ఓం బిర్లాపై వలస నేత.. బరిలో కాంగ్రెస్ నుంచి భాజపా మాజీ నేత గుంజాల్
రాజస్థాన్లోని కోటా నుంచి 2019లో రెండోసారి ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లాను లోక్సభ స్పీకర్ను చేసి భాజపా అధిష్ఠానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. విద్యా కేంద్రంగా విలసిల్లుతున్న కోటా నుంచి మరోసారి ఆయనే పోటీ చేస్తున్నారు.
జైపుర్ నుంచి ప్రకాశ్ భండారీ
రాజస్థాన్లోని కోటా నుంచి 2019లో రెండోసారి ఎంపీగా ఎన్నికైన ఓం బిర్లాను లోక్సభ స్పీకర్ను చేసి భాజపా అధిష్ఠానం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. విద్యా కేంద్రంగా విలసిల్లుతున్న కోటా నుంచి మరోసారి ఆయనే పోటీ చేస్తున్నారు. దేశంలో ప్రముఖ వ్యాపారులైన బిర్లాలతో ఆయనకు ఎటువంటి సంబంధం లేదు. విద్యార్థి నాయకుడి నుంచి లోక్సభ స్పీకర్గా ఆయన ఎదిగారు. ఆయనపై కాంగ్రెస్ తరఫున పోటీ చేయడానికి ఎవరూ లేకపోవడంతో భాజపా సీనియర్ నేత ప్రహ్లాద్ గుంజాల్ను తీసుకొచ్చి పోటీ చేయిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోటా నార్త్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన గుంజాల్ కాంగ్రెస్ అభ్యర్థి శాంతి ధరీవాల్ చేతిలో ఓడిపోయారు. గుంజాల్ అభ్యర్థిత్వాన్ని ధరీవాల్ తీవ్రంగా వ్యతిరేకించినా మాజీ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్, గోవింద్ సింగ్ డోటాసరా ఆయనకే టికెట్ ఇచ్చారు. ధరీవాల్ తనను వ్యతిరేకించినా గుంజాల్ పెద్దగా పట్టించుకోవడం లేదు.
గుజ్జర్లు, మీనాలపై ఆశ..
కోటా నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న గుజ్జర్లు, మీనాలపై ప్రహ్లాద్ గుంజాల్ ఆశలు పెట్టుకున్నారు. ఆయన భాజపాపైనా, మోదీపైనా, అమిత్ షాపైనా విమర్శలు చేయడం లేదు. కేవలం ఓం బిర్లానే లక్ష్యంగా చేసుకున్నారు. కోటాను బిర్లా.. తన రాజ్యంగా మార్చుకున్నారని, ఆయన సోదరుడు పెత్తనం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
ధరీవాల్ అశోక్ గహ్లోత్ కేబినెట్లో పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా పని చేశారు. కోటాలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. చంబల్ నదీ తీరాన్ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా మార్చారు. దీంతో ఆయనకు ఈ ప్రాంతంపై పట్టుంది.
క్షమాపణలు చెప్పని గుంజాల్
కాంగ్రెస్లో చేరిన వెంటనే జరిగిన బహిరంగసభలో గుంజాల్ మాట్లాడుతూ.. ధరీవాల్ మద్దతు కోరారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో తనపై చేసిన అవినీతి ఆరోపణలకు క్షమాపణలు చెబితేనే మద్దతిస్తానని ధరీవాల్ షరతు పెట్టారు. దీనికి గుంజాల్ అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య సఖ్యత కుదరలేదు.
విమానాశ్రయం అంశం
కోటాలో విమానాశ్రయ ఏర్పాటు ఎన్నికల అంశంగా మారింది. ఎంతోకాలంగా పెండింగ్లో ఉన్న ఇది రెండు పార్టీల మధ్య ప్రచారానికి అస్త్రంగా మారింది. తాము ఉచితంగా భూమి సేకరించి ఇచ్చినా విమానాశ్రయ ఏర్పాటుకు ఓం బిర్లా అనుమతులు తేలేదని ధరీవాల్ ఆరోపిస్తున్నారు. అయితే తాను రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయించానని, రోడ్లు వేయించానని, రైళ్లను తీసుకొచ్చానని బిర్లా చెబుతున్నారు.
గుంజాల్కు ధరీవాల్ మద్దతిస్తే బిర్లాకు ఇబ్బందే
ఓం బిర్లా ఎదురీదుతున్నారు. ఒకవేళ గుంజాల్కు కోటా నగరంలో ధరీవాల్ పూర్తి స్థాయి మద్దతిస్తే బిర్లా ఓటు బ్యాంకుకు గండి పడటం ఖాయం. అప్పుడు స్పీకర్కు ఇబ్బందులు తప్పవు. 55,000 మంది మైనారిటీలతోపాటు గుజ్జర్లు, మీనాలు మద్దతిస్తే గుంజాల్ లాభపడతారు. అప్పుడు పట్టణ ప్రాంత ఓటర్లపై బిర్లా ఆధారపడాల్సి వస్తుంది. వారంతా మద్దతిస్తేనే ఆయన బయటపడతారు. కోటా నియోజకవర్గం 2 జిల్లాల్లోని 6 అసెంబ్లీ సెగ్మెంట్లలో విస్తరించి ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో గుంజాల్కు, పట్టణ ప్రాంతాల్లో బిర్లాకు పట్టుంది. రెండో విడత పోలింగ్ జరిగే 13 నియోజకవర్గాల్లో కోటాలో గట్టి పోటీ నెలకొందని భాజపా భావిస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.