ఎన్నికల వ్యయంపై పరిమితి ఏదీ!
అంగబలం, ధనబలం రూపంలో ఈ స్ఫూర్తికి అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ధనప్రభావం.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోంది.
ఈసీ నిబంధనలు పాటించని పార్టీలు
విచ్చలవిడిగా అభ్యర్థుల ఖర్చు
నానాటికీ పెరుగుతున్న ధోరణి
ప్రజాస్వామ్యానికి నిష్పాక్షిక, పారదర్శక, ప్రలోభాలకు తావులేని ఎన్నికలే ప్రాణవాయువులు!
అంగబలం, ధనబలం రూపంలో ఈ స్ఫూర్తికి అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ధనప్రభావం.. ప్రజాస్వామ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోంది. దీన్ని కట్టడి చేయడానికి ఎన్నికల కమిషన్ (ఈసీ) వద్ద ఉన్న అస్త్రం.. అభ్యర్థుల ‘వ్యయ నియంత్రణ’! ఎన్ని చర్యలు చేపడుతున్నా.. పార్టీలు పట్టపగ్గాల్లేకుండా ఎన్నికల్లో డబ్బు కుమ్మరిస్తున్నాయి. ఫలితంగా ఎన్నికలు నానాటికీ వ్యయభరిత మవుతున్నాయి.
ఏమిటీ వ్యయ పరిమితి?
ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా అభ్యర్థులందరికీ సమానావకాశాలు లభించేలా చూడటానికి వారి ఎన్నికల ప్రచార ఖర్చుపై ఈసీ నియంత్రణ పెట్టింది. ఒక అభ్యర్థి తన ఎన్నికల ప్రచారం కోసం చట్టబద్ధంగా వెచ్చించదగిన మొత్తాన్ని వ్యయపరిమితిగా పేర్కొంటారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 77(1) ప్రకారం.. అభ్యర్థుల తమ ప్రచార ఖర్చుకు సంబంధించిన లెక్కలను పక్కాగా నిర్వహించాలి. నామినేషన్ వేసిన తేదీ నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చేవరకూ వీటిని కొనసాగించాలి. ఇందులో బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రకటనలు, పోస్టర్లు, బ్యానర్లు, వాహనాలకు సంబంధించిన వ్యయాన్ని నమోదు చేయాలి.
- అభ్యర్థుల ప్రచార ఖర్చులపై మాత్రమే పరిమితి ఉంది. ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు వెచ్చించే మొత్తాలపై ఎలాంటి ఆంక్షలు లేవు.
- అభ్యర్థులంతా తమ వ్యయ ప్రకటనలను ఎన్నికలు ముగిశాక ఈసీకి సమర్పించాలి.
ప్రాతిపదిక ఏమిటి?
ఎన్నికల సంఘం తరచూ వ్యయపరిమితిని సవరిస్తూ ఉంటుంది. పెరుగుతున్న ఖర్చు, ఓటర్ల సంఖ్య ఆధారంగా ఈ కసరత్తు జరుగుతుంది. ద్రవ్యోల్బణం కారణంగా ఏటేటా సరకులు, వస్తువుల ధరల్లో పెరుగుదలను అంచనావేయడానికి ధరల ద్రవ్యోల్బణ సూచీ (సీఎఫ్ఐ)ని ప్రామాణికంగా తీసుకుంటారు. 2014-15లో అది 240గా ఉండేది. 2021-22కు 317కు పెరిగింది. ఆ మేరకు 2022లో చివరిసారిగా అభ్యర్థుల వ్యయపరిమితిని ఈసీ సవరించింది.
ఇలా పెరుగుతూ వచ్చింది..
- స్వతంత్ర భారత తొలి సార్వత్రిక ఎన్నికలు 1951-52లో జరిగాయి. నాడు లోక్సభ అభ్యర్థి వ్యయ పరిమితి రూ.25వేలుగా ఉంది. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో దాన్ని రూ.10వేలుగా నిర్ణయించారు.
- 1971లో ప్రధాన రాష్ట్రాల్లో దాన్ని రూ.35వేలుగా ఈసీ నిర్ధరించింది. 1980లో రూ.లక్షకు పెంచింది.
- 1984లో దాన్ని పెద్ద రాష్ట్రాల్లో రూ.1.5లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.1.3 లక్షలుగా నిర్ధారించారు. 1-2 లోక్సభ స్థానాలున్న రాష్ట్రాలకు దాన్ని రూ.లక్షగా, చండీగఢ్ వంటి కొన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు రూ.50వేలుగా నిర్ణయించారు.
- 1996లో వ్యయ పరిమితిని పెద్ద రాష్ట్రాల్లో రూ.4.5లక్షలకు పెంచారు. 1998లో దాన్ని ఏకంగా రూ.15లక్షలకు నిర్ణయించారు. 2004లో రూ.25లక్షలకు చేరింది.
- పదేళ్లపాటు ఈ పరిమితిలో మార్పు లేదు. 2014లో అది రూ.70లక్షలకు పెరిగింది. 2022లో మరోసారి సవరణ జరిగింది.
ఇవి తప్పనిసరి..
- అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయాన్ని ప్రత్యేక బ్యాంకు ఖాతా ద్వారా నిర్వహించాలి.
- ప్రచార సామగ్రిని సరఫరాదారులు, ముద్రణదారుల ఫొటోలతో ఒక డిక్లరేషన్ ఫారంను సమర్పించాలి.
- రూ.10 లక్షలకు మించిన అనుమానాస్పద లావాదేవీల గురించి బ్యాంకులు సంబంధిత జిల్లా కలెక్టర్లకు తెలియజేయాలి.
పట్టుబడుతున్న సొమ్మూ భారీగానే..
2019 ఎన్నికల సమయంలో నగదు, ఇతర వస్తువులు భారీగా పట్టుబడ్డాయి. వాటి విలువ రూ.3,475 కోట్లు. 2014 ఎన్నికల్లో పట్టుబడ్డ సొమ్ముతో పోలిస్తే ఇది మూడింతలు కావడం గమనార్హం.
‘కట్టలు’ తెగుతున్న అనధికార ఖర్చు
ధన ప్రభావ కట్టడికి ఈసీ ఎన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ ఎన్నికలు అంతకంతకూ ఖరీదవుతున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు ఏకంగా రూ.55,000 కోట్ల నుంచి 60,000 కోట్ల మధ్య ఖర్చుపెట్టాయని ‘సెంటర్ ఫర్ మీడియా స్టడీస్’ అనే స్వచ్ఛంద సంస్థ పరిశీలనలో వెల్లడైంది. దాదాపు 85 లోక్సభ స్థానాల్లో అభ్యర్థులు రూ.40 కోట్లపైబడి వెచ్చించారని తెలిపింది.
- 2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులు రూ.30వేల కోట్లను ఖర్చుపెట్టినట్లు అంచనా. ఆ తర్వాత ఐదేళ్లకు జరిగిన ఎన్నికల్లో అది రెట్టింపు కావడం గమనార్హం. 2019 ఎన్నికల్లో పార్టీలు సరాసరిన ఓటుకు రూ.700 ఖర్చు పెట్టినట్లు అంచనా. ఎన్నికల షెడ్యూల్ రావడానికి ముందు పెట్టిన ఖర్చును కూడా పరిగణనలోకి తీసుకుంటే.. ఈ మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది.
- 1999లో ఈ వ్యయం రూ.10వేల కోట్లుగా ఉండగా.. 2004కు అది రూ.14వేల కోట్లకు, 2009కి రూ.20వేల కోట్లకు, 2014లో రూ.30వేల కోట్లకు పెరిగింది.
తేడాలుంటే అనర్హతే..
సమర్పించిన ఖర్చు వివరాల్లో తేడాలున్నా లేక నిర్దేశించిన పరిమితిని దాటినా.. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 10(ఎ) కింద సంబంధిత అభ్యర్థిపై అనర్హతవేటు పడుతుంది.
ఎంత ఖర్చుపెట్టవచ్చు?
చాలా రాష్ట్రాల్లో లోక్సభ అభ్యర్థికి గరిష్ఠ వ్యయపరిమితిని రూ.95 లక్షలుగా నిర్ధారించారు. అరుణాచల్ప్రదేశ్, గోవా, సిక్కింలో దాన్ని 75 లక్షలుగా నిర్ణయించారు. కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆ పరిమితి రూ.75-95 లక్షల మధ్య ఉంది.
పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ అభ్యర్థి రూ.40 లక్షలు, చిన్నరాష్ట్రాల్లో రూ.28 లక్షలు ఖర్చుపెట్టవచ్చు.
పర్యవేక్షణ ఎలా?
అభ్యర్థుల ప్రచార ఖర్చులను పర్యవేక్షించడానికి ఈసీ వ్యయ పరిశీలకులతోపాటు రాష్ట్ర, కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ సంస్థలు రంగంలోకి దిగుతాయి. ఇందులో ఫ్లయింగ్ స్క్వాడ్లు, నిఘా బృందాలు, వీడియో నిఘా బృందాలు ఉంటాయి.
ఈనాడు ప్రత్యేక విభాగం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్