JP Nadda: భారాస హయాంలో అన్ని రంగాల్లోనూ అవినీతే: జేపీ నడ్డా
దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ భాజపాయేనని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు.
కొత్తగూడెం: దేశాభివృద్ధి కోసం ఆలోచించే ఏకైక పార్టీ.. భాజపాయేనని ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మోదీ నేతృత్వంలో బలమైన ప్రభుత్వాన్ని తిరిగి మళ్లీ ఏర్పాటు చేస్తామని, ఎంపీ అభ్యర్థులు సీతారాం నాయక్, వినోద్రావు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కొత్తగూడెంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
‘‘అయోధ్యలో వందల ఏళ్ల రామమందిరం కలను మోదీ సాకారం చేశారు. మా ప్రభుత్వం ఎంతో ధైర్యంగా ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఎస్టీల అభివృద్ధి కోసం ఎంతో చేసింది. ఇప్పటికే గిరిజనుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. మా పాలనలో 25 కోట్లమంది పేదరికం నుంచి బయటపడ్డారు. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ ఇస్తున్నాం. మరో ఐదేళ్లు కొనసాగిస్తాం. 4 కోట్ల మందికి ఇళ్లు కట్టించి ఇచ్చాం. మరో 3 కోట్ల ఇళ్లు కట్టిస్తాం. ఆయుష్మాన్ భారత్ ద్వారా 70 ఏళ్లు పైబడిన వారికీ చికిత్స లభిస్తుంది. భవిష్యత్తులో పైపులైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా చేస్తాం. మోదీ ఎప్పుడూ పేదలు, రైతులు, మహిళల గురించే ఆలోచిస్తారు.
భారాస ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలింది
కేంద్రం పదేళ్లుగా తెలంగాణకు అన్ని రకాలుగా సాయం చేసింది. తెలంగాణకు ఇచ్చే పన్నుల వాటా 3 రెట్లు పెరిగింది. కానీ, భారాస ప్రభుత్వంలో అన్ని రంగాల్లో అవినీతి రాజ్యమేలింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన కూడా చూస్తున్నాం. ఇండియా కూటమిని ఆయా పార్టీల వారసుల కోసమే ఏర్పాటు చేశారు. కూటమిలోని నేతలంతా కుంభకోణాలకు పాల్పడ్డారు. కేసీఆర్ కుమార్తె కవిత దిల్లీ మద్యం కేసు కుంభకోణంలో జైలులో ఉన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎక్కడ చూసినా అనేక కుంభకోణాలు, అవినీతే. వారి ప్రభుత్వంలో సంఘవ్యతిరేక శక్తులన్నీ విజృంభిస్తాయి’’అని నడ్డా అన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మీరు చెప్పే ప్రేమను పంచడం అంటే ఇదేనా రాహుల్ జీ?: కేటీఆర్
నాగర్కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో తమ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేశారని.. దీన్ని ఖండిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. -
రుణమాఫీ చేయకుంటే కాంగ్రెస్లో ‘ఆగస్టు సంక్షోభం’!
లోక్సభ ఎన్నికల్లో భారాస ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేదని, ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. -
కరీంనగర్ ఫలితాలతో భారాస, కాంగ్రెస్లకు షాక్: బండి సంజయ్
కరీంనగర్ లోక్సభ ఫలితాలు కాంగ్రెస్, భారాసలకు షాక్ ఇవ్వబోతున్నాయని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
భాజపాకు 12 స్థానాలు ఖాయం: ఈటల
తెలంగాణలో భాజపా శక్తిమంతంగా ఉందని, జూన్ 4న సర్వే సంస్థలకు అందని ఫలితాలు ఉంటాయని ఆ పార్టీ మల్కాజిగిరి లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. -
భారాసను కేసీఆర్ కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేస్తారు?
భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో భారాస విలీనమవుతుందని భాజపా నేత కె.లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన రాజకీయ అవగాహనారాహిత్యానికి నిదర్శనమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
సీఎంను కలిసిన లోక్సభ అభ్యర్థులు
లోక్సభ అభ్యర్థులు చామల కిరణ్కుమార్రెడ్డి, వంశీచంద్రెడ్డి, నీలం మధు తదితరులు రేవంత్ను మంగళవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. -
గిరిజనుల చెంతకే పోలింగ్ కేంద్రం
చెంచుపెంటల్లో ఓటింగ్ పెంచేందుకు అధికారులు చేసిన ప్రయత్నం ఫలించింది. నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం లోతట్టు అటవీ ప్రాంతంలో కృష్ణానది తీరంలో ఉన్న గీసగండి చెంచుపెంట గ్రామంలో తొలిసారిగా పోలింగ్ కేంద్రం ఏర్పాటైంది. -
స్ట్రాంగ్ రూంలకు చేరిన ఈవీఎంలు
సాయుధ బలగాల పహారా నడుమ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యం భద్రంగా ఉంది. రాష్ట్రంలోని లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్లకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలను మంగళవారం తెల్లవారుజాము వరకు 44 స్ట్రాంగ్ రూంలలో అధికారులు భద్రపరిచారు. -
నిర్ణయాత్మక శక్తిగా ప్రాంతీయ పార్టీలు
పార్లమెంటు ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలే నిర్ణయాత్మక శక్తిగా మారనున్నాయని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. -
దేశంలో ఇండియా కూటమిదే విజయం
‘కొన్ని పార్టీలు ఆర్థిక, సామాజిక భావజాలాలను పక్కనపెట్టి రాజకీయాలకు సంబంధం లేని అంశాలను ప్రజల్లోకి జొప్పించి లబ్ధి పొందే ప్రయత్నం చేశాయి.. అయినా, కాంగ్రెస్ మాత్రమే ప్రజాస్వామ్యం కోసం పోరాటాలు చేస్తూ తమ పక్షాన నిలబడుతుందని ప్రజలు గుర్తించారు. -
తెలంగాణలో 65.67% పోలింగ్
తెలంగాణలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో 65.67% పోలింగ్ నమోదైంది. ఇది 2019 లోక్సభ ఎన్నికల(62.72%)తో పోలిస్తే 2.95% ఎక్కువ. -
9-13 స్థానాలు గెలుస్తాం
రాష్ట్రంలో రాజకీయాలు, ఆరోపణల పర్వం ముగిసిందని బుధవారం నుంచి పూర్తిగా వంద శాతం పరిపాలనపైనే దృష్టి సారిస్తామని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. -
తెలంగాణలో 65.67శాతం పోలింగ్ : సీఈవో వికాస్రాజ్
తెలంగాణలో లోక్సభ ఎన్నికల తుది పోలింగ్ శాతం వివరాలను రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ వెల్లడించారు. -
రాష్ట్రంలో 9 నుంచి 13 ఎంపీ స్థానాలు గెలుస్తాం: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 9 నుంచి 13 ఎంపీ స్థానాలు గెలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
రెండు జాతీయ పార్టీలకు భారాస ముచ్చెమటలు పట్టించింది : కేటీఆర్
లోక్సభ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు భారాసకు మద్దతుగా నిలిచారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
భారాస, కాంగ్రెస్ విలీనం ఖాయం: భాజపా ఎంపీ లక్ష్మణ్
తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తుందని భాజపా ఎంపీ లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు. -
తెలంగాణలో 12 స్థానాలు భాజపాకే: మాజీ మంత్రి డీకే అరుణ
లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపించాలని ప్రజలు ముందే నిర్ణయానికి వచ్చారని మహబూబ్నగర్ లోక్సభ భాజపా అభ్యర్థి, మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. -
ఈవీఎంలో కారు గుర్తు కొట్టివేత.. గద్వాల జిల్లా పైపాడులో వివాదం
గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడులోని పోలింగ్ బూత్ నంబరు 167లో ఈవీఎంలో కారు గుర్తు కనిపించకుండా మార్కర్తో రుద్దడంతో వివాదం నెలకొంది. -
హైదరాబాద్ లోక్సభ భాజపా అభ్యర్థి మాధవీలతపై కేసు
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ హైదరాబాద్ భాజపా అభ్యర్థి మాధవీలతపై మలక్పేట పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. -
తెలంగాణలో కొత్త శక్తిగా భాజపా.. రెండంకెల లోక్సభ స్థానాల్లో గెలుస్తాం: కిషన్రెడ్డి
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో భాజపా రెండంకెల స్థానాలు సాధించడం ఖాయమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. -
తెలంగాణలో పోలింగ్ 64.93%
రాష్ట్రంలో సోమవారం జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. మొత్తం 64.93 శాతం పోలింగ్ నమోదైంది. ఓటర్లు చూపిన ఉత్సాహంతో 2019 లోక్సభ ఎన్నికలను మించి ఓట్లు పోలయ్యాయి.
తాజా వార్తలు
-
ఆర్సీబీ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లుతాడా? చెన్నైతో మ్యాచ్కు వర్షం ముప్పు
-
ఆ షూటింగ్లో రెండు భుజాలకు ఎన్నో గాయాలయ్యాయి: జాన్వీ కపూర్
-
‘కడుపులో పిండానికీ జీవించే హక్కు’ - సుప్రీంకోర్టు
-
‘మమ్ముట్టి’కి బాసటగా కేరళ నేతలు.. అసలు ఏం జరిగిందంటే?
-
గోల్ఫ్ ఆడడం, నచ్చింది తినడం.. మిస్టర్ కూల్ ‘ఫేవరెట్ ప్లేస్’ అదేనట!
-
డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ జవహర్రెడ్డి అత్యవసర భేటీ