icon icon icon
icon icon icon

Kishanreddy: పట్టణాల్లో పోలింగ్‌ శాతం తగ్గినా భాజపాకే అనుకూలం: కిషన్‌రెడ్డి

ఇవాళ జరిగిన పోలింగ్‌తో తెలంగాణలో భాజపా కొత్తశక్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. 

Published : 13 May 2024 21:10 IST

హైదరాబాద్‌: ఇవాళ జరిగిన పోలింగ్‌తో తెలంగాణలో భాజపా కొత్తశక్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని కేంద్ర మంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. కేంద్ర నాయకత్వం అనేక రకాలుగా తమకు సహకరించిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి నడ్డా నాయకత్వంలో భాజపా సంపూర్ణ సహకారం లభించిందని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవాలను ఏటా అధికారికంగా నిర్వహించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిందన్నారు.

సమ్మక్క, సారక్క యూనివర్సిటీ, పసుపుబోర్డు, టెక్స్‌టైల్‌ పార్క్‌ వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలను మోదీ తెలంగాణకు ఇచ్చారని గుర్తు చేశారు. త్వరలోనే వీటిని మోదీ చేతుల మీదుగా ప్రారంభించబోతున్నామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ కుటిల ప్రయత్నాలను ప్రజలు పట్టించుకోలేదని ఎద్దేవా చేశారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం తగ్గినా భాజపాకి అనుకూలంగా ఉందని భావిస్తున్నట్టు తెలిపారు. ముందుగానే చెప్పినట్టుగా.. ఈ ఎన్నికల్లో భాజపాకి మంచి ఫలితాలు రానున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img