శివమొగ్గలో కమలానికి తలపోటు!
కర్ణాటకలోని శివమొగ్గ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు భాజపాకు తలనొప్పిగా మారాయి. హిందుత్వ నాయకుడిగా పేరున్న భాజపా సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
స్వతంత్ర అభ్యర్థిగా ఈశ్వరప్ప నామినేషన్
యడియూరప్పపై కోపంతోనే..
ఈనాడు, బెంగళూరు: కర్ణాటకలోని శివమొగ్గ నియోజకవర్గంలో ప్రస్తుత పరిస్థితులు భాజపాకు తలనొప్పిగా మారాయి. హిందుత్వ నాయకుడిగా పేరున్న భాజపా సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన కుమారుడు కేఎస్ కాంతేశ్కు పార్టీ టికెట్ దక్కకపోవడంతో నిరాశకు గురై ఈ చర్యకు పూనుకున్నారు. ఎన్నికల సమయంలో పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద సహజమే అయినా.. శివమొగ్గ కథ కొంత భిన్నం. ఇక్కడ భాజపా తరఫున బరిలో ఉన్నది మాజీ సీఎం, భాజపా పార్లమెంటరీ బోర్డు సభ్యుడు యడియూరప్ప పెద్ద కుమారుడు బి.వై.రాఘవేంద్ర. ఆయన భాజపా సిద్ధాంతాలు, ప్రధాని మోదీ నాయకత్వం, హిందుత్వం పేరిట ప్రచారం చేస్తుండగా.. ఈశ్వరప్ప కూడా సరిగ్గా అవే అంశాలను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. తాను భాజపాకు, మోదీకి, హిందుత్వవాదానికి వ్యతిరేకిని కాదని స్పష్టం చేస్తున్నారు. భాజపా రాష్ట్ర శాఖలోని కుటుంబ రాజకీయాలు, ఏకవ్యక్తి నిర్ణయాలకు వ్యతిరేకంగానే ఎన్నికల బరిలో దిగినట్లు చెబుతున్నారు.
ఒకప్పుడు రామలక్ష్మణుల్లా..
ఈశ్వరప్ప కోపమంతా యడియూరప్ప (అప్ప)పైనే. ఈ ఇద్దరు నేతలూ ఒకేసారి రాజకీయ రంగప్రవేశం చేశారు. తొలినాళ్లలో వారు మంచి మిత్రులు. కర్ణాటక భాజపాలో వీరిద్దరినీ రామలక్ష్మణులుగా పిలిచేవారు. అయితే యడియూరప్ప రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదగగా, ఈశ్వరప్ప ఎక్కువగా జిల్లాకే పరిమితమయ్యారు. ఈశ్వరప్ప అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్సీ పదవిని చేపట్టారు. ఉపముఖ్యమంత్రి స్థాయి దాకా కూడా ఎదిగారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగానూ పనిచేశారు. యడియూరప్పతో విభేదాలున్నా పార్టీపై విధేయత కారణంగా ఈశ్వరప్ప ఏనాడూ నోరు మెదపలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం తన కుమారుడు కాంతేశ్కు టికెట్ రాకపోవడానికి కారణం యడియూరప్పేనని ఈశ్వరప్ప బహిరంగంగా విమర్శలకు దిగారు.
పార్టీ ప్రక్షాళన కోసమే అంటూ..
వారసత్వ రాజకీయాలకు దూరంగా ఉండే భాజపా.. కర్ణాటకలో మాత్రం ఆ సిద్ధాంతానికి తిలోదకాలిచ్చిందని ఈశ్వరప్ప ఆరోపిస్తున్నారు. యడియూరప్ప కుమారుల్లో ఒకరు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మరో కుమారుడు రెండోసారి ఎంపీ టికెట్ పొందారు. స్థానికంగా వ్యతిరేకత ఉన్నా.. అప్ప సన్నిహితురాలుగా పేరున్న శోభా కరంద్లాజెను ఉడుపి-చిక్కమగళూరు నుంచి బెంగళూరు ఉత్తర స్థానానికి మార్చి మరీ టికెట్ ఇప్పించారు. ఇదంతా చేయగలిగిన యడియూరప్ప తన కుమారుడి విషయం వచ్చేసరికి మాత్రం వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారనేది ఈశ్వరప్ప కోపం. రాష్ట్రంలో భాజపా అప్ప కుటుంబం చేతిలో బందీగా మారిందని ఆయన ఆరోపిస్తున్నారు. పార్టీని ప్రక్షాళించేందుకే తాను స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. ఆయన ఆవేదన పూర్తిగా వ్యక్తిగతమైనదైతే భాజపా పెద్దగా ఆందోళన చెందాల్సిన పని ఉండేది కాదు. కానీ యడియూరప్పతో విభేదించిన మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా, బెంగళూరు ఉత్తర ఎంపీ డి.వి.సదానందగౌడ, ఉడుపి చిక్కమగళూరు టికెట్ ఆశావహుడు సి.టి.రవి, విజయపురలో బసవనగౌడ యత్నాళ్ తదితరులకు కూడా టికెట్ రాలేదు. ఈశ్వరప్ప తిరుగుబాటుతో ఈ ప్రాంతాల నుంచి భాజపాకు వ్యతిరేకత ఎదురవుతుందన్న ఆందోళన కమలనాథుల్లో వ్యక్తమవుతోంది.
ఎట్టకేలకు వేటు
తాము చేయలేనిది ఈశ్వరప్ప చేస్తున్నారన్న అభిప్రాయం పార్టీలోని పలువురు సీనియర్లలో వ్యక్తమవుతోంది. ఆయన రాష్ట్రంలో మూడో అతిపెద్ద వర్గమైన కురుబ సామాజిక వర్గానికి చెందినవారు. ఆ వర్గం సంఘాల నుంచీ ఆయన అసమ్మతికి మద్దతు లభిస్తోంది. ఈ పరిస్థితుల్లో తిరుగుబావుటా ఎగురవేసిన ఈశ్వరప్పను భాజపా అధినాయకత్వం పార్టీ నుంచి బహిష్కరించడం గమనార్హం. మరోవైపు మోదీ, పార్టీ పేరుతో ప్రచారం చేయడాన్ని సవాలు చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!