రిజర్వేషన్ల రద్దే భాజపా అసలు ఎజెండా
భాజపా అసలు ఎజెండా బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేయడమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం పార్టీ నేతలు బండ్ల గణేశ్, సామ రాంమోహన్రెడ్డిలతో కలసి గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరితరమూ కాదు
కరెంటు సరఫరాపై భారాస దుష్ప్రచారం
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
ఈనాడు, హైదరాబాద్: భాజపా అసలు ఎజెండా బీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లు రద్దు చేయడమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం పార్టీ నేతలు బండ్ల గణేశ్, సామ రాంమోహన్రెడ్డిలతో కలసి గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ ఎన్నికల్లో మూడింట రెండొంతుల మెజారిటీ వస్తే.. రాజ్యాంగం నుంచి సెక్యులర్ పదాన్ని తొలగించాలని భాజపా నేతలు చూస్తున్నారు. ఆ పార్టీకి కేసీఆర్ వత్తాసు పలకడం సిగ్గుచేటు. భాజపా, భారాస కలిసిపోయాయి. కేసీఆర్ పాలనలో ఛిన్నాభిన్నమైన రాష్ట్రాన్ని మూడు నెలల్లోనే చక్కదిద్దాం. ప్రజలకు వాస్తవాలు చెబితే నోటీసులు ఇచ్చి సీఎంను భయపెట్టాలని చూస్తున్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వ పదేళ్ల పాలనలో దేశం అల్లకల్లోలమైంది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ మళ్లీ నెగ్గితే బడుగు, బలహీనవర్గాలు, దళితులు, గిరిజనులు తమ హక్కులు, భవిష్యత్తును కోల్పోయే ప్రమాదం ఉంది. భాజపా మళ్లీ అధికారంలోకి రాకుండా చూసే బాధ్యత బడుగు, బలహీన వర్గాలదే. ఆ పార్టీ కుట్రను అర్థం చేసుకొని.. రాహుల్ గాంధీ భారత్ జోడో, న్యాయ్ యాత్రలు చేశారు. కులగణన చేసి జనాభా దామాషా ప్రకారం సంపద పంచుతామని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కులగణన చేపడుతుంది. రాహుల్ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో కులగణన ప్రక్రియ మొదలైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడం ఎవరి తరమూ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం సంపదను సృష్టించి.. ప్రజలకు పంచుతుంది. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 లోక్సభ సీట్లు గెలుస్తాం.
కావాల్సినంత కరెంటు అందుబాటులో ఉంది
రాష్ట్రంలో కావాల్సినంత కరెంటు అందుబాటులో ఉంది. గత ఏడాదితో పోలిస్తే మే ఒకటి నుంచి ఆరు వరకు విద్యుత్ డిమాండ్ 52.9% పెరిగింది. 2023 మే నెలలో 7,062 మెగావాట్లున్న సరాసరి డిమాండ్ ఈ నెలలో 10,799 మెగావాట్లకు పెరిగింది. సరాసరి వినియోగం 157.9 మిలియన్ యూనిట్ల (మి.యూ.) నుంచి 226.62 మి.యూ.లకు పెరిగింది. హైదరాబాద్ నగరంలో గత ప్రభుత్వ హయాంలో 2022తో పోలిస్తే 2023లో విద్యుత్ వినియోగం, డిమాండ్ వృద్ధి రేటు ఒక్క శాతం కూడా పెరగలేదు. ఈ ఏడాది గత రెండు రోజులుగా దాదాపు 4,000 మెగావాట్లకు మించి డిమాండ్, 90 మిలియన్ యూనిట్లకు మించి వినియోగం నమోదవుతోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా రాత్రిపూట సరాసరి డిమాండ్ అంచనాలకు మించి నమోదవుతోంది. ఈ నెల 6న అర్ధరాత్రి 12.19 గంటలకు 4,059 మెగావాట్ల డిమాండ్ నమోదైంది. గత ఏడాదితో పోలిస్తే ఇది 300 శాతం అధికం. నిమిషం కూడా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరాకు కృషి చేస్తున్న సిబ్బందిని, అధికారులను అభినందించాల్సిన ప్రతిపక్షాలు.. లేని కరెంటు కోతలు ఉన్నట్టు ప్రచారం చేస్తున్నాయి. కేసీఆర్ పాలనలో రైతులు ధర్నాలు చేసిన రోజులు మర్చిపోయారా? తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్.. విద్యుత్ కోతలున్నాయని దుష్ప్రచారం చేయడం అత్యంత హేయం. విద్యుత్పై భారాస నేతలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు. అసత్య ప్రచారం చేస్తున్న భారాసకు ప్రజలు తగిన రీతిలో సమాధానం చెబుతారు’’ అని భట్టి విక్రమార్క అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.