భూపేశ్ బఘేల్కు పరీక్ష!
లోక్సభ ఎన్నికల్లో గత రెండు విడతలుగా సాధించిన అప్రతిహత విజయాలను కొనసాగించాలని భాజపా, గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం నుంచి కోలుకోవాలని కాంగ్రెస్.. ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో హోరాహోరీ తలపడుతున్నాయి.
ఛత్తీస్గఢ్లో రెండోవిడత 3 చోట్ల పోలింగ్
లోక్సభ ఎన్నికల్లో గత రెండు విడతలుగా సాధించిన అప్రతిహత విజయాలను కొనసాగించాలని భాజపా, గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయం నుంచి కోలుకోవాలని కాంగ్రెస్.. ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో హోరాహోరీ తలపడుతున్నాయి. ఈ రాష్ట్రంలో మొత్తం 11 నియోజకవర్గాలుండగా తొలి విడతలో ఒక స్థానానికి పోలింగ్ పూర్తయింది. మరో 3 సీట్లకు 26వ తేదీన పోలింగ్ జరగనుంది. మిగిలిన 7 చోట్ల వచ్చే నెల 7వ తేదీన పోలింగ్ జరుగుతుంది. రెండో విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో రాజ్నంద్గావ్, మహాసముంద్, కాంకేర్ (ఎస్టీ) ఉన్నాయి. వీటిలో జాతీయ, స్థానిక అంశాలు ప్రభావం చూపుతున్నాయి. మోదీ గ్యారంటీలకు, కాంగ్రెస్ గ్యారంటీలకు మధ్య పోరు సాగుతోంది.
వీఐపీ నియోజకవర్గం
-రాజ్నంద్గావ్
విద్యావంతులు, మేధావులకు నిలయమైన రాజ్నంద్గావ్ ఘన సంస్కృతి కలిగిన నగరం. వారసత్వానికీ ప్రతీకగా నిలిచిన నగరం ఇది. ఎంతో మంది ప్రముఖులు ఇక్కడ పోటీ చేశారు. అందుకే దీనిని వీఐపీ నియోజకవర్గంగా చూస్తారు. 15,88,095 ఓటర్లున్న ఇక్కడ కాంగ్రెస్దే ఆధిపత్యం. ఛత్తీస్గఢ్ ఏర్పాటయ్యాక భాజపా ప్రాభవం ప్రారంభమైంది. గత ఎన్నికల్లో భాజపా గెలిచింది. శివనాథ్ నదీ తీరంలో ఉన్న ఈ నియోజకవర్గంలో వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, ఖనిజాలే జీవనాధారం. ఆసియాలోనే తొలి సంగీత విశ్వవిద్యాలయం ఈ ప్రాంతంలోని ఖైరాగఢ్లో ఉంది. ఇక్కడ గత ఎన్నికల్లో గెలిచిన సంతోశ్ పాండే మళ్లీ పోటీ చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ నుంచి మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ పోటీ చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఆయనకు ఇది పరీక్షే. ఈ నియోజకవర్గంలో గిరిజనులు 35శాతం, లోధి వర్గీయులు 30శాతం ఉన్నారు. గతంలో ఇక్కడ జౌళి పరిశ్రమ ఉండేది. ఇక్కడి నుంచి ఎందరో హాకీ క్రీడాకారులు వచ్చారు. ఈ నియోజకవర్గంలోని 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో 6 కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి. ఒక దానిని భాజపా, మరోదానిని జోగి కాంగ్రెస్ గెలుచుకున్నాయి.
వీసీ శుక్లా కంచుకోట
-మహాసముంద్
సీనియర్ కాంగ్రెస్ నేత విద్యాచరణ్ శుక్లా ఆరుసార్లు గెలిచిన నియోజకవర్గం మహాసముంద్. సాంస్కృతికంగా ఘన చరిత్ర కలిగిన ప్రాంతం. సోమవంశీ రాజులు పాలించిన ప్రాంతం. ఇక్కడ 15,15,747 ఓట్లున్నాయి. 2019లో ఇక్కడి నుంచి భాజపా నేత చున్నీలాల్ సాహు విజయం సాధించారు. ఈసారి భాజపా నుంచి రూప్ కుమారి చౌధరి, కాంగ్రెస్ నుంచి తామ్రధ్వజ్ సాహు, గోండ్వానా గణతంత్ర పార్టీ నుంచి మహమ్మద్ ఫరీద్ ఖురేషీ బరిలో ఉన్నారు.
అభివృద్ధి దిశగా కాంకేర్
రాజధాని రాయ్పుర్ దగ్గరగా ఉన్న కాంకేర్ 10ఏళ్ల కిందట నక్సల్స్కు కేంద్ర స్థానంగా ఉండేది. గత కొంత కాలంగా అభివృద్ధి పనులు జరగడంతో క్రమంగా ఈ ప్రాంతంలో మావోయిస్టులు పట్టు కోల్పోయారు. రోడ్లు నిర్మించడం, మార్కెట్ల ఏర్పాటు, పారామిలిటరీ బలగాల మోహరింపువల్ల అబూజ్మఢ్లోకి వచ్చే ఇక్కడి 70శాతం ప్రాంతానికి మావోయిస్టుల నుంచి విముక్తి కలిగిందని స్థానికులు చెబుతున్నారు. కొన్ని గ్రామాలకు ఫోన్లు, ఇంటర్నెట్ వచ్చాయి. 15ఏళ్ల కిందట ఇక్కడ ఓటు వేసేవాళ్లం కాదని, ఇప్పుడు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నామని మోహ్లాకు చెందిన స్థానికుడొకరు తెలిపారు. మోదీ అద్భుతంగా చేశారని ఒకరు చెప్పగా ఆయన ఏం చేశారని మరొకరు ప్రశ్నించారు. కాంకేర్లో భాజపా తరఫున భోజ్రాజ్ నాగ్ పోటీ చేస్తున్నారు. 2019లో ఈ సీటును 6వేల స్వల్ప మెజారిటీతో భాజపా గెలుచుకుంది. 2019లో పోటీ చేసిన వీరేశ్ ఠాకుర్నే కాంగ్రెస్ బరిలోకి దింపింది. తమకు నల్ జల్ యోజన కావాలని, గ్రామాల్లో అంతర్గత రోడ్డు వేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అభివృద్ధికే ఓటేస్తామని చెబుతున్నారు.
ఈనాడు ప్రత్యేక విభాగం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
ఆకాశంలో రాకాసి ఉల్క.. రాత్రిని పగలుగా మార్చేంత వెలుగు..!
-
18 ఏళ్ల ‘గోదావరి’.. సుమంత్కు ముందు అనుకున్న హీరోలేవంటే?
-
లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
-
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
-
మమత విషయంలో ఖర్గే చెప్పినా నేను వినను: అధిర్ రంజన్
-
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం