పూర్ణియాలో పరువు పోరు!
దేశంలోని రెండు ప్రధాన రాజకీయ కూటములు...అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా హోరాహోరీ తలపడుతున్న రాష్ట్రం బిహార్. రాష్ట్రమంతటా ఈ కూటములఅభ్యర్థుల మధ్యే పరస్పర పోటీ నెలకొన్నప్పటికీ పూర్ణియా లోక్సభ స్థానంలో మాత్రం త్రిముఖ పోరు కనిపిస్తోంది.
ఎన్డీయే, ఇండియా కూటములకు సవాల్ విసురుతున్న పప్పూయాదవ్
కాంగ్రెస్ అవమానించింది అంటూ స్వతంత్రంగా పోటీ
ఆర్జేడీలో చేరిన వెంటనే టికెట్ పొందిన బీమా భారతి
హ్యాట్రిక్ కోసం జేడీయూ తీవ్ర ప్రయత్నం
బిహార్లో రాజకీయం గరం గరం
దేశంలోని రెండు ప్రధాన రాజకీయ కూటములు...అధికార ఎన్డీయే, విపక్ష ఇండియా హోరాహోరీ తలపడుతున్న రాష్ట్రం బిహార్. రాష్ట్రమంతటా ఈ కూటముల అభ్యర్థుల మధ్యే పరస్పర పోటీ నెలకొన్నప్పటికీ పూర్ణియా లోక్సభ స్థానంలో మాత్రం త్రిముఖ పోరు కనిపిస్తోంది. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూయాదవ్ ఆ కూటముల అభ్యర్థులను ఒంటరిగానైనా బలంగానే ఢీకొంటున్నారు. దీంతో అక్కడ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది.
త్రిముఖ పోటీ షురూ
పూర్ణియా లోక్సభ స్థానంలో ఎన్డీయే తరఫున జేడీ(యు) అభ్యర్థిగా సిటింగ్ ఎంపీ సంతోష్ కుమార్ కుశ్వాహా పోటీ చేస్తున్నారు. 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో విజయం సాధించిన ఆయన మళ్లీ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు.
జేడీ(యు)ను వీడి గత నెలలో ఆర్జేడీలో చేరిన బీమా భారతి...విపక్ష ఇండియా కూటమి అభ్యర్థినిగా టికెట్ దక్కించుకున్నారు. ఆమె అయిదుసార్లు బిహార్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
ఇక, వీరిద్దరినీ స్వతంత్ర అభ్యర్థిగా ఎదుర్కొంటున్న పప్పూయాదవ్ గత నెలలో తన నేతృత్వంలోని ‘జన్ అధికారి పార్టీ’ని కాంగ్రెస్లో విలీనం చేశారు. తనకు పూర్ణియా టికెట్ వస్తుందని ఆశించారు. ఇండియా కూటమి సర్దుబాటులో పూర్ణియా సీటు ఆర్జేడీకి వెళ్లిడంతో భంగపడిన పప్పూయాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. పోటీ నుంచి తప్పుకోవాలని కాంగ్రెస్ నేతలు సూచించినా ససేమిరా అన్నారు.
ఇదీ పప్పూయాదవ్ గతం..
హత్య, హత్యాయత్నం, బెదిరింపులు తదితర 32కు పైగా కేసులున్న పప్పూ యాదవ్ గతంలోనూ స్వతంత్ర అభ్యర్థిగా, సమాజ్వాదీ పార్టీ, లోక్జనతా పార్టీ, ఆర్జేడీ తరఫున మొత్తం అయిదు సార్లు (పూర్ణియా నుంచి 1991, 1996, 1999; మాధేపుర నుంచి 2004, 2014) లోక్సభకు ఎన్నికయ్యారు. 2015లో ఆర్జేడీ నుంచి బహిష్కరణకు గురైన తర్వాత ‘జన్ అధికారి పార్టీ’ని స్థాపించారు.
ఓటరు నాడి ఏమిటో?
పప్పూయాదవ్కు నేర నేపథ్యం ఉన్నప్పటికీ వివిధ వర్గాల సామాన్య ప్రజల్లోకి చొరవగా వెళ్తూ మద్దతు కూడగట్టే యత్నం చేస్తున్నారు. జేడీ(యు) అభ్యర్థి సంతోష్కుమార్...రెండు దఫాలుగా ఎంపీగా ఉండడం, రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వంపై వ్యతిరేకత ఆయనకు ప్రతికూలం కావచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా. మిత్రపక్ష భాజపా ఓట్లు సంతోష్కుమార్కు బదిలీకాకపోవచ్చని భావిస్తున్నారు. ఆర్జేడీ అభ్యర్థినిగా ఉన్న బీమా భారతి జేడీ(యు) ఓట్లను చీల్చే అవకాశం ఉంది. ఆమె కూడా ప్రస్తుత ఎన్నికలకు కొద్ది రోజుల ముందే ఆర్జేడీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వెంటనే టికెట్ పొందడంతో ఆర్జేడీ శ్రేణుల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. బీమా భారతి విజయం కోసం ఆ పార్టీ అగ్రనేత తేజస్వీ యాదవ్ శ్రమిస్తున్నారు. సాధారణ ప్రజల్లో తనకున్న బలం ముందు ఉన్నత సామాజిక వర్గాల్లో భాజపా, జేడీ(యు)కు ఉన్న పునాదులు, ఇండియా కూటమికి ఉన్న ముస్లిం-యాదవ్ ఓటు బ్యాంకు నిలువలేవని పప్పూయాదవ్ ధీమాగా చెబుతున్నారు. గత ఏడాది కాలంగా పప్పూయాదవ్ ‘ప్రణామ్ పూర్ణియా’ పేరుతో ప్రజల మధ్య ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకుండా అవమానించిందంటూ సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు.
ఈనాడు ప్రత్యేక విభాగం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు