విభజన హామీలు అమలు చేయని మోదీ ఓట్లు ఎలా అడుగుతారు?
ప్రధాని మోదీ.. విభజన హామీలేవీ నెరవేర్చకుండా ఈ ప్రాంతానికి అన్యాయం చేశారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వరంగల్ వస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు.
బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ రాష్ట్రాన్ని మోదీకి తాకట్టు పెట్టారు
‘రైతు భరోసా’ను భాజపా, భారాస అడ్డుకున్నాయి
వరంగల్ పశ్చిమ, తూర్పు కూడలి సమావేశాల్లో సీఎం రేవంత్రెడ్డి
ఈనాడు, వరంగల్ - రంగంపేట, న్యూస్టుడే: ప్రధాని మోదీ.. విభజన హామీలేవీ నెరవేర్చకుండా ఈ ప్రాంతానికి అన్యాయం చేశారని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వరంగల్ వస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. డిసెంబరులో గెలిచింది సెమీ ఫైనల్స్ అని.. ఇప్పుడు జరగబోయే ఫైనల్ మ్యాచ్(లోక్సభ ఎన్నికలు) గుజరాత్ వర్సెస్ తెలంగాణ అని చెప్పారు. మంగళవారం రాత్రి వరంగల్ పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా కూడలి సమావేశాల్లో సీఎం ప్రసంగించారు. మే 13న జరిగే దంగల్లో గుజరాత్ టీంను డక్ అవుట్ చేసి చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. భారాస అధినేత కేసీఆర్ తన బిడ్డ బెయిల్ కోసం వరంగల్ సీటును భాజపాకు అప్పజెప్పి తెలంగాణను మోదీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు. ‘‘వరంగల్లో అక్కడక్కడా తులసివనంలో గంజాయి మొక్కల్లా ఎర్రబెల్లి, అరూరి రమేశ్ లాంటి అనకొండలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని భారాస నేతలు పట్టి పీడిస్తున్నారు. వరంగల్లో భారాస, భాజపా చీకటి ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ను దొంగ దెబ్బ కొట్టాలని కుట్ర చేస్తున్నాయి. భారాస నాయకుడిని భాజపాలోకి పంపి భారాస నుంచి ఒక డమ్మీ అభ్యర్థిని పెట్టి కాంగ్రెస్ను ఓడించేందుకు అంతర్గత అవగాహనతో ముందుకెళ్తున్నారు. అందుకే వర్షం వచ్చినా, హెలికాప్టర్ రాకపోయినా ఈ రెండు పార్టీల కుట్రలు తిప్పికొట్టి వాస్తవాలను ప్రజలకు వివరించేందుకు ఇక్కడికి వచ్చా. బుధవారం ప్రధాని మోదీ వరంగల్కు రానున్నారని తెలిసింది. భాజపాకు ప్రజలు ఎందుకు ఓటేయాలో జవాబు చెప్పాకే మోదీ ఈ గడ్డపై కాలు పెట్టాలని డిమాండ్ చేస్తున్నా. పునర్విభజన చట్టంలో భాగంగా కాంగ్రెస్ హయాంలో ఖమ్మం జిల్లాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చారు. కాజీపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రంగారెడ్డి జిల్లాకు ఐటీఐఆర్ కారిడార్, మెదక్కు ఐఐఎం, నల్గొండకు ఐఐటీ ఇచ్చారు. కానీ, ప్రధానిగా మోదీ వచ్చాక బయ్యారానికి ఉక్కు కర్మాగారాన్ని రానివ్వలేదు. కోచ్ ఫ్యాక్టరీని లాతూర్కు తరలించుకుపోయారు. ఐటీఐఆర్ కారిడార్ను రద్దు చేశారు.
గిరిజన వర్సిటీని పదేళ్లు ఆలస్యం చేసి నిన్నగాక మొన్న మొదలుపెడుతున్నామన్నారు. ఐఐటీ, ఐఐఎం ఏదీ ఇవ్వలేదు. వరంగల్ స్మార్ట్ సిటీ, భూగర్భ డ్రైనేజీ విషయంలో కేంద్రం నిర్లక్ష్యం వహించింది. ఏం ఇచ్చారని మోదీ ఓట్లు అడగడానికి వస్తున్నారని ప్రశ్నిస్తున్నా. మోదీకి దేశం అంటే గుజరాతేనా? తెలంగాణకు వచ్చిన పరిశ్రమలన్నీ గుజరాత్కే తరలించుకుపోతున్నారు. మా వరంగల్ ఔటర్ రింగురోడ్డు ఎందుకు పూర్తి చేయలేదు. ఎయిర్పోర్టు ఏర్పాటులో ఎందుకు నిర్లక్ష్యం వహించారు. దక్షిణ భారత దేశంలోనే అతిపెద్దదైన కాజీపేట జంక్షన్ను రద్దు చేసే పరిస్థితిని భాజపా సర్కారు తీసుకొచ్చింది. పదేళ్లు ఆయన(మోదీ) ఇవ్వలేదు.. ఈయన(కేసీఆర్) అడగలేదు. పదేళ్లు కేసీఆర్ అధికారంలో ఉండి తెలంగాణలో విధ్వంసం సృష్టిస్తే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు. అయినా ఆయన ఆలోచనలో మార్పు రాలేదు. బస్సు యాత్ర చేస్తూ రేవంత్రెడ్డి దిగాల్సిందే, కాంగ్రెస్ పడిపోవాల్సిందేనంటూ కేసీఆర్ మాట్లాడుతున్నారు. నేను వాళ్ల పిల్లల్నో.. వీళ్ల పిల్లల్నో చంపి ఈ కుర్చీలోకి రాలేదు. పదేళ్లు పోరాడి లక్షల మంది కాంగ్రెస్ కార్యకర్తలు రక్తాన్ని చిందించి అధికారంలోకి తెచ్చారు. కాబట్టి దిగిపొమ్మనగానే దిగిపోయేందుకు ఇక్కడ ఎవరూ అల్లాటప్పాగా లేరు. ఎవరిని మభ్యపెట్టడానికి కేసీఆర్ బస్సేసుకొని బయలుదేరారు? మీ అన్యాయంతోనే రెండు లక్షల ఖాళీలు ప్రభుత్వంలో పడావు పడ్డాయి. కానీ, నేను వచ్చిన వెంటనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చా. నేనొచ్చిన 48 గంటల్లోనే ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తే ఇప్పటికి 40 కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేశారు. 40 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే సిలిండర్ ఇస్తున్నాం. దాదాపు 50 లక్షల మంది పేదలకు 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇస్తున్నాం. ఇలా మా ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు చేసింది. వందరోజుల్లో ఇన్ని పనులు చేసిన నన్ను కేసీఆర్ దిగిపొమ్మంటున్నారు. మరి పదేళ్లు దిల్లీలో గద్దె మీద ఉన్న మోదీ గురించి కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడారా? మీరు అమ్ముడుపోయి మోదీ వద్ద తెలంగాణను తాకట్టు పెట్టినందుకే కదా వరంగల్కు కోచ్ ఫ్యాక్టరీ, ఖమ్మంకు ఉక్కు కర్మాగారం రాలేదు. రేపు జరగబోయేవి ఎన్నికలు కావు.. యుద్ధమే. కాకతీయుల పౌరుషం స్ఫూర్తితో దిల్లీ సుల్తానులను వరంగల్ ప్రజలు ఓడించాలి.
ఆ రెండు పార్టీలు అడ్డుకున్నాయి..
రైతు భరోసా నిధులు జమచేద్దామంటే.. భారాస, భాజపా వాళ్లు కలిసి కుట్ర చేసి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో 13 తర్వాతే ఆ నిధులు వేయాలని ఈసీ నాకు నోటీసులిచ్చింది. 2018 ఎన్నికల సమయంలో భారాస నేతలు రైతుల ఖాతాల్లో నగదు జమచేస్తే భాజపా వారికి సంతోషం కలిగింది. నాడు అడ్డుకోలేదు. కానీ నేను 9వ తేదీ లోపు రైతుభరోసా నిధులు ఖాతాలో వేస్తానంటే అడ్డుకున్నారు’’ అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి వినతి మేరకు ఓరుగల్లు నగరానికి భూగర్భ డ్రైనేజీ మంజూరు చేయనున్నట్లు సీఎం తెలిపారు.
సీఎంకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు
సీఎం రేవంత్రెడ్డికి మంగళవారం మంత్రులు, కాంగ్రెస్ శాసనసభ్యులు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం సీఎం దంపతుల పెళ్లి రోజైనా ఆయన కుటుంబంతో గడపకుండా ప్రజల కోసం వర్షాన్ని కూడా లెక్కచేయకుండా రోడ్డు షోకు తరలి వచ్చారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి తెలిపారు. రాత్రి ఎనిమిది గంటలకు హనుమకొండలో సీఎం ప్రసంగిస్తుండగా చినుకులు కురుస్తూనే ఉన్నాయి. అయినా పశ్చిమ, తూర్పు నియోజకవర్గాల్లో ప్రచారం చేయాల్సిందేనని పట్టుబట్టి రాత్రి 9.30 గంటలకు ముగించుకొని హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు