icon icon icon
icon icon icon

Komatireddy Venkat Reddy: భారాస 2 ఎంపీ సీట్లు గెలిచినా మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి

కాంగ్రెస్‌పై విమర్శలు చేసే కేసీఆర్‌.. ఎంపీ ఎన్నికల్లో కనీసం 2 స్థానాల్లోనైనా గెలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Published : 24 Apr 2024 16:07 IST

నల్గొండ: కాంగ్రెస్‌పై విమర్శలు చేసే కేసీఆర్‌.. ఎంపీ ఎన్నికల్లో కనీసం 2 స్థానాల్లోనైనా గెలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. భారాస 2 సీట్లు గెలిచినా తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్‌ చేశారు. నల్గొండ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో ఆయన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాకు తీరని అన్యాయం చేసిన కేసీఆర్‌.. ఏ ముఖం పెట్టుకొని మిర్యాలగూడకు వస్తారని ప్రశ్నించారు. 

నల్గొండలో భాజపా, భారాసకు డిపాజిట్లు కూడా రావని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రానికి, జిల్లాకి ఏమీ చేయని భాజపాకి ఓటు అడిగే హక్కు లేదన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత భారాస మనుగడ ఉండదని, ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదని చెప్పారు. కేసీఆర్‌ నిర్లక్ష్యం వల్లే జిల్లాలో అభివృద్ధి జరగలేదన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉందని సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img