Kishanreddy: గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ గారడీ చేస్తోంది: కిషన్రెడ్డి
భారాస ఎమ్మెల్యేలు పార్టీ మారటం చూసి కేసీఆర్ ఫ్రస్టేషన్లో ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు.
హైదరాబాద్: భారాస ఎమ్మెల్యేలు పార్టీ మారటం చూసి కేసీఆర్ ఫ్రస్టేషన్లో ఉన్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. భారాస ఓడిపోయి 5 నెలలు గడిచినా.. ఓటమిని కేసీఆర్, కేటీఆర్ ఇంకా అంగీకరించడం లేదన్నారు. కుమార్తె లిక్కర్ కేసు, ఫోన్ల ట్యాపింగ్ కేసుల్లో ఆ పార్టీ కూరుకుపోయిందని విమర్శించారు. గెలిచిన ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేని స్థితిలో భారాస ఉందన్నారు.
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ పార్టీ గారడీ చేసి ఓట్లు దండుకుందని, లోక్సభ ఎన్నికల్లో ఓట్ల కోసం రేవంత్రెడ్డి మళ్లీ అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. వందరోజుల్లోనే గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడేమో ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ చేస్తామంటున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల కోడ్ అయిపోగానే రుణమాఫీ చేయకుండా ఆగస్టు 15వరకు ఆగాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ‘‘ఎన్నికల ప్రచారంలో, అన్ని విషయాల్లో భాజపా ముందుంది. ఇప్పటికే ఐదు సభల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించాం’’ అని కిషన్రెడ్డి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అబద్ధాలు చెప్పి మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి: హరీశ్రావు
ఆరు గ్యారంటీల్లో ఒకటే ఇచ్చి.. ఐదు అమలు చేశామని కాంగ్రెస్ నేతలు అబద్ధం చెబుతున్నారని మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. -
సీఎం రేవంత్రెడ్డి నేడు 3 చోట్ల ప్రచారం
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం మూడు చోట్ల పర్యటించనున్నారు. -
ఇంటి వద్దే ఓటు.. ప్రజాస్వామ్యానికి చోటు
లోక్సభ ఎన్నికల్లో దివ్యాంగులు, 85 ఏళ్లు నిండిన వృద్ధులు తమ ఇంటి వద్దనే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. -
ఏపీలో వాలంటీర్ల వాట్సప్ గ్రూపుల్లో వైకాపా ప్రచారం
వైకాపా నాయకుల ఆదేశాల మేరకు వాలంటీర్ల వాట్సప్ గ్రూపుల్లో యథేచ్ఛగా ఎన్నికల ప్రచారం సాగుతోంది. -
కేజ్రీవాల్ అరెస్టుకు ఓటుతో సమాధానం: సునీత
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు ప్రజలంతా ఓటుతో సమాధానమిస్తారని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ చెప్పారు. -
కొండా వినతిపత్రాన్ని పరిశీలించి పరిష్కరించండి
బ్యాలెట్లో మార్పులు చేయాలంటూ చేవెళ్ల నియోజకవర్గ భాజపా ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి గురువారం హైకోర్టు సూచించింది. -
ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేసు నమోదు
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై కేసు నమోదైంది. జమ్మికుంట సీఐ వి.రవి కథనం ప్రకారం.. లోక్సభ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. ఎమ్మెల్యే రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉన్న వీడియోను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారని కరీంనగర్ జిల్లా జమ్మికుంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మొలుగూరు సదయ్య గత నెల 30న ఫిర్యాదు చేశారు. -
భాజపాతో జోడీ కడితే సరి.. లేదంటే ఈడీ
భాజపాతో దోస్తీ కట్టకపోవడం వల్లే ఎమ్మెల్సీ కవితను దిల్లీ మద్యం కేసులో ఇరికించి జైల్లో పెట్టించారని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. -
మోదీ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలి
‘కేంద్రంలోని మోదీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు ప్రమాదం ఏర్పడింది. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది’ అని పలు సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి
ఫోన్ ట్యాపింగ్ కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. -
సంజయ్కి ఓటమి భయం పట్టుకుంది
కరీంనగర్ భాజపా పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్కి ఓటమి భయం పట్టుకుందని.., అందుకే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు ధ్వజమెత్తారు. -
ఎర్రజెండాల స్ఫూర్తితో బడుగుల అభ్యున్నతికి కృషి
ఎర్రజెండాల స్ఫూర్తితోనే తాను రాజకీయాలు ప్రారంభించానని, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్నానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
తెలంగాణకు కాంగ్రెస్ ప్రత్యేక మ్యానిఫెస్టో
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు ప్రత్యేక మ్యానిఫెస్టో విడుదల చేయనుంది. -
పదేళ్లు మోసం చేసిన పార్టీలకు ఓట్లడిగే హక్కు లేదు: మంత్రి ఉత్తమ్
తెలంగాణ ప్రజలను పదేళ్లపాటు మోసం చేసిన పార్టీలకు ప్రస్తుత ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. -
నేటి రాత్రి నుంచి మళ్లీ కేసీఆర్ బస్సు యాత్ర
భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం శుక్రవారం (3వ తేదీ) రాత్రి నుంచి మళ్లీ కొనసాగనుంది. ఆయన ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం విధించిన 48 గంటల నిషేధం నేటి రాత్రి 8 గంటలతో ముగియనుంది. -
దిల్లీ సుల్తాన్లకు భయపడం
‘రిజర్వేషన్ల అమలు అంశంపై నేను మాట్లాడుతుంటే భాజపాకు గిట్టడం లేదు. అందుకే దిల్లీ పోలీసులతో అమిత్షా కేసు పెట్టించారు. భారాస పదేళ్ల పాలనలో కేసీఆర్ ఎన్నో కేసులు పెట్టారు. -
దిల్లీ పోలీసులు X హైదరాబాద్ పోలీసులు
ఉదయాన్నే గాంధీభవన్కు దిల్లీ పోలీసులు.. మరోవైపు హైదరాబాద్ సైబర్క్రైం పోలీసుల అదుపులో కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగం వారియర్లు.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడిన వీడియో మార్ఫింగ్ కేసుకు సంబంధించి గురువారం హైడ్రామా నడిచింది. -
భాజపా కనుసన్నల్లో ఎన్నికల కమిషన్
భాజపా కనుసన్నల్లో ఎన్నికల కమిషన్ పనిచేస్తోందని తాము స్పష్టమైన ఆరోపణ చేస్తున్నామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
8న రాష్ట్రానికి మోదీ
భాజపా అగ్రనేతలు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో విస్తృతంగా పాల్గొననున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్రెడ్డి ప్రకటన విడుదల చేశారు. -
కాంగ్రెస్లోకి మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ
సంగారెడ్డికి చెందిన మాజీ ఎమ్మెల్సీ, భారాస నేత సత్యనారాయణ గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
మోసపోయి కాంగ్రెస్కు ఓటేయొద్దు: భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ గురువారం ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు, డొంకేశ్వర్ మండల కేంద్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
తాజా వార్తలు
-
ఘోరం.. సెల్ఫోన్ టార్చ్లైట్ వెలుగులో ప్రసవం.. తల్లీబిడ్డ మృతి
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
-
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
-
నిర్మాతలే కావాలని రూమర్స్ సృష్టించేవారు.. : సోనాలి బింద్రే
-
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
-
బెంగాల్ గవర్నర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. స్పందించిన రాజ్భవన్