప్రధాని స్పష్టం చేసినా దుష్ప్రచారం చేస్తారా?
తన కంఠంలో ప్రాణం ఉండగా రిజర్వేషన్లు తొలగించే ప్రసక్తే లేదని ప్రధాని మోదీ చెప్పిన తర్వాత కూడా దుష్ప్రచారం చేస్తారా? రాజకీయాల్లో బాధ్యతతో ఉండాలి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి నోటికొచ్చినట్లు ఎలా మాట్లాడతారు? రిజర్వేషన్లు తీసేస్తామని సీఎం చేస్తున్న దుష్ప్రచారాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. రాజ్యాంగాన్ని మార్చింది.. పత్రికాస్వేచ్ఛను హరించింది కాంగ్రెస్ కాదా? పేదరికం నుంచి అన్ని వర్గాలు బయటకు వచ్చేవరకు రిజర్వేషన్లు ఉండాల్సిందే. భాజపా ఎక్కువ సీట్లు గెలుస్తుందని అర్థమై పార్టీలో తన అస్తిత్వానికి ఎక్కడ నష్టం జరుగుతుందో అని సీఎం రేవంత్రెడ్డి ఆత్మరక్షణ ధోరణిలో మాట్లాడుతున్నారు. భాజపాలో ఇతర పార్టీల నాయకులు చేరితే స్వాగతిస్తాం’’అని కిషన్రెడ్డి చెప్పారు.
ప్రభుత్వాన్ని కూల్చం.. నాలుగున్నరేళ్లు వేచి చూస్తాం
తెలంగాణలో భాజపాకు మెజారిటీ స్థానాలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం ఉండదనే అంశంపై కిషన్రెడ్డి స్పందిస్తూ ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఆలోచన భాజపాకు లేదు. ఆ పార్టీ అంతర్గత కలహాలతో కూలిపోతే మాకు సంబంధం లేదు. మేం నాలుగున్నరేళ్ల వరకు వేచి చూస్తాం. అప్పటివరకు బలాన్ని పెంచుకుని అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తాం. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారనే చర్చ ఎక్కడైనా జరిగిందా? మాజీ మంత్రి కేటీఆర్కు అధికారం పోయిన తర్వాత పీడకలలు పెరిగిపోయాయి. అందుకే అర్థంలేని విమర్శలు చేస్తున్నారు. అవినీతి, అహంకార, నియంతృత్వ భారాసతో ఎప్పటికీ కలిసే ప్రసక్తే లేదు. మతపరమైన రిజర్వేషన్లు వద్దని రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది. దేశంలో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు మతాలతో సంబంధం లేకుండా పదిశాతం ఈబీసీ రిజర్వేషన్లను కేంద్రం కల్పించింది. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ లాభదాయకం కాదని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది’’ అని స్పష్టం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు