పాతవి లేవు.. కొత్త పథకాలు రావు
‘తెలంగాణ ఉద్యమం అయిపోలేదు.. రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది. నాలుగైదు నెలల్లోనే ఈ సర్కారు ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంది.
ఈ ప్రభుత్వానికి ఏం రోగమొచ్చింది?
ఉద్యమం అయిపోలేదు.. రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది
ఎన్నికలు మధ్యలో వచ్చినా.. చివర్లో వచ్చినా మళ్లీ మనదే అధికారం
కృష్ణా, గోదావరి నీళ్లపై మోదీ కుట్ర
జగిత్యాల రోడ్ షో, వీణవంక ఆత్మీయ సమ్మేళనంలో కేసీఆర్
కరీంనగర్-ఈనాడు, జగిత్యాల, వీణవంక-న్యూస్టుడే: ‘తెలంగాణ ఉద్యమం అయిపోలేదు.. రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది. నాలుగైదు నెలల్లోనే ఈ సర్కారు ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంది. చివరి దాకా మనగలిగే ప్రభుత్వం కాదిది. ఈ బాధ పోవాలి. ఎన్నికలు మధ్యలో వచ్చినా.. చివర్లో వచ్చినా.. మళ్లీ మనదే అధికారం’ అని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. జగిత్యాలలో ఆదివారం రాత్రి నిర్వహించిన రోడ్ షోలో, అంతకుముందు కరీంనగర్ జిల్లా వీణవంకలోని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి నివాసం వద్ద ప్రజలు, రైతులతో ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ‘‘ఈ ప్రభుత్వానికి ఏం రోగమొచ్చింది. కొత్త పథకాలు అమలు చేస్తలేరు. పాతవి కొనసాగిస్తలేరు. రాష్ట్రాన్ని ఆగమాగం చేస్తున్నారు. ఏ వర్గానికీ ఏమీ రావడం లేదు. రుణమాఫీ, తులం బంగారం, కేసీఆర్ కిట్, ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇలా ఏవీ అందట్లేదు. నిర్మల్ సమావేశంలో రాహుల్గాంధీ మహిళలకు రూ.2,500 ఇస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుడు తప్ప.. చేసిందేమీ లేదు.
ఆదర్శంగా నిలిపాం..
కొత్త రాష్ట్రాన్ని ఒక్కొక్కటిగా చక్కపెడుతూ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపాం. మేం ఎంతో కష్టపడి రూ. వందల కోట్ల పెట్టుబడులు పెట్టే పరిశ్రమలు ఏర్పాటు చేసేలా చూశాం. కాంగ్రెస్ హయాంలో కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి రాకుండా వెళ్లిపోతోంటే బాధనిపిస్తోంది. కరెంట్ గోసను తీర్చుకున్నాం. ఫ్లోరైడ్ సమస్య, వలసల బాధను పోగొట్టుకున్నాం. 55 లక్షల మెట్రిక్ టన్నులు పండే ధాన్యాన్ని మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల స్థాయికి తీసుకెళ్లాం. సంక్షేమ రంగంలో ఎన్నో ఫలితాలు సాధించాం. ఇంకా ఎన్నో చేయాలనుకున్నాం. కానీ, దురదృష్టవశాత్తు మొన్నటి ఎన్నికల్లో ఏం జరిగిందో మీకు తెలుసు.
రైతుబంధును ఐదెకరాలకే పరిమితం చేస్తారట..
రెండు దగ్గర నాలుగు వేలు వస్తాయని కొందరు.. ఇంకేమో చేస్తారని ఇంకొందరు నమ్మి అటు ఓటు వేసి మోసపోయారు. ప్రస్తుత ప్రభుత్వ మర్మం తెలిసిపోయింది. అందుకే తెలంగాణ మర్లవడుతోంది. డిసెంబరు 9న వేస్తామన్న రైతు రుణమాఫీ పైసలు ఏమాయె.. రైతుబంధు నాటేసేటప్పుడు ఇస్తారా? లేక కోతలు కోసేటప్పుడు ఇస్తారా? దుక్కి దున్నిన వాళ్లకే రైతుబంధు వేస్తారట. అయిదెకరాలకే పరిమితం చేస్తారట. ఆరేడు ఎకరాల వాళ్ల పరిస్థితి ఏంది? కటాఫ్ పెట్టాలనుకుంటే 20-25 ఎకరాలకు పెట్టాలి. నేను వస్తుంటే దారి పొడుగునా ధాన్యం కుప్పలే కనిపిస్తున్నాయి. కొనుగోలు జరగట్లేదు. బోనస్ అందట్లేదు. పేపర్లో వార్తలు చూస్తే బాధేస్తోంది. వరంగల్ ఎంజీఎంలో చిన్నపిల్లల తల్లులు బాధపడుతున్నారు. గురుకులాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు దవాఖానాల్లో పడుతున్నారు. వరద కాలువలు, పంట పొలాలు ఎండటానికి ఎవరు కారకులో ఆలోచించండి. ఇన్నేళ్లు చక్కగా వచ్చిన కరెంట్ ఇప్పుడెందుకు వస్తలేదు. నీళ్లు ఎందుకు ఇస్తలేరు. ఇన్నాళ్లు నడిచింది అలాగే నడిపిస్తే సరిపోయేది కదా? ఎందుకింత నిర్లక్ష్యం? ఉన్న గోచిని కూడా గుంజుకున్నట్లుంది ప్రభుత్వం తీరు. పరిపాలనా దక్షత వాళ్లకు లేదు. మళ్లా మనమే బాగు చేసుకోవాలి.
నా గుండె చీలిస్తే తెలంగాణనే..
తెలంగాణ ప్రజలిచ్చిన బలంతో రాష్ట్రాన్ని సాధించుకున్నాం. నా గుండె చీలిస్తే.. అందులో తెలంగాణనే కనిపిస్తుంది. బతికి ఉన్నంత సేపు తెలంగాణ కోసమే పోరాడతా. భారాస గెలుపుతోనే తెలంగాణ విజయం ముడిపడి ఉంది.
మోదీ హయాంలో ‘చచ్చేదిన్’
2019లో నలుగురు భాజపా ఎంపీలు గెలిచినా వాళ్లు తెలంగాణకు చేసిందేమీ లేదు. కృష్ణా, గోదావరి నీళ్లను పక్క రాష్ట్రాలకు తరలించాలని మోదీ కుట్ర చేస్తున్నారు. గోదావరి పోతే మనకు మంచినీళ్లు, సాగు నీళ్లు ఆగమైతాయి. మోదీ ప్రధాని అయి పదేళ్లు అయింది. అచ్చేదిన్ స్థానంలో చచ్చేదిన్ వచ్చాయి. అడ్డగోలు ధరలతో దగా జరిగింది. జన్ధన్ ఖాతాల్లోకి రూ.15 లక్షలు రాలేదు. రూపాయి విలువ పడిపోయింది. మోదీ హయాంలో ఏ వర్గానికీ న్యాయం జరగలేదు. మనల్ని నూకలు తినమని చెప్పిన నూకరాజు ఈ మోదీ. మోదీ మాటలకు రేవంత్రెడ్డి డప్పుకొడుతున్నారు. గిరిజన రిజర్వేషన్ పెంచాలని మేము ప్రయత్నించాం. హైకోర్టులో జడ్జి అడిగితే ఈ ప్రభుత్వం శాస్త్రీయంగా లెక్కలేసి చెప్పలేదు. రాష్ట్ర సమస్యలపై పార్లమెంటులో బలంగా మాట్లాడాలంటే భారాస ఎంపీలు గెలవాలి. భాజపా ఎంపీలు గెలిస్తే మోదీ వద్ద చేతులు కట్టుకుని నిలబడతారు. అదే భారాస వాళ్లు గెలిస్తే పార్లమెంటు దద్దరిల్లే విధంగా కొట్లాడతారు. మన హక్కులను కాపాడతారు’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. భారాస అభ్యర్థులు బోయినపల్లి వినోద్కుమార్ (కరీంనగర్), కొప్పుల ఈశ్వర్ (పెద్దపల్లి), బాజిరెడ్డి గోవర్ధన్ (నిజామాబాద్), ఎమ్మెల్యేలు డాక్టర్ ఎం.సంజయ్కుమార్, గంగుల కమలాకర్, పాడి కౌశిక్రెడ్డి, డాక్టర్ కె.సంజయ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ తదితరులు పాల్గొన్నారు. జగిత్యాలలో కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు బస్సు యాత్ర కొనసాగగా.. జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు.
కొండగట్టు వద్ద చాయ్ తాగిన కేసీఆర్
మల్యాల, న్యూస్టుడే: కేసీఆర్ ఆదివారం సాయంత్రం జగిత్యాలలో జరిగే రోడ్డుషో కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తూ మార్గంమధ్యలో మల్యాల మండలం కొండగట్టు స్టేజీ సమీపంలోని ఓ హోటల్ వద్ద ఆగారు. అక్కడ సమోసా తిని టీ తాగారు. చిన్నారులతో ముచ్చటించారు. స్థానికులు ఆయనతో సెల్ఫీలు దిగారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు