icon icon icon
icon icon icon

రాజన్న సాక్షిగా అబద్ధాలు చెప్పిన మోదీ: మంత్రి పొన్నం

వేములవాడకు వచ్చిన ప్రధాని మోదీ రాజన్న సాక్షిగా అబద్ధాలు చెప్పారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు.

Published : 09 May 2024 06:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: వేములవాడకు వచ్చిన ప్రధాని మోదీ రాజన్న సాక్షిగా అబద్ధాలు చెప్పారని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. దేశంలో ఏదో చేశాం అని చెబుతున్న భాజపా నేతలు కరీంనగర్‌కి ఏం చేశారంటే ఏమీ చెప్పట్లేదని ఆయన విమర్శించారు. ప్రధాని మోదీ ఈ జిల్లాకు వచ్చినా ఒక్క ముక్క కూడా కరీంనగర్‌ గురించి మాట్లాడే సాహసం చేయలేదని ఆయన బుధవారం మీడియాకు పంపిన ప్రకటనలో తెలిపారు. గత పదేళ్లలో రాజన్న ఆలయానికి నిధులు ఎందుకు ఇవ్వలేదని, ఆలయ అభివృద్ధికి ఎందుకు హమీ ఇవ్వలేదని పొన్నం ప్రశ్నించారు. రాజన్నకు కనీసం రూ.కోటి కాదు సంప్రదాయం ప్రకారం ఒక కోడె దూడనైనా దానం ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎంపీ బండి సంజయ్‌ తల్లి లాంటి కరీంనగర్‌కు ఒక్క పనిచేయకపోగా చేనేతకు పన్నులు వేయించారని పొన్నం ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img