గెలుస్తామన్న ధీమాతో నిర్లక్ష్యం వద్దు
ఎన్నికల ప్రచారం, పోలింగ్కు నేతల సన్నద్ధతపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. లోక్సభ నియోజకవర్గాల వారీగా ప్రచారం సాగుతున్న తీరుపై రాష్ట్ర ముఖ్యనేతలను అప్రమత్తం చేసింది.
అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, మంత్రులకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం
ఈనాడు, హైదరాబాద్: ఎన్నికల ప్రచారం, పోలింగ్కు నేతల సన్నద్ధతపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. లోక్సభ నియోజకవర్గాల వారీగా ప్రచారం సాగుతున్న తీరుపై రాష్ట్ర ముఖ్యనేతలను అప్రమత్తం చేసింది. లోక్సభ ఎన్నికల్లో పార్టీయే గెలుస్తుందన్న భావనతో ప్రచారంపై నిర్లక్ష్యం చూపవద్దని కొందరు ఎమ్మెల్యేలను సైతం హెచ్చరించింది. ప్రతి ఒక్కరూ పోలింగ్ వరకూ వంద శాతం కష్టపడాలని సూచించింది. ప్రచారం తీరు, అన్ని పార్టీల బలాబలాలపై వార్ రూం ద్వారా నేరుగా క్షేత్రస్థాయి నుంచి అధిష్ఠానం సమాచారం సేకరిస్తోంది. ఏరోజుకారోజు నివేదికలు తెప్పించుకుంటోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం దిల్లీ నుంచి జూమ్లో కాంగ్రెస్ రాష్ట్ర ముఖ్యనేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, లోక్సభ అభ్యర్థులు, నియోజకవర్గాల ఇన్ఛార్జులు పాల్గొన్నారు. గంటకుపైగా సాగిన సమావేశంలో ప్రచారం, ఫలితాల అంచనాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘‘దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి అనుకూల వాతావరణం ఉంది. పలు ప్రాంతాల్లో భాజపా వెనుకబడింది. కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రానుంది. దేశ దశ, దిశలను మార్చే ఎన్నికలను తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి. ఈ ఎన్నికల్లో పనితీరు ఆధారంగానే భవిష్యత్తులో వారికి పదవులు ఇస్తాం. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నందువల్ల ఎక్కువ స్థానాల్లో నెగ్గాలి. ఇవి లోక్సభ ఎన్నికలు కావడంతో తమకు సంబంధం లేదన్నట్టు ఎమ్మెల్యేలు ఉండొద్దు. తమ నియోజకవర్గంలో అధిక మెజార్టీ తెప్పించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జులదే. కొందరు ఎమ్మెల్యేలు ప్రచారంలో చురుగ్గా పాల్గొనడం లేదనే సమాచారం ఉంది. పోలింగ్ జరిగేవరకూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి.. ప్రజలను కలవాలి. నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి అక్కడి ప్రచారాన్ని చూసుకుంటారు. సికింద్రాబాద్కు ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ నియోజకవర్గంలో ప్రచారంపై నిర్లక్ష్యం చేయవద్దు. పోలింగ్ ముగిసేవరకూ నియోజకవర్గం దాటి బయటికి వెళ్లొద్దు. పార్టీ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలి. పార్టీ నిర్దేశించిన పనిని ప్రతి ఒక్కరూ శ్రద్ధతో చేయాలి. పార్టీ నిర్ణయాలను ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు’’ అని స్పష్టం చేశారు. జూమ్ సమావేశానికి కొందరు ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై కేసీ వేణుగోపాల్ అసహనం వ్యక్తం చేశారని తెలిసింది. ఎవరెవరు సమావేశంలో పాల్గొనలేదో నివేదిక ఇవ్వాలని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ను ఆయన ఆదేశించారు. కొందరు ఎమ్మెల్యేలు సమావేశం ప్రారంభమైన తర్వాత ఆలస్యంగా ఆన్లైన్లోకి వచ్చారు. సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు ముగిసిన తర్వాత రుణమాఫీ అమలు చేయనున్నట్లు స్పష్టంచేశారు. రుణమాఫీకి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందనే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన, గ్యారంటీ హామీల గురించి ఎమ్మెల్యేలు వివరించాలని ఆయన చెప్పినట్లు సమాచారం.
4 పార్లమెంటు నియోజకవర్గాలకు కాంగ్రెస్ సహ ఇన్ఛార్జులు
హైదరాబాద్, న్యూస్టుడే: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 4 పార్లమెంట్ నియోజకవర్గాలకు సహ ఇన్ఛార్జులను నియమించింది. మహబూబ్నగర్కు మాజీ ఎంపీ జితేందర్రెడ్డి, మెదక్కు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు టి.జగ్గారెడ్డి, జహీరాబాద్కు ఎమ్మెల్యే కె.మదన్మోహన్రావు, చేవెళ్లకు ఎమ్మెల్యే టి.రాంమోహన్రెడ్డిలను నియమించారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జి దీపా దాస్మున్షీ ఆదేశాల మేరకు వీరి నియామకం జరిపినట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు