icon icon icon
icon icon icon

Congress: కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు సీపీఎం నేతలు అంగీకరించారు: సీఎం రేవంత్‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డితో సీపీఎం నేతలు భేటీ అయ్యారు. సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, సీతారాములు, వీరయ్య ఈ భేటీలో పాల్గొన్నారు.

Published : 27 Apr 2024 13:58 IST

హైదరాబాద్‌: సీఎం రేవంత్‌రెడ్డితో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, సీతారాములు, వీరయ్య భేటీ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతివ్వాలని సీపీఎం నేతలను ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. భువనగిరితో పాటు ఇతర స్థానాల్లో మద్దతు కోరినట్లు చెప్పారు. మరికొన్ని రాజకీయ ప్రతిపాదనలు వారి ముందు ఉంచినట్లు తెలిపారు. కాంగ్రెస్‌కు మద్దతిచ్చేందుకు సీపీఎం నేతలు అంగీకరించారన్నారు. దేశంలో ఇండియా కూటమితో కలిసి పని చేయనున్నారని వివరించారు. ఒకట్రెండు విషయాల్లో సీపీఎంతో సందిగ్ధత ఉందని పేర్కొన్నారు. అధిష్ఠానంతో చర్చించి ఆదివారంలోగా ఏకాభిప్రాయానికి వస్తామన్నారు. ఆ పార్టీ సహకారంతో భవిష్యత్తులో ముందుకెళ్తామని చెప్పారు. 

తమ అభ్యర్థులు బరిలో నుంచి తప్పుకోవాలని సీఎం కోరారని తమ్మినేని వీరభద్రం అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడానికి సిద్ధమని తెలిపారు. భాజపా, ఇతర శక్తులను అడ్డుకునేందుకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img