కేసీఆర్కు ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పు లేదు!
‘అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఓడిపోతే ఎవరైనా బాధపడ్డారా? మద్యం కేసులో కవిత అరెస్ట్ అయితే అయ్యో పాపం అని ఎవరైనా అన్నారా? నేను వెయ్యి ఊళ్లలో అడిగినా.. వారి గురించి ఎవరూ బాధపడలేదు’ అని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
ఆయన ఆడినన్ని అబద్ధాలు ఎవరూ ఆడరు..
త్వరలో 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి
జూన్ 5 తర్వాత వారి పేర్లు చెబుతా
మీట్ ది ప్రెస్లో మంత్రి కోమటిరెడ్డి
ఈనాడు, హైదరాబాద్: ‘అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఓడిపోతే ఎవరైనా బాధపడ్డారా? మద్యం కేసులో కవిత అరెస్ట్ అయితే అయ్యో పాపం అని ఎవరైనా అన్నారా? నేను వెయ్యి ఊళ్లలో అడిగినా.. వారి గురించి ఎవరూ బాధపడలేదు’ అని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. కేసీఆర్కు ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పు లేదని, ఆయన ఆడినన్ని అబద్ధాలు ప్రపంచంలో ఎవరూ ఆడలేదని వ్యాఖ్యానించారు. సోమేశ్కుమార్ లాంటి ఐదారుగురు అధికారులను రియల్ఎస్టేట్ దళారుల్లా పెట్టుకుని పాలన చేసి దోచుకున్నారని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని చెప్పి.. హిందువుల ఓట్లు పొందాలని ప్రధాని మోదీ చూస్తున్నారని, గత పదేళ్లలో చేసిందేమీ లేక దేవుడి పేరు మీద ఓట్లు అడుగుతున్నారని ఆరోపించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్లో కోమటిరెడ్డి మాట్లాడారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఈ సమయంలో జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో.. రాష్ట్రంలో 14 లేదా 15 సీట్లను కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే..
ఆర్ఆర్ఆర్ ఎలైన్మెంట్ మార్చారు..
తన ఫాంహౌస్ ముందు నుంచి వెళ్లేలా రీజినల్ రింగురోడ్డు (ఆర్ఆర్ఆర్) ఎలైన్మెంట్ను కేసీఆర్ మార్పించారు. నూతన సచివాలయ భవనంలో రూ.50 కోట్లు అయ్యే ఒక పనిని కేసీఆర్ మౌఖిక ఆదేశాలతో రూ.270 కోట్లతో చేశామని, బిల్లులు ఇవ్వమని ఇప్పుడు కాంట్రాక్టర్లు మా చుట్టూ తిరుగుతున్నారు. ఇలా ఎక్కడైనా ఉంటుందా? కేసీఆర్ కుటుంబ సభ్యులు ఇసుక, భూములు, మద్యంలో దోచుకున్నారు. మాజీ ఎంపీ సంతోష్ ఒక్క లైసెన్స్ పేరుతో పది మద్యం షాప్లు నడిపారు. కాళేశ్వరంలో, టానిక్ వైన్షాప్లలో ఆ కుటుంబం దోచుకున్న సొమ్మును కక్కిస్తాం.
ఆ 11 ఎకరాలు వెనక్కు తీసుకుంటాం
లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిశాక భారాస భవన్కు తాళం వేస్తారు. నాలెడ్జ్ సెంటర్ పేరుతో ఆ పార్టీకి కేసీఆర్ ప్రభుత్వం కోకాపేటలో కేటాయించిన 11 ఎకరాలు వెనక్కి తీసుకుంటాం. నేను రైతులను ఎప్పుడూ తిట్టలేదు. తిట్టినట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. వచ్చే పదేళ్లు రేవంత్రెడ్డి సీఎంగా ఉంటారు. ఆయనను చూస్తుంటే పార్టీలో అందరినీ కలుపుకొని పనిచేసిన వైఎస్ గుర్తుకొస్తున్నారు. రేవంత్ ఇంటికి కార్యకర్తలు, సర్పంచి సహా ఎవరైనా నేరుగా వెళ్లవచ్చు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రగతిభవన్కు అప్పటి హోంమంత్రి వెళితే లోపలికి అనుమతి లేదని అక్కడున్న హోంగార్డు వెనక్కి పంపారు. వద్దంటున్నా ఇప్పటికే ముగ్గురు భారాస ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చారు. కాంగ్రెస్లో చేరే మరో 25 మంది ఎమ్మెల్యేల పేర్లను జూన్ 5 తరువాత చెబుతా. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారు కదా.. ఆయన వారి పేర్లు చెప్పాలి. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో భారాస బీ ఫాం తీసుకున్న ఆరుగురు అభ్యర్థులు పోటీ విరమించుకుని.. కాంగ్రెస్లో చేరతామని నా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు వద్దని చెప్పా. నియోజకవర్గాల పునర్విభజనలో తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 154కు పెరుగుతాయి.
మోదీ పాలనలో ‘ఏఏ’ ట్యాక్స్
మరోసారి నరేంద్రమోదీ ప్రధాని అయితే శాశ్వతంగా ఆయనే ఆ పదవిలో ఉండేలా రాజ్యాంగాన్ని మారుస్తారు. పేదలకు డబ్బులు పంచుతానని చెప్పి గతంలో ఓట్లు అడిగిన మోదీ, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. హామీలు ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదు. ‘ఏఏ’ ట్యాక్స్ పేరుతో అదానీ, అంబానీలకు దోచిపెట్టారు. భువనగిరి కోట అభివృద్ధికి రూ.200 కోట్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని అడిగితే, ఒక్క రూపాయి ఇవ్వలేదు. త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందుకు.. కాంగ్రెస్కు ఆంధ్రప్రదేశ్లో ఒక్క వార్డు మెంబర్ కూడా లేడు. ప్రస్తుత ఎన్నికల్లో మా పార్టీ అక్కడ ఒక్క సీటు కూడా గెలవదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!