ఎన్నికల బరిలో రాజులు, రాణులు
ఒడిశాలో రాజులు, రాణులకు ఆదరణ తగ్గలేదు. ప్రతిసారీ ఎన్నికల్లో కొందరు బరిలో దిగుతున్నారు. ఓటర్లు వారిని గెలిపించి చట్టసభలకు పంపుతున్నారు. లోక్సభ, శాసనసభలో వారి ప్రాతినిధ్యం కొనసాగుతోంది.
ఒడిశాలో ప్రతిసారీ ఆదరిస్తున్న ఓటర్లు
భువనేశ్వర్, న్యూస్టుడే: ఒడిశాలో రాజులు, రాణులకు ఆదరణ తగ్గలేదు. ప్రతిసారీ ఎన్నికల్లో కొందరు బరిలో దిగుతున్నారు. ఓటర్లు వారిని గెలిపించి చట్టసభలకు పంపుతున్నారు. లోక్సభ, శాసనసభలో వారి ప్రాతినిధ్యం కొనసాగుతోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లోనూ కొందరు రాజులు, రాణులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
ఐదోసారి సంగీత
బలంగీర్ రాణి సంగీతా కుమారి సింగ్దేవ్ భాజపాలో అగ్ర నాయకురాలు. ఆమె నాలుగు సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. ఈసారి మళ్లీ ఆ పార్టీ అభ్యర్థిగా బలంగీర్ బరిలో ఉన్నారు.
అసెంబ్లీ అభ్యర్థిగా సంగీత భర్త
సంగీత భర్త బలంగీర్ రాజు కనకవర్ధన్ సింగ్దేవ్ పాట్నాగఢ్ అసెంబ్లీ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన పాట్నాగఢ్ నుంచి మూడు సార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. మంత్రిగానూ గతంలో పని చేశారు.
మాజీ ఎంపీ ఈసారి అసెంబ్లీకి..
బలంగీర్ రాజ కుటుంబానికి చెందిన యువరాజు కాళికేష్ నారాయణ్ సింగ్దేవ్ గతంలో ఒకసారి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో బిజద అభ్యర్థిగా పోటీచేసి తన పిన్ని సంగీత చేతిలో ఓడిపోయారు. ఈసారి కాళికేష్ బలంగీర్ అసెంబ్లీ స్థానం నుంచి బిజద అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
కలహండి నుంచి మాళవిక
కలహండి జిల్లా భవానీపట్నా రాజ ప్రసాదానికి చెందిన రాజు అర్కకేసరి దేవ్ గతంలో బిజద అభ్యర్థిగా కలహండి నుంచి పోటీ చేసి గెలిచారు. 2019లో భాజపా అభ్యర్థి చేతిలో ఓడిపోయిన తర్వాత భార్య రాణి మాళవిక దేవితో కలిసి కమల దళంలో చేరారు. ఈసారి భాజపా కలహండిలో మాళవికను అభ్యర్థిగా నిలిపింది.
ఒళి నుంచి ప్రతాప్ మళ్లీ..
ప్రస్తుత పరిశ్రమలు, విద్యుత్తుశాఖల మంత్రి కేంద్రపాడా జిల్లా ఒళి ప్రాంత రాజు ప్రతాప్దేవ్. ఆయన వరుసగా మూడు సార్లు ఒళి నుంచి బిజద అభ్యర్థిగా ఎన్నికయ్యారు. ఈసారి మళ్లీ అదే పార్టీ అభ్యర్థిగా అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
తల్లి స్థానంలో కుమారుడు
గంజాం జిల్లా చికిటి రాణి ఉషాదేవి బిజద అభ్యర్థిగా వరుసగా ఐదుసార్లు పోటీ చేసి గెలిచారు. నవీన్ మంత్రివర్గంలో ప్రస్తుతం ఆమె పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణశాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. వయో భారం, ఆరోగ్య సమస్యల నేపథ్యంలో తన కుమారుడు యువరాజు చిన్మయానంద శ్రీరూప్ దేవ్ను బిజద అభ్యర్థిగా చేశారు. కుమారుడి తరఫున తల్లి ప్రచారం చేస్తున్నారు. చికిటిలో తెలుగు ఓటర్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నందున ప్రచారానికి పాటలను తెలుగులో రికార్డు చేయించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.