సీఎం కుట్రతోనే రైతుబంధు ఆగింది
‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో నన్ను దీవించారు.. పదిహేనేళ్లు పోరాటం చేసి.. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించాను. ఆ తర్వాత ఒక్కోటి బాగుచేస్తూ రాష్ట్రాన్ని పొదరిల్లులాగా తీర్చిదిద్దాను.
ఆరు గ్యారంటీలంటూ అరచేతిలో వైకుంఠం చూపెట్టిన కాంగ్రెస్
దేశ ప్రతిష్ఠను మంటగలిపిన భాజపా
కామారెడ్డి, మెదక్ రోడ్షోల్లో భారాస అధినేత కేసీఆర్
ఈనాడు, కామారెడ్డి-మెదక్, న్యూస్టుడే: ‘‘తెలంగాణ ఉద్యమ సమయంలో నన్ను దీవించారు.. పదిహేనేళ్లు పోరాటం చేసి.. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించాను. ఆ తర్వాత ఒక్కోటి బాగుచేస్తూ రాష్ట్రాన్ని పొదరిల్లులాగా తీర్చిదిద్దాను. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలను నమ్మి ప్రజలు ఓటేశారు. ఇప్పుడు కాంగ్రెస్ మోసాల నుంచి కాపాడాలన్నా.. నదుల నీళ్లు దక్కించుకోవాలన్నా.. కరెంట్ రావాలన్నా భారాస ఎంపీలు గెలవాలి’’ అని భారాస అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం రోడ్షో, అనంతరం కూడలి సమావేశంలో రాత్రి మెదక్లో నిర్వహించిన రోడ్షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించారు.
హామీలను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం
‘‘ఆరు గ్యారంటీల పేరుతో అరచేతిలో వైకుంఠం చూపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. వాటిని గాలికి వదిలేసింది. కేవలం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తున్నారు. దాంతో ఆటో రిక్షా కార్మికులు రోడ్డున పడి ఆత్మహత్య చేసుకుంటున్నారు. మహిళల ఖాతాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ.2500 చొప్పున వేయడం లేదు. డిసెంబరు 9లోపు రూ.రెండు లక్షల రుణం మాఫీ చేస్తామని కాంగ్రెస్ నాయకులు అన్నారు.. అయిందా? విద్యార్థులకు స్కూటీలు ఇవ్వలేదు గాని.. లూటీ చేస్తున్నారు. ఆసరా పింఛన్ రూ.4 వేలు చేశారా? (లేదని ప్రజలు చెప్పడంతో) పింఛన్ల మొత్తం పెంచడం సంగతి దేవుడెరుగు గాని అసలుకే మోసం తెచ్చేలా జనవరి నెల పింఛన్ను ఎగవేశారు. యువవికాసం పేరుతో నిరుద్యోగ యువతకు భృతి ఇస్తామని చెప్పినా ఇవ్వలేదు. యువత ఉపాధికి రూ.5 లక్షలు మంజూరు చేయలేదు. ముఖ్యమంత్రే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించి.. రైతుబంధు రాకుండా చేశారు. వచ్చే సీజన్ నుంచి ఐదు ఎకరాల వరకే రైతుబంధు వేస్తారట. ఆరు-ఏడు ఎకరాల రైతులు ఏం పాపం చేశారు? విద్యుత్ కోతలు విధిస్తున్నారు. మిషన్ భగీరథ జలాలు ఆగిపోయాయి. రైతుబీమా ఉంటుందో ఉండదో తెలియదు.
భాజపా ఎజెండాలో పేదల కష్టాలుండవు
ప్రధాని మోదీ పాలనలో అంతర్జాతీయంగా దేశప్రతిష్ఠ మంటగలిసింది. రూపాయి విలువ పతనమైంది. పదేళ్లలో మోదీ 150 వాగ్దానాలు ఇచ్చారు. ఒక్కటీ అమలు చేయలేదు. జన్ధన్ ఖాతాల్లో రూ.15 లక్షల చొప్పున వేస్తానన్న మోదీ మోసం చేశారు. కామారెడ్డి ప్రజలు భాజపా ఎమ్మెల్యేను గెలిపించినందుకు రూ.30 లక్షలు వేశారట నిజమేనా? భాజపా నాయకులు ప్రస్తుత ఎన్నికల్లో ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ అంటున్నారు. కేంద్రంలో మళ్లీ ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పడితే పెట్రోల్, డీజిల్ ధర రూ.400 కావడం ఖాయం. భాజపా ఎజెండాలో పేదల కష్టాలు, బాధలుండవు. రాష్ట్రానికి రావాల్సిన నవోదయ విద్యాలయాలు, వైద్య కళాశాలలు ఇవ్వలేదు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీకి అప్పజెప్పారు. సీలేరు విద్యుత్ ప్రాజెక్టును సైతం ఇచ్చేశారు. తల్లిని చంపి పిల్లను బతికించారని తెలంగాణ ఆవిర్భావం గురించి మోదీ ఎద్దేవా చేశారు. భాజపాకు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో 200లకు మించి స్థానాలు రావు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది. గోదావరి, కృష్ణా నదీ జలాలను తరలించేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారు. అందుకే భాజపాకు ఓటు వేసి తెలంగాణకు అన్యాయం చేయవద్దు. ప్రశ్నించే గొంతుకగా నిలిచే భారాసను గెలిపించాలి.
కొత్త జిల్లాలను తీసేస్తామంటున్నారు..
ఉమ్మడి మెదక్ జిల్లావాడిని కాబట్టి... ప్రేమతోటి... ఎప్పటి నుంచో డిమాండ్ ఉండడంతో మెదక్ పట్టణ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసుకున్నాం. అయితే ముఖ్యమంత్రి మెదక్ జిల్లాను తీసేస్తానంటున్నారు. జిల్లా ఉండాలంటే భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి గెలవాలి. మెదక్ కోసం యుద్ధం చేద్దాం’’ అని కేసీఆర్ అన్నారు. కార్యక్రమాల్లో అభ్యర్థులు గాలి అనిల్కుమార్(జహీరాబాద్), వెంకట్రామిరెడ్డి(మెదక్), మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్రెడ్డి, కొత్త ప్రభాకర్రెడ్డి, సునీతారెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మెదక్ జడ్పీ అధ్యక్షురాలు హేమలతగౌడ్, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ షిండే, భారాస కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు ముజీబుద్దీన్, మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!