icon icon icon
icon icon icon

ఎన్నికల స్వాధీనాల విలువ రూ.269 కోట్లు

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు రూ.269.32 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

Published : 07 May 2024 05:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఇప్పటివరకు రూ.269.32 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అందులో రూ.92.61 కోట్ల నగదుతో పాటు 50.39 కోట్ల విలువ చేసే మద్యం, మాదకద్రవ్యాలు రూ.28.42 కోట్లు, బంగారం ఇతర విలువైనవి రూ.60.76 కోట్లు, మిగిలిన మొత్తంలో ఉచితాలు ఉన్నట్లు పేర్కొంది.

13న సెలవు: లోక్‌సభ ఎన్నికలు, కంటోన్మెంట్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక సందర్భంగా ఈ నెల 13న వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు, గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లకు ఉత్తర్వులిచ్చినట్లు ముఖ్యఎన్నికల అధికారి కార్యాలయం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img