చాయ్.. సమోసా.. బిర్యానీ.. దేని లెక్క దానిదే..!
ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయ పరిశీలన ప్రక్రియలో భాగంగా జిల్లాల ఎన్నికల కమిటీలు వివిధ వస్తువులకు ధరలను నిర్ణయిస్తాయి. ఈ జాబితా ఆధారంగా జిల్లా ఎన్నికల అధికారి.. అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని మదిస్తారు.
అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిశీలనలో భాగంగా మెనూ నిర్ణయం
ఒక్కోచోట ఒక్కోలా..
ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయ పరిశీలన ప్రక్రియలో భాగంగా జిల్లాల ఎన్నికల కమిటీలు వివిధ వస్తువులకు ధరలను నిర్ణయిస్తాయి. ఈ జాబితా ఆధారంగా జిల్లా ఎన్నికల అధికారి.. అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని మదిస్తారు. టోకు ధరల సూచీ, ద్రవ్యోల్బణ రేటు, ఆర్థిక శాఖ అందించే ఇతర ఆర్థిక సూచికల ఆధారంగా ఆయా జిల్లాల్లోని ప్రజాపనుల శాఖ.. ధరల జాబితాను జారీ చేస్తుంది. ఈ దఫా కొన్నిచోట్ల ఇవి ఇప్పటికే సిద్ధమయ్యాయి. ఇందులో టీ, కాఫీల నుంచి రకరకాల ఆహారపదార్థాల ధరల ప్రస్తావన ఉంది. పూలమాలలు, జెండాలు, టోపీలకూ రేట్లను నిర్ణయించారు. వాహనాలు, సోఫాలు, ఏసీల అద్దెలనూ నిర్ధరించారు. అవి దేశవ్యాప్తంగా ఒకేలా లేవు. కొన్నిచోట్ల మార్కెట్ కన్నా తక్కువ ధరకు, మరికొన్నిచోట్ల ఎక్కువ రేటుకు నిర్ణయించారు.
ఎక్కడ ఎలా?
దేశంలోని చాలాప్రాంతాల్లో సర్వసాధారణంగా వడ్డించే స్నాక్స్లో చాయ్, సమోసా ముందుంటుంది. చాలావరకూ జిల్లాల కమిటీలు తమ మెనూలో వీటికి స్థానం కల్పించాయి. వీటి ధర ఎక్కడెక్కడ ఎంత పలుకుతోందంటే..
పంజాబ్లోని జలంధర్లో అభ్యర్థులు కప్పు టీ కోసం రూ.15 ఖర్చు పెట్టవచ్చు. సమోసాకు అంతే మొత్తాన్ని ధరగా నిర్ణయించారు.
మధ్యప్రదేశ్లోని మాండ్లాలో కప్పు టీకి రూ.7, సమోసాకు రూ.7.50 వెచ్చించొచ్చు. ఇదే రాష్ట్రంలోని బాలాఘాట్లో టీ ధర రూ.5గా, సమోసా రేటు రూ.10గా నిర్ధారించారు.
- మణిపుర్లోని థౌబల్ జిల్లాలో టీ, సమోసా ధరలను రూ.10 చొప్పున నిర్ణయించారు. ఈ రాష్ట్రంలోని తెగ్నౌపాల్ జిల్లాలో బ్లాక్ టీ 5, మిల్క్ టీ ధరను రూ.10గా లెక్కకట్టారు.
- చెన్నైలో టీ ధర రూ.10-15 మధ్య, కాఫీ రేటు.. రూ.15-20గా ఉంది.
- గౌతమబుద్ధ నగర్ (నోయిడా/ గ్రేటర్ నోయిడా)లో సమోసా, కప్పు టీలకు రూ.10 చొప్పున నిర్ధారించారు.
- ఉత్తర గోవాలో సమోసా, టీకి రూ.15 చొప్పున, కాఫీకి రూ.20గా లెక్కగట్టారు.
మౌలిక వసతులకు ఇలా..
హెలిప్యాడ్లు, విలాసవంతమైన వాహనాలు, ఫామ్హౌస్లు వంటి ఖరీదైన మౌలికవసతుల నుంచి పూలు, కూలర్లు, టవర్ ఏసీలు, సోఫాల రేట్లనూ ప్రస్తావించారు.
- ప్రచారం కోసం టాటా సఫారీ లేదా స్కార్పియో నుంచి హోండా సిటీ, సియాజ్, బహిరంగ సభలకు ప్రజలను చేరవేయడానికి బస్సుల వరకూ వివిధ వాహనాల అద్దెలపై పరిమితిని నిర్దేశించారు.
- రోజా పూలతో తయారైన పూలమాలకో రేటును, బంతిపూల మాలకో ధరను నిర్ణయించారు. పుష్పగుచ్ఛాలనూ అధికారులు వదలలేదు.
- ప్రాంగణాలు, వసతి కోసం అనుమతించిన రేట్ల వివరాలనూ ప్రస్తావించారు. బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రకటనలు, హోర్డింగ్లు, కరపత్రాలు, ఫ్లెక్సీలు, టోపీలు, జెండాలు, ఇతర ప్రచార సామగ్రి, ఎన్నికలకు సంబంధించిన ఇతర పనులకూ రేట్లను నిర్దేశించారు.
మరికొన్ని..
- జలంధర్లో ఛోలే భటూరేకు రూ.40, మటన్కు రూ.500, చికెన్కు రూ.250గా ధర నిర్ధరించారు. ఢోఢా (కిలో 450), ఘీ పిన్నీ (కిలో రూ.300) వంటి డెజర్ట్లకూ గరిష్ఠ ధరలను నిర్ణయించారు. గ్లాసు లస్సీకి రూ.20, కొబ్బరి నీళ్లు రూ.15గా నిర్ధరించారు.
- మధ్యప్రదేశ్లోని బాలాఘాట్లో ఇడ్లీ, సాంబార్, పోహా-జిలేబీకి రూ.20 చొప్పున, దోశ, ఉప్మాలకు రూ.30 ధరను నిర్ధరించారు.
- మణిపుర్లోని థౌబల్ జిల్లాలో కచోరి, ఖర్జూరాలు, గాజా (డిజెర్ట్)లకు రూ.10 చొప్పున నిర్ణయించారు. తెగ్నౌపల్ జిల్లాలో బాతు మాంసం రూ.300, పందిమాంసం రూ.400గా నిర్ధరించారు.
- చెన్నైలో 2019నాటితో పోలిస్తే చికెన్ బిర్యానీ ప్యాకెట్ ధరను రూ.180 నుంచి రూ.150కి తగ్గించడం గమనార్హం.
- గౌతమబుద్ధ నగర్లో వెజ్ థాలీకి రూ.100 ధరను నిర్ధరించారు. కచోరి రూ.15, శాండ్విచ్ రూ.25, కిలో జిలేబీ ధర రూ.90గా నిర్ధరించారు.
- ఉత్తర గోవాలో అభ్యర్థులకు నిర్దేశించిన మెనూలో బటాటా వడ ఉంది. దీని ధర రూ.15.
- హరియాణాలోని జింద్లో అభ్యర్థులు తందూర్ పొయ్యిని రూ.300 అద్దెకు తీసుకోవచ్చు. అక్కడ దాల్ మఖనీ, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీకి రూ.130 చొప్పున, మటర్ పన్నీర్కు రూ.160 ధరను అధికారులు నిర్ణయించారు. బటర్ నాన్, మిస్సీ రోటీ, సాదా రోటీ, కాజూ కట్లీ, గులాబ్ జామ్ వంటి డెజర్ట్లనూ మెనూలో చేర్చారు.
మద్యం మాట లేదు..
ఎన్నికలంటే మద్యం ఏరులై పారుతుంటుంది. పార్టీ కార్యర్తలు, ఓటర్లకు అభ్యర్థులు మందు పంపిణీ చేస్తారన్నది బహిరంగ రహస్యమే. అయితే వీటి ధరలను రేటు కార్డుల్లో ప్రస్తావించలేదు.
6 పైసల నుంచి రూ.46 వరకూ...
దేశంలో ఎన్నికల నిర్వహణకు ఈసీ పెడుతున్న ఖర్చు కూడా పెరుగుతోంది. 1952లో జరిగిన దేశ తొలి ఎన్నికలకు రూ.10కోట్లు వ్యయమయ్యాయి. ఈ లెక్కన ఒక్కో ఓటరుపై 6పైసలు ఖర్చయింది. 2014 నాటికి ఆ వ్యయం రూ.46కు పెరిగింది. ఈసారి అది రూ.50పైనే ఉండొచ్చు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!