ఐదేళ్లకు ఐదుగురు ప్రధానులట!
‘ఇండి కూటమిలో కొత్త ప్రతిపాదన వచ్చిందట. వాళ్లు అధికారంలోకి వస్తే ఐదేళ్లకు ఐదుగురు ప్రధానమంత్రులట. ఏడాదికి ఒకరని అంటున్నారు.
అలాగైతే దేశం అభివృద్ధి చెందుతుందా?
ఇండి కూటమిపై ప్రధాని మండిపాటు
దేశం, తెలంగాణ అభివృద్ధికి నాదీ గ్యారంటీ
కాంగ్రెస్, భారాసలది అవినీతి బంధం
ట్రిపుల్ ఆర్ కలెక్షన్లను మించి డబుల్ ఆర్ వసూళ్లు
వేములవాడ, వరంగల్ సభల్లో నరేంద్ర మోదీ
ఈనాడు, వరంగల్; ఈనాడు డిజిటల్, సిరిసిల్ల
‘ఇండి కూటమిలో కొత్త ప్రతిపాదన వచ్చిందట. వాళ్లు అధికారంలోకి వస్తే ఐదేళ్లకు ఐదుగురు ప్రధానమంత్రులట. ఏడాదికి ఒకరని అంటున్నారు. ఏడాదికి ఒక ప్రధానమంత్రితో దేశం బలోపేతం అవుతుందా? భారత్ అభివృద్ధి చెందుతుందా’ అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ‘పదిమంది రైతులు నీళ్ల కోసం బోరు వేసుకోవాలని అనుకున్నారు. నీళ్లు ఎక్కడ ఉంటాయో అన్వేషించారు. చివరకు ఒకరి పొలంలో వంద మీటర్లలోతులో నీళ్లు ఉన్నాయని గుర్తించారు. వంద మీటర్ల పైపు వేస్తే నీళ్లు వస్తాయి. కానీ ఆ రైతులు ఎవరి పొలంలో వారు పదిమీటర్ల పైపు వేసుకునేందుకు ముందుకు వచ్చారు. ఇండి కూటమిలో నేతలు ఇలానే ఉన్నారు’ అని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన కరీంనగర్ లోక్సభ స్థానం పరిధిలోని వేములవాడలో, వరంగల్ నియోజకవర్గం పరిధిలోని ఖిలావరంగల్ మండలం లక్ష్మీపురంలో భాజపా నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభల్లో మాట్లాడారు.‘చర్మం రంగు ఆధారంగా ప్రజల యోగ్యతను నిర్ణయిస్తారా? అలా నిర్ణయించే అధికారం వాళ్లకు ఎవరిచ్చారు? నా దేశ ప్రజల్ని అవమానిస్తే ఒప్పుకొనేదిలేదు. నన్ను నిందించండి సహిస్తా... చర్మం రంగు ఆధారంగా నా దేశ ప్రజల గౌరవాన్ని నిర్ణయిస్తే ఎంతమాత్రం సహించను’ అని ప్రధాని మోదీ అన్నారు. ‘‘2014లో ప్రజలు నాకు దేశానికి సేవచేసే అవకాశం కల్పించారు. మొదటి సారి అవకాశం వస్తే దళితుడైన రామ్నాథ్ కోవింద్ను రాష్ట్రపతిని చేశాం. రెండోసారి అవకాశం ఇస్తే ఆదివాసీ బిడ్డ ద్రౌపదీ ముర్మును రాష్ట్రపతిని చేశాం. ఈ రెండింటిని కాంగ్రెస్ పూర్తిగా వ్యతిరేకించింది. కాంగ్రెస్కు ముర్ముపై ఎందుకంత కోపం అని ఆలోచిస్తూ ఉండేవాడిని. చాలా రోజులు నాకు అర్థంకాలేదు. ఈ రోజు నాకు అర్థమైంది. అమెరికాలో ఉండే ఓ అంకుల్ రాకుమారుడికి ఫిలాసఫర్, గైడ్. రాకుమారుడు గందరగోళంలో ఉన్నప్పుడు ఆయన సలహాలు తీసుకుంటారు. ఆ ఫిలాసఫర్ ఒక రహస్యాన్ని వెలుగులోకి తెచ్చారు. ఎవరి రంగు అయితే నల్లగా ఉంటుందో వారంతా ఆఫ్రికా సంతతి అని. ఆ రంగు అంటే వారికి నచ్చదు. అందుకే ద్రౌపదీ ముర్మును ఓడించాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు దేశాన్ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? నల్లరంగులో ఉన్న శ్రీకృష్ణుడిని మనం పూజిస్తాం కదా’’ అని మోదీ అన్నారు.
అబద్ధాల మాస్టర్ కాంగ్రెస్
‘‘కాంగ్రెస్ అబద్ధాల మాస్టర్. ఈ అంశం తెలంగాణ ప్రజలకు తెలిసినట్లు వేరెవరికీ తెలియదు. ఆ పార్టీ అతిపెద్ద నేత జన్మదినం రోజున రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదు. ఇప్పుడు ఆ గడువును ఆగస్టు 15కు పొడిగించారు. అప్పటికి ఎన్నికలు అయిపోతాయి. తర్వాత చేతులెత్తేస్తారు. ఇది ప్రజలను దగా చేయడం కాదా? వేములవాడ రాజన్నపై ఒట్టు పెడతారు. మరోవైపు సనాతన ధర్మాన్ని తిడతారు. మరి వీళ్ల ఒట్లను ఎలా నమ్మాలి? తెలంగాణలో విద్యుత్ కోతలు ఎంతగా పెరిగాయంటే ప్రజల జీవనమే కష్టంగా మారింది. విశ్వాసఘాతుక కాంగ్రెస్ దేశాన్ని బలోపేతం చేస్తుందా? భారాస కాళేశ్వరం కుంభకోణానికి పాల్పడితే కాంగ్రెస్ ప్రభుత్వం రక్షించే ప్రయత్నం చేస్తోంది. భాజపా రైతులకే పెద్ద పీట వేస్తోంది. రాష్ట్రంలో పసుపు రైతులకోసం పసుపుబోర్డు ఏర్పాటు చేశాం. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తెరిపించి యువతకు ఉద్యోగాలు, రైతులకు ఎరువులు అందించాం. కేంద్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులకు తెలంగాణ ప్రభుత్వం అంతరాయం కలిగిస్తోంది. వరంగల్లో టెక్స్టైల్ పార్కు నడిపించే క్రమంలో ఇబ్బందులకు గురి చేస్తోంది. దీంట్లో కూడా డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.
రిజర్వేషన్లకు కోత విధించారు
ఇండి కూటమి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లలో కోత విధించి ముస్లింలకు ఇవ్వాలని ప్రయత్నిస్తోంది. కర్ణాటకలో బీసీ రిజర్వేషన్లలో కోత విధించి ముస్లింలకు ఇచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తే హైకోర్టు రద్దు చేసింది. దాన్ని కాంగ్రెస్ సహించలేకపోయింది. అందుకే చట్టం చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లలో కోత విధించి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ముస్లింలకు ఇచ్చింది. రిజర్వేషన్లను ముస్లింలకు ఇచ్చేందుకు ఆరాటపడుతోంది తప్ప మాదిగ సమాజానికి న్యాయం చేసేందుకు మాత్రం మనసు రావడంలేదు. మాదిగ సమాజానికి న్యాయం చేసేందుకు అసెంబ్లీ ఎన్నికల్లో నేను ఇచ్చిన మాటను మరువలేదు. దాన్ని కచ్చితంగా నెరవేరుస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ సమాజంలో ప్రతిభావంతులైన యువత అభివృద్ధి చెందడం కాంగ్రెస్కు ఇష్టంలేదు. కేంద్ర ప్రభుత్వం సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించింది. భారాసదీ అదే బాట. 2014లో భారాస.. దళితుణ్ని సీఎం చేస్తామని చెప్పి ఎవర్ని చేసిందో అందరికీ తెలుసు. దళితబంధు ఇస్తామని ఇవ్వకుండా మోసం చేసింది. బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా ముస్లింలకోసం ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.
మోదీ కాదు.. చేసింది మీ ఓటు
పదేళ్లలో నా పనితీరు చూశారు. మీ ఒక్క ఓటుతో భారతదేశం విశ్వంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది. రక్షణ పరికరాల దిగుమతుల దేశంగా ఉండేదల్లా ఇప్పుడు ఎగుమతుల దేశంగా మారింది. ఇవన్నీ మీ ఓటుతోనే సాధ్యమయ్యాయి.
మొదటిసారి భయపడుతున్న ఎంఐఎం
హైదరాబాద్లో మొదటిసారి ఎంఐఎం భయపడుతోంది. భాజపా దీటైన పోటీ ఇస్తోంది. కాంగ్రెస్, భారాసలు ఎంఐఎంను గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నాయి. రామమందిర నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. ఈ సారి కాంగ్రెస్ను గెలిపిస్తే రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరతామని చెబుతోంది. కాంగ్రెస్ను ఓడించి రామమందిరాన్ని కాపాడుకుందాం. మే 13న జరిగే పోలింగ్లో కాంగ్రెస్, భారాసకు బుద్ధి చెప్పండి. కరీంనగర్లో బండి సంజయ్ గెలుపు ఎప్పుడో నిర్ణయమైంది. పార్టీ అభ్యర్థులు బండి సంజయ్, గోమాసె శ్రీనివాస్(పెద్దపల్లి), గోడం నగేశ్(ఆదిలాబాద్), అరూరి రమేశ్(వరంగల్), సీతారాంనాయక్(మహబూబాబాద్)లకు వేసే ఓటు నేరుగా మోదీకి చేరుతుంది. వరంగల్ ఎప్పుడూ భాజపాకు మద్దతుగా నిలుస్తోంది. భారాస, కాంగ్రెస్ గుప్పిట నుంచి వరంగల్ను బయటకు తీసుకురావాలి’’ అని మోదీ అన్నారు.
ఐదేళ్లపాటు అంబానీ, అదానీ అని విమర్శించిన కాంగ్రెస్ యువరాజు ఇప్పుడు ఎన్నికల వేళ ఎందుకు మాట్లాడటంలేదు? ఏం లావాదేవీలు జరిగాయి? ఎన్ని టెంపోల డబ్బు చేరింది?
భాజపా దేశానికి మొదటి ప్రాధాన్యం ఇస్తే భారాస, కాంగ్రెస్ మాత్రం కుటుంబాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తాయి. ఈ రెండు పార్టీలు ఒకే నాణేనికి బొమ్మా, బొరుసులాంటివి. తెలంగాణను ఈ రెండు పార్టీల నుంచి కాపాడుకోవాలి.
ప్రధాని మోదీ
- కాంగ్రెస్, భారాస రెండింటినీ కలిపేది అవినీతి. ఈ రెండు పార్టీలు కుటుంబం వల్ల, కుటుంబ చేత, కుటుంబం కోసం.. అనే నినాదంతో ముందుకు సాగుతాయి.
- దేశంలో ఇప్పటి వరకు మూడు దశల పోలింగ్ ముగిసింది. మీ ఆశీర్వాదంతో ఎన్డీఏ దూసుకుపోతోంది. ఇండి కూటమి గెలిచే స్థానాల గురించి భూతద్దంలో చూసినా కనపడటంలేదు. నాలుగో దశలో జరిగే ఎన్నికల్లో అది గెలిచే సీట్ల కోసం వెదకాలంటే మైక్రోస్కోప్ కావాలి.
ప్రధాని మోదీ
రాష్ట్ర ఖజానా లూటీ అవుతోంది..
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఉన్నంతకాలం తెెలంగాణ అభివృద్ధి స్తంభించిపోతుందని మోదీ అన్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పారు. తెలంగాణ ప్రజల సొమ్ము డబుల్ ఆర్ ట్యాక్స్ పేరుతో లూటీ అవుతోందని ఆరోపించారు. ‘డబుల్ ఆర్ ట్యాక్స్లో ఒక ఖాతా మొదటి ఆర్ది. రెండో ఖాతా మరో ఆర్ది.. ఆ సొమ్ము దిల్లీకి వెళ్తోంది. సంచలన చిత్రం ట్రిపుల్ ఆర్ వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తే డబుల్ ఆర్ వ్యవహారం నాలుగు నెలల్లో అంతకంటే ఎక్కువ వసూలు చేసింది’ అని ధ్వజమెత్తారు. ఇండి కూటమి అధికారంలోకి వస్తే దేశాన్ని ఏటీఎంగా మార్చుకుంటారని అన్నారు. దేశం, తెలంగాణ అభివృద్ధికి తనది గ్యారంటీ అని ప్రకటించారు.
నాడు పీవీని అవమానించిన కాంగ్రెస్
‘‘తెలంగాణ వచ్చిన వెంటనే భారాసపై నమ్మకంతో ప్రజలు గెలిపిస్తే ఆ పార్టీ తన కుటుంబం కోసం రాష్ట్రంలోని అన్ని కుటుంబాల కలలను చిదిమేసింది. కాంగ్రెస్దీ అదే చరిత్ర. దేశం మునిగినా పర్వాలేదు కానీ కుటుంబానికి ఎలాంటి నష్టం జరగకూడదని నమ్ముతుంది. ఫ్యామిలీ ఫస్ట్ అనే లక్ష్యంతోనే నాడు ప్రధాని పీవీని అవమానించింది. కనీసం ఆయన పార్థివ దేహాన్ని కాంగ్రెస్ కార్యాలయానికి తీసుకురానీయలేదు. పీవీకి ఎన్డీయే భారతరత్న ఇచ్చి గౌరవించింది. దేశ పరిపాలన తప్పుడు చేతుల్లోకి వెళ్ల కూడదు. అందుకే దేశమంతా మరోసారి కేంద్రంలో మోదీ ప్రభుత్వం రావాలని అంటోంది. కాంగ్రెస్ పాలనలో జరిగిన కుంభకోణాలను దేశం మరచిపోలేదు. రాష్ట్రంలో నాలుగు నెలలకే రూ.వేలకోట్ల కుంభకోణాలు జరిగాయి’’ అని మోదీ అన్నారు.
పసివాడిని చూసి.. మోదీ మురిసే...
మామునూరు విమానాశ్రయం నుంచి ఓరుగల్లు జనసభకు వెళ్తూ లక్ష్మీపురంలో ఓ ఇంటి గేటు లోపల తల్లి చేతిలో ఉన్న బాలుడిని చూసిన ప్రధాని మోదీ తన వాహనాన్ని ఆపించారు. డోరు తెరిచి ఆమెను పిలిచి చిన్నారిని చేతుల్లోకి తీసుకుని ఆడించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు