భాజపా గెలిస్తే రిజర్వేషన్ల రద్దు
ఎన్నికల్లో భాజపా గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని.. రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆరోపించారు. భాజపా నేతలు ప్రజలతో నేరుగానే ఈ విషయాన్ని చెబుతున్నారని గుర్తు చేశారు.
వారిది రాజ్యాంగాన్ని మార్చే సమూహం
ఆ కుట్రల్ని తిప్పికొట్టేందుకే మా పోరాటం
కాంగ్రెస్ గెలిస్తే దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ
మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ఏటా రూ.లక్ష
యువతకు ఉద్యోగం పక్కా చేస్తాం
నిర్మల్, ఎర్రవల్లి జనజాతర సభల్లో రాహుల్గాంధీ
ఈనాడు, మహబూబ్నగర్- ఈటీవీ, ఆదిలాబాద్: ఎన్నికల్లో భాజపా గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని.. రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆరోపించారు. భాజపా నేతలు ప్రజలతో నేరుగానే ఈ విషయాన్ని చెబుతున్నారని గుర్తు చేశారు. భాజపా, ఆరెస్సెస్లది రాజ్యాంగాన్ని మార్చే సమూహమన్నారు. ఆదిలాబాద్, నాగర్కర్నూల్ లోక్సభ నియోజక వర్గాల పరిధిలోని నిర్మల్, ఎర్రవల్లిలలో ఆదివారం జరిగిన జనజాతర సభల్లో రాహుల్ ప్రసంగించారు. ఆదివాసీ, దళిత, మైనారిటీ, బీసీలకు ఏదైనా దక్కిందంటే అది రాజ్యాంగం పుణ్యమే అంటూ రాజ్యాంగంపుస్తకాన్ని ప్రదర్శించారు. భాజపా ఈ పుస్తకాన్ని నలిపివేయాలని చూస్తోందని మండిపడ్డారు. అంబేడ్కర్, గాంధీల ఆశయాల్ని తుంచేయాలని కుట్ర పన్నుతోందని ధ్వజమెత్తారు. ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసి ఆ కుట్రల్ని తిప్పి కొడుతుందన్నారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ మాదిరిగానే దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీతో పాటు పంటలకు కనీస మద్దతు ధర ప్రకటిస్తామన్నారు. రిజర్వేషన్లను పెంచుతామన్నారు. ఆదిలాబాద్, నాగర్కర్నూల్ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థులు ఆత్రం సుగుణ, మల్లు రవిలను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ‘‘దేశంలో ప్రస్తుతం రెండు సమూహాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఓవైపు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని కాపాడేందుకు పోరాడుతుంటే.. మరోవైపు భాజపా, ఆరెస్సెస్ రాజ్యాంగాన్ని నాశనం చేసేందుకు కుట్రలు చేస్తున్నాయి. స్వాతంత్య్రానంతరం పేదలకు అందిన జల్, జంగల్, జమీన్, హక్కులు, ఉద్యోగాలు, ఉపాధి లాంటి వనరులన్నీ రాజ్యాంగం ప్రసాదించినవే. ఒకవేళ రాజ్యాంగాన్ని తొలగిస్తే రిజర్వేషన్లు రద్దయినట్లే. దేశంలోని పోర్టులు, ఎయిర్పోర్టులు, రక్షణ సంబంధిత పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు.. అన్నిటినీ ఒక్కరికే కట్టబెట్టారు. ఈ పదేళ్లలో 22 మంది ధనికుల కోసమే మోదీ రూ.16 లక్షల కోట్లను మాఫీ చేశారు. ఆ సొమ్ముతో 24 ఏళ్ల పాటు పేదలకు ఉపాధి హామీ కింద పనులు కల్పించవచ్చు. కేవలం 22 మంది ధనికుల వద్దనున్న డబ్బు దేశంలోని 70 కోట్ల మంది పేదల దగ్గరున్న సొమ్ముతో సమానం. ఈ ధనాన్ని కాంగ్రెస్ పేదల వద్దకు చేర్చాలనుకుంటోంది.
మేం గద్దెనెక్కితే దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలు
తెలంగాణ ప్రజలకు మేం ఇచ్చిన గ్యారంటీలను అమలు చేసి చూపించాం. 30 వేల మంది యువతకు ఉద్యోగాలిచ్చాం. మహిళల బ్యాంకు ఖాతాల్లో ఇక్కడి ప్రభుత్వం ప్రతినెలా రూ.2500 వేస్తోంది. చేయూత కింద ఒక్కొక్కరికీ రూ.10లక్షల ఆరోగ్యబీమా అందుతోంది. గ్యాస్ సిలిండర్ను రూ.500కే అందిస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత రవాణా కల్పిస్తున్నాం. దిల్లీలో కాంగ్రెస్ గద్దెనెక్కితే దేశవ్యాప్తంగా ఈ పథకాల్ని అమలు చేస్తాం. దేశ యువతను మోదీ నిరుద్యోగులుగా మార్చారు. మేం దేశంలోని నిరుద్యోగ యువతకు పక్కా ఉద్యోగం ఇచ్చేలాకొత్త పథకం తెస్తాం. దేశంలో ప్రస్తుతమున్న 30 లక్షల ఖాళీలను భర్తీ చేస్తాం. దేశంలోని ప్రతి గ్రాడ్యుయేట్కు పబ్లిక్, ప్రైవేటు సెక్టార్లలో, ప్రభుత్వ కార్యాలయాల్లో, ఆసుపత్రుల్లో, విశ్వవిద్యాలయాల్లో ఏడాదిపాటు రూ.లక్ష వేతనంతో కూడిన ఉద్యోగం తప్పనిసరిగా కల్పిస్తాం. ఏడాదిలో ప్రతిభ కనబరిస్తే ఉద్యోగం శాశ్వతమవుతుంది. అప్పుడు దేశంలోని యువత సుశిక్షిత సైన్యంగా మారుతుంది. ప్రపంచంలోనే ఇదివరకు ఎన్నడూ లేని పథకమిది.
ఉపాధి హామీ కూలి రూ.400కు పెంచుతాం
ఆదివాసీలకు భూముల, అటవీహక్కుల సమస్యలున్నాయి. వాటిని త్వరలో పరిష్కరించబోతున్నాం. భూమిపై మొదటి హక్కులు కలిగిన వ్యక్తులు ఆదివాసీలే. తెలంగాణలో జల్, జంగల్, జమీన్పై ఇక్కడి ప్రభుత్వం సర్వహక్కులు కల్పించబోతోంది. ప్రస్తుతం ఉపాధి హామీ కింద రూ.250 కూలి అందుతోంది. దీన్ని రూ.400కు పెంచుతాం. మహిళల పింఛను రెట్టింపు చేస్తాం. తెలంగాణలో పురుషులు 8 గంటలు పనిచేస్తే.. మహిళలు ఇంటాబయటా 16 గంటలు పనిచేస్తారు. కానీ మహిళలు ఇంట్లో చేసిన పనికి ఎలాంటి ఆదాయం లభించదు. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గొప్ప పథకం తీసుకొస్తాం. ప్రపంచంలో ఇంతవరకు ఏ పార్టీ చేయనట్లుగా... దేశంలోని పేదలందరి జాబితా రూపొందించబోతున్నాం. ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళను ఎంచుకుంటాం. ఆమె బ్యాంకు ఖాతాలో ఏటా రూ.లక్ష వేయనున్నాం. ప్రతి నెల రూ.8500 ఖాతాలో పడతాయి. తెలంగాణలోని పేద మహిళలకు ఇక్కడి ప్రభుత్వం ఏటా రూ.30 వేలు వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా మరో రూ.లక్ష అందుతుంది. ఆశా, అంగన్వాడీ కార్యకర్తల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ల పెంపు
రిజర్వేషన్లకు మోదీ శత్రువు. అవకాశం దొరికినప్పుడల్లా ప్రజల నుంచి వాటిని లాక్కోవాలని చూస్తున్నారు. రిజర్వేషన్లను 50 శాతం కంటే ఎక్కువగా పెంచడం ప్రస్తుతం దేశంలో అతిపెద్ద సమస్య. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దాన్ని పెంచుతామని మ్యానిఫెస్టోలో స్పష్టం చేశాం. రిజర్వేషన్లను తీసేసేందుకే మోదీ ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తున్నారు. అగ్నివీర్ అందులో భాగమే. ప్రభుత్వ, ప్రైవేటురంగ సంస్థల్లో తాత్కాలిక ఉద్యోగాలను తీసేసి.. అన్నీ శాశ్వత ఉద్యోగాలే ఉండేలా చేస్తాం. మనమంతా కలిసి రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం. ఇక్కడ విద్వేషపు వీధుల్లో ప్రేమపూరిత దుకాణాలు తెరిచాం. కేంద్రంలోనూ ఇదే చేయబోతున్నాం. పేదల ప్రభుత్వాన్ని సుస్థిరం చేయడమే మా లక్ష్యం’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా కులగణన చేయబోతున్నాం
దేశంలో 50 శాతం మంది వెనకబడిన వర్గాలు.. 15 శాతం దళితులు.. 8 శాతం ఆదివాసీలు.. 15 శాతం మైనారిటీలు.. 5-6 శాతం మంది అగ్రవర్ణ పేదలున్నారు. వీరందరినీ కలిపితే 90 శాతం కంటే ఎక్కువే. కానీ దేశంలోని ఏ సంస్థలోనైనా వీరికి సరైన అవకాశాల్లేవు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో 90 మంది బ్యూరోక్రాట్లలో ముగ్గురు దళితులు, ముగ్గురు వెనకబడిన కులాలవారు, ఒక్క ఆదివాసీ మాత్రమే ఉన్నారు. కేంద్రం ఖర్చు చేస్తున్న ప్రతి 100 రూపాయల్లో దళిత, ఆదివాసీ, వెనకబడిన వర్గాలకు కేవలం రూ.6.10 మాత్రమే కేటాయిస్తోంది. 8 శాతమున్న ఆదివాసీలకు బడ్జెట్లో 10 పైసలు మాత్రమే ఇస్తోంది. అందుకే దేశవ్యాప్తంగా కులగణన చేయబోతున్నాం. దీనిద్వారా దళిత, ఆదివాసీ, వెనకబడిన, మైనారిటీ వర్గాలకు అధికారం వస్తుంది. దేశంలోని ప్రతి సంస్థలో ఆర్థికసర్వే చేయిస్తాం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
కెమెరామన్.. ప్లీజ్ ఆడియో ఆన్ చేయొద్దు: రోహిత్ శర్మ
-
కిర్గిస్థాన్లో అల్లర్లు.. భారత విద్యార్థులకు కేంద్రం అలర్ట్
-
నేడు స్టాక్మార్కెట్ ప్రత్యేక సెషన్.. దూసుకెళ్లిన సూచీలు
-
షికారు చేశారు... అద్దె బకాయిలు కట్టేదెవరు?
-
వివాహేతర సంబంధం భర్తకు తెలియడంతో చంపించిన భార్య..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM