icon icon icon
icon icon icon

Amit Shah: తెలంగాణలో కనీసం 12 సీట్లలో గెలిపించండి: అమిత్‌ షా

మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు

Published : 25 Apr 2024 14:59 IST

సిద్దిపేట: మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా పిలుపునిచ్చారు. 400కు పైగా స్థానాల్లో భాజపాని గెలిపించాలని కోరారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మెదక్‌ భాజపా అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు. సిద్దిపేటలో ఏర్పాటు చేసిన  ‘భాజపా విశాల జన సభ’లో ప్రసంగించారు. తెలంగాణలో కనీసం 12 స్థానాల్లో భాజపాను గెలిపించాలని ఓటర్లను కోరారు.

‘‘అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి మోదీ కృషి చేశారు. కశ్మీర్‌ను భారత్‌లో శాశ్వతంగా అంతర్భాగం చేయాలన్న పట్టుదలతో ముందుకెళ్తున్నారు. మోదీని మూడోసారి ప్రధానిని చేస్తే అవినీతి అంతానికి కృషి చేస్తాం. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాల్సి ఉంది. మజ్లిస్‌కు భయపడటం వల్లే భారాస, కాంగ్రెస్‌ నిర్వహించడం లేదు. భాజపా అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కచ్చితంగా నిర్వహిస్తాం’’ అని అమిత్‌షా అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img