Harish Rao: అమరుల వీరుల స్తూపం వద్దకు వచ్చా.. రేవంత్ కూడా చిత్తశుద్ధి నిరూపించుకోవాలి: హరీశ్రావు
హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ మోసగించిందని మాజీ మంత్రి, భారాస నేత హరీశ్రావు విమర్శించారు.
హైదరాబాద్: హామీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించిందని మాజీ మంత్రి, భారాస నేత హరీశ్రావు విమర్శించారు. తన రాజీనామా పత్రాన్ని గన్పార్క్లోని అమర వీరుల స్తూపం వద్ద మేధావులకు ఇచ్చి మాట్లాడారు. బాండు పేపర్లు, సోనియా గాంధీ పేరిట లేఖ ఇచ్చి సీఎం మాట తప్పారన్నారు. బాండ్లకు కాలం చెల్లిందని.. ఇప్పుడు దేవుడిపై ప్రమాణాలు చేస్తున్నారని తెలిపారు.
‘‘నా ఎమ్మెల్యే పదవి కంటే ప్రజలకు మేలు జరగడమే ముఖ్యం. ఆగస్టు 15 లోపు రుణమాఫీ, 6 గ్యారంటీలు అమలు చేయాలి. ఆరులో ఐదు గ్యారంటీలు అమలు చేశామని చెప్పడం బోగస్. సీఎం రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరించి గన్పార్కు వద్దకు వచ్చాను. ప్రజలకు ఇచ్చిన హామీలు నిజమైతే ఆయన ఇక్కడికి రావాలి. మేధావుల చేతిలో నా రాజీనామా పత్రాన్ని పెడుతున్నా. ఆగస్టు 15 లోపు కాంగ్రెస్ ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, ఆరుగ్యారంటీలు అమలు చేస్తే నా రాజీనామా పత్రాన్ని స్పీకర్కు ఇవ్వండి. ఉప ఎన్నికలో కూడా పోటీ చేయను. ఒకవేళ వీటిని అమలు చేయలేకపోతే తన రాజీనామాను గవర్నర్కు ఇవ్వడానికి సీఎం రేవంత్రెడ్డి సిద్ధమా? అమరుల స్తూపం వద్దకు రావడానికి ఆయన ఎందుకు వెనుకాడుతున్నారు. ఆయన రాష్ట్ర ప్రజలను మరోసారి మోసం చేస్తున్నట్లే. రాజకీయాల కంటే పేదల ప్రయోజనాలే మాకు ముఖ్యం. వృద్ధులకు రూ.4 వేల పింఛన్ రావాలి. రైతులకు రూ.15 వేల రైతుబంధు, రూ.2 లక్షల రుణమాఫీ, వరికి రూ.500 బోనస్, మహిళలకు రూ.2,500 అందించాలి. డిసెంబర్ 9న తొలి సంతకం ఆరు గ్యారంటీలు, రుణమాఫీపై పెడతామని చెప్పినందుకు సీఎం రేవంత్రెడ్డి క్షమాపణలు చెప్పాలి’’ అని హరీశ్రావు డిమాండ్ చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘నేను పిడికిలి బిగించగానే మళ్లీ రైతుబంధు పడుతోంది’: కేసీఆర్
మోదీ పాలనలో తెలంగాణకు ఏదైనా మేలు జరిగిందా? అని భారాస అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. -
బలహీన వర్గాల కోసం ఈటల ఏం చేశారు: సీఎం రేవంత్రెడ్డి
గతంలో మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ బలహీనవర్గాల కోసం ఏమైనా చేశారా? అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నించారు. -
పోలింగ్ కేంద్రాలకు ‘ర్యాపిడో’ ఫ్రీ రైడ్.. హైదరాబాద్ సహా నాలుగు నగరాల్లో!
మే 13 పోలింగ్ రోజున.. ఓటర్లను ఉచితంగా పోలింగ్ కేంద్రాలకు తరలిస్తామని రైడ్ షేరింగ్ యాప్ ‘ర్యాపిడో’ ప్రకటించింది. -
రెండు పడక గదుల ఇళ్ల పేరుతో కేసీఆర్ మోసగించారు: జేపీ నడ్డా
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ నంబర్ వన్ అవుతోందని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. -
పెట్రోల్, డీజిల్పై పన్నులు వేస్తే హైవేలపై టోల్ ఛార్జీలు ఎందుకు?: కేటీఆర్
పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం పేదల రక్తం పీల్చి రూ.కోట్లు వసూలు చేసిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
రిజర్వేషన్లు రద్దు కావు
కేంద్రంలో భాజపా అధికారంలో ఉన్నంతకాలం దేశంలో రిజర్వేషన్లు రద్దు కావని కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటించారు. భాజపా మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం చేస్తోందన్నారు. -
పాతవి లేవు.. కొత్త పథకాలు రావు
‘తెలంగాణ ఉద్యమం అయిపోలేదు.. రాష్ట్ర పునర్నిర్మాణ ప్రక్రియ ఇంకా ఉంది. నాలుగైదు నెలల్లోనే ఈ సర్కారు ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంది. -
భాజపా గెలిస్తే రిజర్వేషన్ల రద్దు
ఎన్నికల్లో భాజపా గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందని.. రిజర్వేషన్లను రద్దు చేస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆరోపించారు. భాజపా నేతలు ప్రజలతో నేరుగానే ఈ విషయాన్ని చెబుతున్నారని గుర్తు చేశారు. -
మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే
‘‘రైతు భరోసా డబ్బులు పడలేదని కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చెబుతున్నారు. ఈనెల 9వ తేదీలోగా రాష్ట్రంలోని రైతులందరికీ రైతు భరోసా డబ్బులు ఇచ్చే బాధ్యత మా ఇందిరమ్మ ప్రభుత్వానిది. -
ప్రజలను కార్పొరేట్లకు అప్పగించడమే భాజపా లక్ష్యం
‘‘లోక్సభ ఎన్నికల్లో 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేసి, రిజర్వేషన్లు తొలగించి ప్రజలందరినీ కార్పొరేట్లకు అప్పగించడమే భాజపా లక్ష్యం. అందుకే ఓట్ల కోసం, సీట్ల కోసం రామజపం చేస్తోంది. -
పోస్టల్ బ్యాలెట్ ద్వారా 32,331 మంది ఓటు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సందర్భంగా పోస్టల్బ్యాలెట్ ద్వారా శనివారం రాత్రివరకు 32,331 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
రిజర్వేషన్లు విస్తరించిందే భాజపా: లక్ష్మణ్
‘‘ఈ ఎన్నికలు వార్డుకో, మున్సిపాలిటీకో జరుగుతున్నవి కాదు.. దేశం కోసం జరుగుతున్నవి. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. ప్రజలు ఆచితూచి ఓటేయాలి’’ అని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. -
26 నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి
పోలింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు మార్గదర్శకాలు జారీ చేసింది. -
ఎన్నికల తర్వాత రేవంత్ భాజపాలోకి..
లోక్సభ ఎన్నికలు పూర్తికాగానే, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ను వీడి భాజపాలో చేరడం ఖాయమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. -
పాత, కొత్త నాయకుల సమన్వయంపై దృష్టి పెట్టాలి
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో స్థానికంగా పాత, కొత్త నాయకులను సమన్వయం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని పీసీసీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సూచించింది. -
దిల్లీ పోలీసుల పేరుతో వేధింపులు
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా వీడియోను మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో దిల్లీ పోలీసుల పేరుతో కొన్ని అసాంఘిక శక్తులు తమ పార్టీ ఐటీ సెల్ ఉద్యోగులను వేధిస్తున్నాయని తెలంగాణ ఫిషర్మెన్ కాంగ్రెస్ కమిటీ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ ఆదివారం డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిలకు ఫిర్యాదు చేశారు. -
రాష్ట్రానికి రూ.9 లక్షల కోట్లు ఇస్తే గాడిద గుడ్డు అంటారా?
తెలంగాణలో భాజపా అత్యధిక స్థానాలు సాధించేందుకు, మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఎంతో సానుకూల వాతావరణం ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్కు ఓటేస్తే అబద్ధాలకు ఆమోదం తెలిపినట్లే
‘కాంగ్రెస్ పాలనలో వ్యవసాయానికి కరెంటు 24 గంటల నుంచి 11, 12 గంటలకు పడిపోయింది. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవానికి వెళ్లే ఆడబిడ్డలకు కిట్లు నిలిచిపోయాయి. -
రండి.. ఓటేయగ తరలిరండి!
హైదరాబాద్ నగరంలో స్థిరపడిన ఏపీ ఓటర్లను పోలింగ్ నాటికి ఎలాగైనా సొంత గ్రామాలకు తరలించే పనిలో అక్కడి అభ్యర్థులు, నేతల అనుచరులు నిమగ్నమయ్యారు. -
భాజపాకు ఓటేస్తే రిజర్వేషన్లు కోల్పోతాం
లోక్సభ ఎన్నికల్లో భాజపాకు ఓటేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు కోల్పోతామని భారాస నాగర్కర్నూల్ అభ్యర్థి ఆర్.ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. -
ఓట్లు దండుకునేందుకు కేసీఆర్ డ్రామాలు: బండి సంజయ్
భారాస అధినేత కేసీఆర్ మళ్లీ డ్రామాలాడి ఓట్లు దండుకునేందుకు ప్రజల ముందుకు వస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు.
తాజా వార్తలు
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..