మోదీ అడుగుజాడల్లో రేవంత్
ఆరెస్సెస్ మనిషి రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని.. ఆయన రాహుల్ గాంధీ మార్గంలో కాక.. మోదీ అడుగుజాడల్లో నడుస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు.
ప్రాంతీయ పార్టీల నేతలకే ప్రధానిని ఎదుర్కొనే సత్తా
కాంగ్రెస్ చెప్పేవన్నీ అబద్ధాలే
భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శ
ఈనాడు డిజిటల్- సిరిసిల్ల, రాయదుర్గం- న్యూస్టుడే: ఆరెస్సెస్ మనిషి రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని.. ఆయన రాహుల్ గాంధీ మార్గంలో కాక.. మోదీ అడుగుజాడల్లో నడుస్తున్నారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. మోదీని ఎదుర్కొనే దమ్ము రాహుల్గాంధీకి లేదని, అందుకే అమేఠీ నుంచి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. కేసీఆర్, కేజ్రీవాల్, మమతాబెనర్జీ, స్టాలిన్, హేమంత్సోరెన్ వంటి ప్రాంతీయ పార్టీల నేతలకే ఆ సత్తా ఉందన్నారు. హైదరాబాద్ ప్రజలు కేసీఆర్పై నమ్మకంతో అత్యధిక స్థానాలు భారాసకిచ్చి ఆశీర్వదించారని చెప్పారు. జిల్లాల్లో కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి హామీలివ్వడంతో ప్రజలు మోసపోయారన్నారు. భారాసకు 10-12 సీట్లిస్తే కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుందన్నారు. సోమవారం ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ తరఫున సిరిసిల్ల, తంగళ్లపల్లి, ముస్తాబాద్ మండలాల్లో బూత్స్థాయి కార్యకర్తల సమావేశాలు.. సాయంత్రం చేవెళ్ల లోక్సభ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరఫున హైదరాబాద్లోని కొండాపూర్, శంషాబాద్, బడంగ్పేటలలో నిర్వహించిన రోడ్ షోలలో కేటీఆర్ ప్రసంగించారు.
నమో అంటే నమ్మించి మోసం చేయడం
‘‘బడే భాయ్ మోదీ పదేళ్ల నుంచి కథలు చెబుతున్నారు. ఆయన చేసిన వాగ్దానాలు నెరవేరలేదు. మాట్లాడితే నమో అంటారు. నమో అంటే నమ్మించి మోసం చేయడం.. హైదరాబాద్కు రూపాయి సాయం చేయలేదు. రహదారులు, ఉన్నత విద్యాసంస్థలు, మరమగ్గాల అభివృద్ధికి సాయం అందించాలని మొరపెట్టుకున్నా ప్రయోజనం శూన్యం. ఆయన ముస్లింలను నోటికొచ్చినట్లు దూషిస్తున్నారు. సెస్ రూపంలో రాష్ట్రాలకు కొత్త పన్నులు వేశారు. ఎందుకంటే.. జాతీయ రహదారులను నిర్మిస్తున్నామన్నారు. మరి టోల్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తున్నారంటే దానికి జవాబివ్వరు. ఇప్పటివరకు రూ.30 లక్షల కోట్ల పన్నులు వసూలు చేశారు. అలాగే అదానీ, అంబానీలకు రూ.14.50 లక్షల కోట్ల రుణమాఫీ చేశారు. నేను చెప్పింది అబద్ధమని భాజపా నాయకులు నిరూపిస్తే తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నా రాజీనామా పత్రం ఉంచుతా. పార్లమెంటు ఎన్నికల్లో 400 సీట్లు గెలుస్తామని, దేశంలో రిజర్వేషన్లు తీసేస్తామని భాజపా చెబుతోంది. గోదావరి నీటిని కర్ణాటక, చెన్నైలకు తరలిస్తామంటోంది. జూన్ 2 తర్వాత హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని చూస్తోంది.
కాంగ్రెస్ సినిమా చూపించి అధికారంలోకి వచ్చింది
రంగుల కలలాంటి సినిమా ప్రజలకు చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్ కొన్ని జిల్లాలను రద్దు చేయాలని ఆలోచిస్తున్నారు. ఇటీవల సిరిసిల్లకు వచ్చినపుడు 6 గ్యారంటీల్లో 5 అమలు చేశామని చెప్పారు. నిర్మల్కు వచ్చిన రాహుల్గాంధీ రాష్ట్రంలోని ప్రతి ఆడబిడ్డకు నెలకు రూ.2,500 జమ చేస్తున్నామన్నారు. తెలంగాణలో లక్షన్నర పెళ్లిళ్లు జరిగాయి. ఒక్కరికీ తులం బంగారం ఇచ్చేందుకు సీఎంకు దుకాణంలో బంగారం ఉద్దెరకు దొరకడం లేదా? కాంగ్రెస్వన్నీ అబద్ధపు ప్రచారాలే. మేం భాజపాతో కలిసున్నామని రాహుల్ అంటున్నారు.. అలా అయితే నా చెల్లి కవిత 50 రోజులుగా జైలులో ఉండేదా?’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే