కాంగ్రెస్ గెలిచేదెన్ని?
భాజపాను గద్దె దించి ఈ దఫా దేశ పాలనా పగ్గాలు దక్కించుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఇండియా కూటమిని ఏర్పాటుచేసింది.
దక్షిణాదిలో మెరుగ్గా పార్టీ పరిస్థితి
కర్ణాటక, తెలంగాణలపై ఆశలు
ఈనాడు, దిల్లీ: భాజపాను గద్దె దించి ఈ దఫా దేశ పాలనా పగ్గాలు దక్కించుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఇండియా కూటమిని ఏర్పాటుచేసింది. మిత్రపక్షాలు బలంగా ఉన్నచోట్ల వాటికి సీట్లు త్యాగం చేసి.. చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువగా ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 330 స్థానాల్లో హస్తం పార్టీ పోటీ చేస్తోంది. అయితే వాటిలో ఎన్నింట విజయభేరి మోగించగలదన్నది ప్రస్తుతం ఆసక్తికర ప్రశ్నగా మారింది.
71% సీట్లు 5 రాష్ట్రాల్లోనే..
2014లో చరిత్రలో అత్యల్పంగా 44 సీˆట్లకు పడిపోయిన కాంగ్రెస్ 2019 నాటికి కొంత మెరుగుపడి 52 స్థానాలు గెలుచుకుంది. అయిదేళ్ల కిందట దానికి దక్కిన నియోజకవర్గాలు 18 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. మొత్తం 52 సీట్లలో 71% సీˆట్లు కేరళ, తమిళనాడు, పంజాబ్, తెలంగాణ, అస్సాంల్లో రాగా.. మిగిలిన వాటిలో కలిపి 29% దక్కాయి.
20 మంది అభ్యర్థుల మార్పు
2019లో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎంపీల్లో ముగ్గురు పార్టీ మారారు. మరో ముగ్గురు అసెంబ్లీలకు ఎన్నికై ఇప్పుడు పోటీకి దూరంగా ఉన్నారు. ఒకరు మరణించారు. ఇంకా ఇతర కారణాలతో కాంగ్రెస్ మొత్తంగా ఈసారి 20 మంది అభ్యర్థులను మార్చింది. ముగ్గురికి స్థానచలనం కల్పించింది. గత ఎన్నికల్లో కేరళ, తమిళనాడు, పంజాబ్, అస్సాంలలో కలిపి హస్తం పార్టీ 34 స్థానాలు దక్కించుకుంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం 51 సీట్లలో పోటీ చేస్తోంది. కర్ణాటక (28), ఒడిశా (21), తెలంగాణ (17), ఉత్తర్ప్రదేశ్ (17), ఛత్తీస్గఢ్ (11), మహారాష్ట్ర (15), పశ్చిమబెంగాల్ (14), బిహార్ (9), ఝార్ఖండ్ (7)ల్లో 139 స్థానాల్లో బరిలో ఉంది. ఈ 9 రాష్ట్రాల్లో కలిపి 2019లో పార్టీ కేవలం 13 సీˆట్లు దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, హరియాణా, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్ల్లో కలిపి 93 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తోంది. ఈ రాష్ట్రాల్లో అయిదేళ్ల కిందట పార్టీకి ఒక్క సీటూ రాలేదు.
కర్ణాటక, తెలంగాణలపై ఆశలు
2019 తరహాలోనే కేరళ, తమిళనాడుల్లో కాంగ్రెస్ ఇప్పుడూ బలంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కర్ణాటక, తెలంగాణల్లో కచ్చితంగా సీట్లు పెరుగుతాయని భావిస్తున్నారు. అస్సాంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని అంటున్నారు. పంజాబ్లో చతుర్ముఖ పోటీ కారణంగా గతంకంటే సీˆట్లు తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు వెలువడుతున్నాయి. రాజస్థాన్, హరియాణాల్లో ఈసారి బోణీ కొట్టడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, ఒడిశాల్లో మాత్రం ఇప్పుడూ పరిస్థితి ఆశాజనకంగా లేదంటున్నారు. మిత్రపక్షాలతో కలిసి పోటీచేస్తున్న ఉత్తర్ప్రదేశ్, బిహార్లలో పార్టీ ఎంతమేరకు ప్రభావం చూపుతుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తంగా దేశవ్యాప్త పరిస్థితులను బట్టి చూస్తే కాంగ్రెస్ పరిస్థితి దక్షిణాదిలో కొంత మెరుగ్గా, ఉత్తరాదిలో దాదాపుగా 2019 మాదిరిగానే కనిపిస్తోంది.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన 52 సీˆట్లలో 19 చోట్ల 50 వేలలోపు మెజార్టీతోనే బయటపడింది. అందులోనూ 5 నియోజకవర్గాల్లో ఆధిక్యం 10 వేల కంటే తక్కువే.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన
-
పార్లమెంటు భద్రత.. రంగంలోకి 3300 మంది ‘సీఐఎస్ఎఫ్’ సిబ్బంది
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రాయ్బరేలీలో రాహుల్ పోటీ.. సోనియాపై ప్రధాని విమర్శలు
-
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
-
ఆర్సీబీ ఇంపాక్ట్ ప్లేయర్గా క్రిస్గేల్: జెర్సీ ఇంకా ఫిట్గానే ఉందన్న యూనివర్స్ బాస్