తల్లికి వ్యతిరేకంగా తనయుడి ప్రచారం
దేశంలోని ప్రఖ్యాత సంస్థానాల్లో గ్వాలియర్ ఒకటి. దాన్ని పాలించిన సింధియా రాజవంశానికి చెందిన రాజమాత విజయరాజె సింధియా 1989 లోక్సభ ఎన్నికల్లో అనూహ్య పరిస్థితులను ఎదుర్కొన్నారు.
1989 ఎన్నికల్లో గ్వాలియర్లో కాక పుట్టించిన సింధియాల సమరం
దిల్లీ: దేశంలోని ప్రఖ్యాత సంస్థానాల్లో గ్వాలియర్ ఒకటి. దాన్ని పాలించిన సింధియా రాజవంశానికి చెందిన రాజమాత విజయరాజె సింధియా 1989 లోక్సభ ఎన్నికల్లో అనూహ్య పరిస్థితులను ఎదుర్కొన్నారు. నాడు మధ్యప్రదేశ్లోని గుణ స్థానంలో బరిలో దిగిన ఆమెకు వ్యతిరేకంగా.. స్వయంగా ఆమె ఏకైక కుమారుడు మాధవరావ్ సింధియా ప్రచారం చేశారు. తన తల్లికి ఓటేయొద్దని పిలుపునిచ్చారు. ఆసక్తికరమైన ఈ విషయాన్ని భాస్కర్ రాయ్ అనే పాత్రికేయుడు-రచయిత ‘ఫిఫ్టీ ఇయర్ రోడ్’ అనే తన తాజా పుస్తకంలో వివరించారు. అందులోని కథనం ప్రకారం- తన కుమారుణ్ని జనసంఘ్ భవిష్యత్ నేతగా తీర్చిదిద్దాలని రాజమాత తొలుత కలలుగన్నారు. భాజపా ఆవిర్భవించాక.. ఆ పార్టీ నాయకుడిగా చూడాలని కోరుకున్నారు. అందుకు విరుద్ధంగా తన రాజకీయ జీవితం ఆరంభంలోనే మాధవరావ్ సింధియా కాంగ్రెస్లో చేరారు. ఇది రాజమాతకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. దీనికితోడు ఆస్తుల విషయంలోనూ తల్లీకుమారుల మధ్య విభేదాలు తలెత్తాయి. తన తల్లి భాజపా చేతుల్లో కీలుబొమ్మగా మారిందని మాధవరావ్ భావించేవారు. అందుకే 1989లో గుణలో విజయరాజే పోటీ చేసినప్పుడు ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. రాజమాత కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా.. ప్రచారంలో తన కుమారుడిపై బాగానే విమర్శలు చేశారు. నాటి ఎన్నికల్లో విజయం చివరికి ఆమెనే వరించింది.
ఓటర్లను రూపాయి చొప్పున కోరిన కాన్షీరాం
1988లో అలహాబాద్ స్థానానికి ఉప ఎన్నిక జరిగినప్పటి మరో ఆసక్తికర విషయాన్నీ తాజా పుస్తకంలో రచయిత వివరించారు. నాడు అక్కడ కాన్షీరాంతోపాటు బలమైన అభ్యర్థులైన వీపీ సింగ్, సునీల్ శాస్త్రి బరిలో నిలిచారు. అప్పుడు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించిన కాన్షీరాం.. తనకు ఒక రూపాయి చొప్పున ఇవ్వాలని తన మద్దతుదారులను కోరారు. ‘‘పెద్ద రాజకీయ పార్టీలు ఓట్లను రాబట్టుకునేందుకు నగదు, మద్యం పంచుతుంటాయి. అందుకు భిన్నంగా అలహాబాద్లో నాకు మద్దతు తెలిపేవారంతా ఒక రూపాయి నోటు చొప్పున ఇవ్వాలని నేను ఓటర్లను కోరారు. ఒక ఓటు- ఒక నోటు అని నినాదమిచ్చాను’’ అని కాన్షీరాం చెప్పినట్లు పుస్తకంలో రచయిత వివరించారు. నాటి ఎన్నికల్లో కాన్షీరాం మూడో స్థానానికి పరిమితమయ్యారు.
జనంలో నానిన ఎన్టీఆర్ నినాదం
ఎన్టీ రామారావు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక శక్తులను ఏకం చేయడానికి ప్రయత్నించడం ద్వారా రాజీవ్గాంధీకి గట్టి పోటీదారుగా మారిన తీరునూ రచయిత తాజా పుస్తకంలో వివరించారు. హిందీ, ఆంగ్ల భాషల్లో ధారాళంగా మాట్లాడలేకపోయినప్పటికీ.. తన హావభావాలతో ఆయన ఉత్తర భారత ప్రజలనూ ఆకట్టుకునేవారని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్ను పీకిపారేయండి’ అంటూ ఓ సభలో ఎన్టీఆర్ ఇచ్చిన నినాదం జనంలోకి బాగా వెళ్లిందని తెలిపారు. 1960ల మధ్య నుంచి భారత రాజకీయాల్లో, ఎన్నికల్లో చోటుచేసుకున్న పలు కీలక పరిణామాలను ‘ఫిఫ్టీ ఇయర్ రోడ్’లో భాస్కర్ రాయ్ వివరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్