MLC Kavitha: కర్ణాటకలో చక్కదనం లేదుగానీ, కామారెడ్డికి వచ్చి మాట్లాడుతున్నారు: కవిత
కర్ణాటకలో కాంగ్రెస్ పాలనా తీరును చూసి అక్కడి ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు.
నిజామాబాద్: కర్ణాటకలో కాంగ్రెస్ పాలనా తీరును చూసి అక్కడి ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, భాజపా నేత ఈటల రాజేందర్ రెండు స్థానాల్లో పోటీ చేయడంపై ఆమె సెటైర్లు వేశారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు రేవంత్, ఈటల తీరు ఉందని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో వారికి వాతలు తప్పితే ఫలితం ఉండదన్నారు. నిజామాబాద్లో గోసంగి సామాజికవర్గం ఆత్మీయ సమ్మేళనంలో కవిత పాల్గొన్నారు. కాంగ్రెస్, భాజపా నేతల తీరుపై మండిపడ్డారు. కర్ణాటకలో చక్కదనం లేదుగానీ అక్కడి సీఎం కామారెడ్డికి వచ్చి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. భారాస పదేళ్ల పాలనలో అభివృద్ధి ఏం జరిగిందో ఆలోచించి.. ప్రజలు ఓటు వేయాలని కవిత కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు
-
హెలికాప్టర్లో తూలి పడిపోయిన మమతా బెనర్జీ
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
-
జైల్లో కేజ్రీవాల్ ఆరోగ్యంగానే..: ఎయిమ్స్ మెడికల్ బోర్డు..!
-
దాదాపు 900 రన్స్ చేశా.. చోటు దక్కకపోతే చాలా బాధపడతా: గిల్
-
ఆలిన్ హెర్బల్ పరిశ్రమలో మళ్లీ వ్యాపించిన మంటలు
-
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి