మతపరమైన రిజర్వేషన్లకే భాజపా వ్యతిరేకం
‘‘కాంగ్రెస్, భారాస రెండూ కుటుంబ, అవినీతి పార్టీలు. 2జీ, అగస్టా, కామన్వెల్త్ లాంటి కుంభకోణాలతో కాంగ్రెస్.. కాళేశ్వరంతోపాటు ప్రతి పథకంలో 30 శాతం కమీషన్తో భారాస ప్రజలను దోచుకున్నాయి.
కాంగ్రెస్, భారాస కుటుంబ.. అవినీతి పార్టీలు
ఏబీసీ పార్టీలు తబ్లీగీ జమాత్ ఎజెండాను అమలు చేస్తున్నాయి
మోదీ హయాంలోనే అభివృద్ధి
పెద్దపల్లి, చౌటుప్పల్, నల్గొండ ‘జన సభ’ల్లో జేపీ నడ్డా
పెద్దపల్లి, నల్గొండ - ఈనాడు: ‘‘కాంగ్రెస్, భారాస రెండూ కుటుంబ, అవినీతి పార్టీలు. 2జీ, అగస్టా, కామన్వెల్త్ లాంటి కుంభకోణాలతో కాంగ్రెస్.. కాళేశ్వరంతోపాటు ప్రతి పథకంలో 30 శాతం కమీషన్తో భారాస ప్రజలను దోచుకున్నాయి. సోనియా, రాహుల్లు బెయిల్పై ఉంటే.. కేసీఆర్ కుమార్తె కవిత జైలులో ఉన్నారు. ప్రతిపక్షాల నేతలు బెయిల్పై.. లేదంటే జైలులో ఉంటారు’’ అని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. మోదీ హయాంలో అభివృద్ధి మాత్రమే కనిపిస్తోందన్నారు. భాజపా ఉన్నంత వరకు అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను ఎవరూ రద్దుచేయలేరని ఉద్ఘాటించారు. సోమవారం పెద్దపల్లి, భువనగిరి, నల్గొండ లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని పెద్దపల్లి, చౌటుప్పల్, నల్గొండలలో పార్టీ అభ్యర్థులు గోమాసె శ్రీనివాస్, బూర నర్సయ్యగౌడ్, శానంపూడి సైదిరెడ్డిలకు మద్దతుగా భాజపా నిర్వహించిన ‘జనసభ’లలో ఆయన ప్రసంగించారు. ‘‘ప్రధాని మోదీ హీరా (హెచ్ఐఆర్ఏ) పేరిట మౌలిక వసతులను అభివృద్ధి చేశారు. హైవేస్(హెచ్), ఇంటర్నెట్(ఐ), రైల్వేస్(ఆర్), ఎయిర్వేస్(ఏ) ఆయన పాలనలోనే ప్రగతిని సాధించాయి. కాంగ్రెస్ హయాంలో దేశంలో విమానాశ్రయాల సంఖ్య 74 ఉంటే పదేళ్లలో 148కు చేరింది. రాష్ట్రంలోని 2 కోట్ల మందికి రేషన్ సరకులు ఇస్తున్నాం. దేశంలో 25 కోట్ల మంది దారిద్య్ర రేఖ కన్నా ఎగువకు చేరుకున్నారు. తెలంగాణకు రైల్వే బడ్జెట్ను 20 రెట్లు పెంచాం. హైదరాబాద్ - విశాఖపట్నం గ్రీన్ కారిడార్ను అభివృద్ధి చేస్తున్నాం. రూ.7 వేల కోట్లతో రామగుండంలో ఎరువుల పరిశ్రమను పునరుద్ధరించాం.
అసంపూర్తి నిర్మాణాలు పూర్తిచేస్తాం
రెండు పడక గదుల ఇళ్ల పేరుతో ప్రజలను కేసీఆర్ మోసగించారు. ఆ అసంపూర్తి నిర్మాణాలపై రేవంత్రెడ్డి సర్కారు కూడా మౌనం పాటిస్తోంది. మీరు ఆశీర్వదించి మాకు ఓటేస్తే అసంపూర్తి నిర్మాణాలను పూర్తి చేస్తాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజనను అప్పుడు కేసీఆర్, ఇప్పుడు రేవంత్రెడ్డి ఇద్దరూ ఉపయోగించుకోవడం లేదు. దేశవ్యాప్తంగా ఈ పథకం కింద పేదలకు 4 కోట్ల ఇళ్లు అందించాం.
రాముడికి, సనాతన ధర్మానికి కాంగ్రెస్ వ్యతిరేకం
ఏ అంటే ఆల్ ఇండియా మజ్లిస్, బీ అంటే భారాస, సీ అంటే కాంగ్రెస్.. ఈ మూడు పార్టీలు తబ్లీగీ జమాత్ విధానాలను అనుసరిస్తున్నాయి. రజాకార్ల చర్యలను ఈ మూడు పార్టీలు సమర్థించడం నిజం కాదా?. 17 సెప్టెంబరును తెలంగాణ విమోచన దినోత్సవంగా చేయాల్సి ఉండగా కేసీఆర్ తెలంగాణ విలీన దినోత్సవం చేశారు. భాజపా అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. కాంగ్రెస్ పార్టీ రాముడికి, సనాతన ధర్మానికి వ్యతిరేకం. రాముడు ఈ ప్రాంతంలో సంచరించారనడానికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని గతంలో సుప్రీంకోర్టుకు సోనియాగాంధీ అఫిడవిట్ ఇచ్చారు. పాక్పై మోదీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేస్తే.. దానికి కాంగ్రెస్ నాయకులు ఆధారాలు కావాలంటారు. కశ్మీర్లో ఉగ్రవాదులను మన బలగాలు మట్టుబెడితే వారి కోసం సోనియా, సల్మాన్ ఖుర్షీద్ బాధపడతారు. వీళ్లంతా దేశద్రోహులతో కలిసి పనిచేస్తారు.
మతపరమైన రిజర్వేషన్లు వద్దన్న అంబేడ్కర్
ప్రధాని మోదీ రిజర్వేషన్లు రద్దు చేస్తారని రాహుల్గాంధీ ఆరోపిస్తున్నారు. మతపరమైన రిజర్వేషన్లకు మాత్రమే భాజపా వ్యతిరేకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన రిజర్వేషన్లలో కోత విధించి ముస్లింలకు 4 శాతం కేటాయించింది. మతపరమైన రిజర్వేషన్లు అమలు చేయవద్దని అంబేడ్కర్ స్పష్టంగా సూచించారు. ఈ విషయం తెలియక రాహుల్గాంధీ అనవసర ఆరోపణలు చేస్తున్నారు. రాహుల్గాంధీ తుక్డే గ్యాంగులకు ఎంపీ టికెట్లు ఇచ్చారు. పాక్కు అనుకూలంగా నినాదాలు చేసిన ఒకరు ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. వారిని ఇంట్లో కూర్చోబెట్టి.. మోదీని మరోసారి ప్రధాని చేయడానికి భాజపా అభ్యర్థులకు ఓటేయాలి’’ అని నడ్డా కోరారు. ఆయా సభల్లో అభ్యర్థులతోపాటు ఎంపీ వెంకటేశ్ నేత, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
రేపు వేములవాడ, వరంగల్లలో మోదీ ప్రచారం
ఈనాడు, హైదరాబాద్: ప్రధాని మోదీ మంగళవారం రాష్ట్రానికి రానున్నారు. రాత్రి హైదరాబాద్కు చేరుకోనున్న ఆయన.. రాజ్భవన్లో బస చేస్తారు. బుధవారం కరీంనగర్ లోక్సభ నియోజకవర్గంలోని వేములవాడతో పాటు వరంగల్ నియోజకవర్గ కేంద్రంలో భాజపా అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి