మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే
‘‘రైతు భరోసా డబ్బులు పడలేదని కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చెబుతున్నారు. ఈనెల 9వ తేదీలోగా రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా డబ్బులు ఇచ్చే బాధ్యత మా ఇందిరమ్మ ప్రభుత్వానిది.
నిర్మల్, ఎర్రవల్లి జనజాతర సభల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ఈనాడు, మహబూబ్నగర్- ఈటీవీ, ఆదిలాబాద్
‘‘రైతు భరోసా డబ్బులు పడలేదని కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చెబుతున్నారు. ఈనెల 9వ తేదీలోగా రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా డబ్బులు ఇచ్చే బాధ్యత మా ఇందిరమ్మ ప్రభుత్వానిది. రైతు రుణమాఫీ గురించి హరీశ్రావు మాట్లాడుతున్నారు. ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా ఆగస్టు 15లోగా రైతులందరికీ రూ.2 లక్షల రుణమాఫీ చేసి ఆదుకుంటాం. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో అయిదింటిని అమలు చేసినప్పటికీ కేటీఆర్ విమర్శిస్తున్నారు. గత డిసెంబరులో జరిగిన ఎన్నికలు సెమీఫైనల్స్ మాత్రమే. అప్పుడు కేసీఆర్ను ఓడించాం. మే 13న తెలంగాణ, గుజరాత్కు మధ్య ఫైనల్స్ జరుగుతుంది. ఫైనల్స్లో గుజరాత్ను ఓడించి తెలంగాణను గెలిపిద్దాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నిర్మల్, అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో నిర్వహించిన జనజాతర సభల్లో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో పదేళ్లపాటు.. అంటే ప్రస్తుతం నాలుగున్నరేళ్లు. మరలా మరో అయిదేళ్లు.. కాంగ్రెస్సే అధికారంలో ఉంటుంది. తుమ్మిడిహెట్టి దగ్గర ప్రాణహిత-చేవెళ్ల నిర్మించి 1.50 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది. మూతపడిన సిమెంటు పరిశ్రమను తెరిపిస్తాం. ఆదిలాబాద్ అంటే నాకు ఎంత అభిమానమో మీకు తెలుసు. నేను పీసీసీ అధ్యక్షుడిని అయ్యాక ప్రధాని మోదీ పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్, నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా మొట్టమొదటి కార్యక్రమం నిర్మల్ నియోజకవర్గం నుంచే చేపట్టాం. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళిత, గిరిజన దండోరా కార్యక్రమంలో భాగంగా ఇంద్రవెల్లి నుంచే సమరశంఖం పూరించాం. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుని.. అభివృద్ధి చేసే బాధ్యత నాది. కారు పాడై షెడ్డుకు పోయిందని కేసీఆర్ అంటున్నారు. కారు కార్ఖానా నుంచి ఇక రాదు. తూకానికి విక్రయించాల్సిందే. గద్వాలలో కాంగ్రెస్ని ఓడగొట్టడానికి శాసనసభ ఎన్నికల్లో భారాస, భాజపాలు ఒక్కటయ్యాయి. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే భాజపా తెలంగాణకు ఏమిచ్చింది అంటే గాడిద గుడ్డు. అలాంటి పార్టీకి కర్రు కాల్చి వాతపెట్టాలా? వద్దా?’’ అని ప్రశ్నించారు. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి తొలిసారి బరిలో నిలిచిన మహిళ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను లక్ష ఓట్ల ఆధిక్యంతో, అదేవిధంగా నాగర్కర్నూల్ లోక్సభ అభ్యర్థి మల్లు రవిని అధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.
రాష్ట్ర సంపదను భారాస దోచుకుంది: భట్టి
భారాస పదేళ్లపాటు ఈ రాష్ట్ర సంపద, వనరులను దోచుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఎర్రవల్లి సభలో ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్న నాయకుడు రాహుల్గాంధీ అన్నారు. దేశసంపద, వనరులు ప్రజలకు చెందాలన్నారు. కానీ మోదీ పాలనలో కొంతమంది ఆయన మిత్రులకు ధారాదత్తం చేశారని ఆరోపించారు. ప్రజలు నష్టపోతున్నారంటూ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్గాంధీ సుదీర్ఘ పాదయాత్ర చేశారన్నారు. రాజ్యాంగాన్ని కాపాడటానికి మోదీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారన్నారు. నిర్మల్ సభలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, మాజీ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, డీసీసీ అధ్యక్షుడు కూచాడి శ్రీహరిరావు, నేతలు వేణుగోపాలాచారి, రేఖానాయక్, విశ్వప్రసాద్, నరేశ్జాదవ్, శ్యాంనాయక్, నారాయణరావు పటేల్, రాములునాయక్, అడ్డి భోజారెడ్డి పాల్గొన్నారు. ఎర్రవల్లి సభలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌధరి, ఎమ్మెల్యే వంశీకృష్ణ, జడ్పీ ఛైర్పర్సన్ సరిత, నేతలు తిరుపతయ్య, మేఘారెడ్డి, కూచుకుళ్ల రాజేశ్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే