ఐదు నెలల్లో పరిస్థితులు తారుమారు
అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపారని.. ప్రజలందర్నీ మోసపుచ్చి, అధికారం చేపట్టాక ఏ ఒక్క వాగ్దానమూ అమలు చేయలేదని భారాస అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ఏ వాగ్దానమూ అమలు చేయలేదు
మోదీ హయాంలో దేశ ప్రతిష్ఠ దెబ్బతింది
అందరం ఏకమై తెలంగాణను కాపాడుకుందాం
భారాస అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు
నర్సాపూర్, పటాన్చెరు, దుండిగల్- న్యూస్టుడే: అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపారని.. ప్రజలందర్నీ మోసపుచ్చి, అధికారం చేపట్టాక ఏ ఒక్క వాగ్దానమూ అమలు చేయలేదని భారాస అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చింది. ఒక్క ఉచిత బస్ ప్రయాణం తప్ప ఏదీ నెరవేర్చలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అయిదు నెలల్లోనే పరిస్థితులు తారుమారయ్యాయి’ అని కేసీఆర్ విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ప్రధాన కూడలిలో బుధవారం రాత్రి నిర్వహించిన కార్నర్ మీటింగ్లో, హైదరాబాద్ దుండిగల్ కమాన్ వద్ద, పటాన్చెరు కూడలిలో జరిగిన రోడ్ షోలలో కేసీఆర్ ప్రసంగించారు.
‘‘భారాస ప్రభుత్వ హయాంలో పుష్కలంగా మంచినీటిని సరఫరా చేశాం. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసుకునే పరిస్థితి నగర శివారు ప్రాంతాల్లో నెలకొంది. మేం జంటనగరాల్లో కరెంట్కు ప్రాధాన్యం ఇచ్చాం. మంగళవారం కొద్దిపాటి వర్షానికే 6 నుంచి 10 గంటలపాటు కరెంట్ పోయింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీ చెబుతున్నారు. అవినీతితో రాష్ట్ర పరువు పోతోంది. భూముల ధరలు తగ్గాయి. రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలింది. పరిశ్రమలు తరలిపోతున్నాయి. రైతులకు నేను రూ.లక్ష మాఫీ చేస్తే.. సీఎం రేవంత్రెడ్డి రూ.2 లక్షలు మాఫీ చేస్తా అన్నారు. ఎందుకు చేయలేదు. రైతు కూలీలకు ఏటా రూ.12,000 ఇస్తామన్నారు. వడ్లకు ఇస్తానన్న బోనస్ బోగస్ అయింది. ఎవరైతే పంట పండిస్తారో వారికే రైతు బంధు ఇస్తారట? రాష్ట్ర హక్కులను సాధించుకునేందుకు 12 మంది భారాస ఎంపీలను గెలిపించాలి. మెదక్, చేవెళ్ల, సికింద్రాబాద్, మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాలను భారాస కైవసం చేసుకుంటుంది.
తండాలను పంచాయతీలు చేశా..
నర్సాపూర్లో లంబాడాలు ఎక్కువ. నేను సీఎంగా ఉండగా తండాలను పంచాయతీలుగా చేశాను. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు తెచ్చింది నేనే. టీఎస్పీఎస్సీలో గ్రూప్-1 పరీక్షలు జరుగుతున్నాయి. హైకోర్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రిజర్వేషన్లపై అభిప్రాయం అడిగింది. రాష్ట్రప్రభుత్వం బలంగా వాదించాల్సి ఉండగా పట్టించుకోవడంలేదు. లంబాడా పిల్లలకు 10 శాతం రిజర్వేషన్లు ఉండాలంటే కచ్చితంగా వెంకట్రామిరెడ్డి పార్లమెంట్కు వెళ్లాలి. మన తరఫున వాదించాలి. ఇందుకోసం గిరిజన లంబాడాలు భారాసను గెలిపించాలి. మేం ఉన్నపుడు పోడు భూములకు పట్టాలిచ్చాం. రైతు బీమా కూడా అందించాం. సమాజంలో ఏఒక్క వర్గం కోసమూ కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడం లేదు. అందుకోసం అందరం ఏకమై తెలంగాణను కాపాడుకోవాలి’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. రోడ్షోలలో మాజీ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, చామకూర మల్లారెడ్డి, కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్రాజు, మెదక్, మల్కాజిగిరి పార్లమెంట్ భారాస అభ్యర్థులు, వెంకట్రామిరెడ్డి, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
గోదావరి, కృష్ణా జలాలు దక్కాలంటే..
అంతర్జాతీయ స్థాయిలో విశ్వగురు అని ప్రచారం చేసుకునే ప్రధాని మోదీ దేశ ప్రతిష్ఠను మంటగలిపారు. కేజ్రీవాల్, కవిత అరెస్ట్లపై అమెరికా నిరసన వ్యక్తం చేసింది. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రూ.84కి పడిపోయింది. దేశంలో ఎగుమతులు తగ్గి, దిగుమతులు పెరిగాయి. విదేశీమారక విలువ పడిపోయింది. పదేళ్లకాలంలో మోదీ 150 నినాదాలు ఇచ్చారు. అవేవీ అమలు కాలేదు. పాకిస్థాన్ పేరు చెప్పి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తగా గమనించాలి. 400 మెగావాట్ల సీలేరు పవర్ ప్రాజెక్ట్ను మోదీ ఆంధ్రకు కట్టబెట్టారు. గోదావరి, కృష్ణా జలాలు తమిళనాడు, కర్ణాటకలకు తరలిస్తామంటున్నారు. గోదావరి, కృష్ణా జలాలు మనకు దక్కాలంటే భారాసకు లోక్సభ ఎన్నికల్లో మద్దతు తెలపాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస ఓట్లు భాజపాకు మళ్లింది 10% లోపే
రాష్ట్రంలో ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఓట్లు భాజపాకు మళ్లింది ఐదు నుంచి పది శాతంలోపే అని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ తన తుది నివేదికలో పేర్కొంది. -
కాంగ్రెస్ సోషల్ మీడియా బృందానికి సీఎం రేవంత్రెడ్డి విందు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ సోషల్ మీడియా బృందంతో గురువారం కాసేపు కాలక్షేపం చేశారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆయన గాంధీభవన్లో పార్టీ సామాజిక మాధ్యమ బృందంతో సమావేశమై... అసెంబ్లీ ఎన్నికల్లో బాగా పనిచేశారని ప్రశంసించారు. -
తెలంగాణలో 12 ఎంపీ స్థానాలు భాజపాకే.. నల్గొండలో అత్యధిక మెజార్టీ: ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం
‘‘పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో నిశ్శబ్ద విప్లవం కనిపించింది. మేం కచ్చితంగా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం. ఈ ఎన్నికలతో భాజపా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించబోతోంది. -
కాంగ్రెస్, భారాసలకు దిమ్మదిరిగే తీర్పు రాబోతోంది: బండి సంజయ్
లోక్సభ ఎన్నికల తీర్పుతో కాంగ్రెస్, భారాస నేతల దిమ్మదిరగడం ఖాయమని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ఒడిశా ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బుధవారం ఒడిశాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ అంతంతే..
లోక్సభ ఎన్నికల పోలింగ్లో కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో పాత కథే పునరావృతమైంది. పోలింగ్ తక్కువగా నమోదయ్యే 26 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. -
భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తోంది
పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన భాజపా ఏం చేసిందో ఈ ఎన్నికల్లో చెప్పకుండా అబద్ధాలను ప్రచారం చేయడం దురదృష్టకరమని, దీన్ని ప్రజలు గమనించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. -
సైలెంట్ ఓటింగ్ భారాసకే అనుకూలం: కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో భారాస అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. -
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు.
తాజా వార్తలు
-
ఐఆర్జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
-
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు