Shivraj Singh Chouhan: 20 ఏళ్ల తర్వాత పోటీ.. దిల్లీలో కీలక పదవిపై కన్ను..!
శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశా లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. గతంలో ఆయన ఇక్కడినుంచి ఐదుసార్లు గెలుపొందారు.
ఇంటర్నెట్ డెస్క్: మధ్యప్రదేశ్కు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన శివరాజ్సింగ్ చౌహాన్ ఈసారి లోక్సభ బరిలోకి దిగారు. 20 ఏళ్ల తర్వాత తన సొంత నియోజకవర్గం విదిశాలో పోటీ చేస్తున్నారు. గతంలో ఇక్కడి నుంచి భాజపా తరపున ఐదుసార్లు ఎన్నికైన ఆయన ప్రచారంలో జోరు పెంచారు. పత్రిఒక్కరినీ పలకరిస్తూ.. ఎంతో ఉత్సాహంగా ముందుకుసాగుతున్నారు.
ఇక్కడి నుంచి గెలిచి దిల్లీలో కీలక బాధ్యతలు చేపట్టాలని శివరాజ్ సింగ్ భావిస్తున్నారు. 2023 నవంబర్లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన నేతృత్వంలో భాజపా ఘన విజయం సాధించినప్పటికీ పార్టీ అధిష్ఠానం.. మోహన్యాదవ్కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించింది. దీంతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా..? అని అడిగితే.. ‘తన కోసం ఏదైనా అడగడం కంటే.. చావే మేలు’ అని అప్పట్లో ఆయన వ్యాఖ్యానించారు. అయితే.. విదిశా స్థానం నుంచి పేరును ప్రకటించేంతవరకూ ఆయన రాజకీయ భవితవ్యం సందిగ్ధంలోనే ఉంది. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా దిల్లీ రాజకీయాలపైనే ఉంది.
గతనెల 24న ప్రధాని మోదీ హర్దాలో ఎన్నికల ప్రచారం నిర్వహించి చౌహాన్ను కొనియాడారు. ‘ఆయనతో కలిసి పని చేయడానికి మరోసారి దిల్లీకి తీసుకెళ్తాను’ అని ప్రధాని కూడా ఆయనకు అభయం ఇచ్చారు. దీంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. ఇక తాజా పరిణామాలపై చౌహాన్ మాట్లాడుతూ.. ‘‘నేనెప్పుడూ దిల్లీకి వెళ్లనని చెప్పలేదు. పార్టీ నాకు ఏ బాధ్యతలు అప్పగించినా.. చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఏమీ కోల్పోలేదు. నా కొత్త రోల్ను ఎంజాయ్ చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
విదిశా లోక్సభ స్థానం భాజపాకు కంచుకోట. ఈ నియోజకవర్గం ఏర్పడిన 1967 నుంచి ఇప్పటివరకూ రెండుసార్లు మాత్రమే ఓడిపోయింది. ఇక్కడినుంచి అటల్ బిహారీ వాజ్పేయీ, సుష్మాస్వరాజ్ లాంటి దిగ్గజ నేతలు గెలుపొందారు. ఈసారి ఈ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందాలని శివరాజ్ సింగ్ ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ మూడో దశలో భాగంగా మే 7న పోలింగ్ జరగనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
స్వాతీ మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ ఇంటి ముందు భాజపా నిరసన
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్పై జరిగిన దాడికి వ్యతిరేకంగా భాజపా అరవింద్ కేజ్రీవాల్ నివాసం ముందు నిరసనకు దిగింది. -
నాలుగు దశలు దాటాక ఇండియా కూటమి బలపడింది: ఖర్గే
ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించనుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. నాలుగు దశల్లో ముగిసిన పోలింగ్లో బలంగా పుంజుకొందని తెలిపారు. -
ఆ రోజు ముస్లిం స్నేహితులే అన్నం పెట్టేవారు: మోదీ
తానెప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. తనకు ఎంతోమంది ముస్లిం స్నేహితులు ఉన్నారని చెప్పారు. -
కంగనా ఆస్తుల విలువ రూ.90 కోట్లు
మండీ లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తనకు రూ.90 కోట్లకుపైగా ఆస్తులున్నట్లు నామినేషన్ పత్రాల్లో ప్రకటించారు. -
యూపీలో కాంగ్రెస్కు ఎర్రటోపీ బాసట
ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్యపక్షమైన కాంగ్రెస్కు సమాజ్వాదీ పార్టీ శ్రేణులు అండగా నిలుస్తున్నాయి. సీట్ల పంపకంలో భాగంగా యూపీలో 17 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. -
ప్రచార తారలు ఆదర్శంగా ఉండాలి
సార్వత్రిక ఎన్నికల్లో మిగిలిన మూడు దశల్లో జాతీయ పార్టీల ప్రచార తారలు (స్టార్ క్యాంపెయినర్లు) ఇతరులకు ఆదర్శంగా మెలగాలని, సమాజంలో సున్నితమైన కూర్పును పాడుచేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. -
రాయ్బరేలీ, అమేఠీలు మా కర్మభూమి
ఉత్తర్ప్రదేశ్లోని అమేఠీ, రాయ్బరేలీ అంటే తమ దృష్టిలో కేవలం లోక్సభ నియోజకవర్గాలు మాత్రమే కావని, అవి తమ కర్మభూమి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు. -
దేశంలో మోదీ హవా ఏమీ లేదు: జైరాం రమేశ్
దేశంలో ప్రధాని నరేంద్రమోదీ హవా ఏమీ లేదని, ఆయనకు తెలిసిందల్లా వ్యవస్థలను నాశనం చేయడమేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. -
మోదీకి నా చేతివంట రుచి చూపిస్తా: మమత
ప్రధాని మోదీకి తన చేతివంట రుచి చూపిస్తానని, చిన్నప్పటినుంచి తనకు వండటం అలవాటేనని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చెప్పారు. -
ఎన్నికల్లో పోటీ చేయకుండా మోదీని నిషేధించాలంటూ వ్యాజ్యం
తన ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ..విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నందున ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీం కోర్టు మంగళవారం తిరస్కరించింది. -
కాంగ్రెస్ వస్తే.. మళ్లీ గుడారానికి రాముడు
అయోధ్య రాముణ్ని మళ్లీ గుడారానికి పంపాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోందని ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. -
సీఏఏ అమలును మమత అడ్డుకోలేరు
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును మమతాబెనర్జీ ఎప్పటికీ అడ్డుకోలేరు. మతువాలతోపాటు శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వకుండా ప్రపంచంలో ఏ శక్తీ ఆపజాలదు. -
ఎన్డీయే నేతలు వెంట రాగా.. వారణాసిలో ప్రధాని నామినేషన్
సార్వత్రిక ఎన్నికల సమరంలో వారణాసి నుంచి వరుసగా మూడోసారి పోటీకి ప్రధాని మోదీ మంగళవారం నామినేషను దాఖలు చేశారు. -
సినీనటి కంగనా రనౌత్ ఆస్తుల విలువ ఎంతంటే?
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటి, భాజపా అభ్యర్థి కంగనా రనౌత్ మంగళవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో వెల్లడించారు. -
సొంతిల్లు లేదు.. కారు లేదు.. మోదీ ఆస్తులు ఎంతంటే..?
ప్రధాని నరేంద్ర మోదీకి రూ.3 కోట్లకు పైగా ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్లో ప్రకటించారు. ఇప్పటివరకు సొంతంగా ఇల్లు, కారు లేదని వెల్లడించారు. -
ఓటేస్తే ‘డెమోక్రసీ డిస్కౌంట్’.. పలు రెస్టారంట్ల వినూత్న ఆఫర్!
లోక్సభ ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ముంబయిలోని పలు రెస్టారంట్లు వినూత్న ఆఫర్ ప్రకటించాయి. -
మోదీకి నా వంట రుచి చూపిస్తా.. దీదీ ఆసక్తికర వ్యాఖ్యలు
Mamata Banerjee: ప్రధాని మోదీకి తన చేతి వంట రుచి చూపిస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. అసలేం జరిగిందంటే..? -
ప్రసంగాలను సరిదిద్దుకోండి.. అగ్ర నేతలకు ‘ఈసీ’ సూచన!
ఎన్నికల వేళ ఆయా పార్టీల అగ్ర నేతల నుంచి జనం మంచి ప్రసంగాలను ఆశిస్తారని.. దీంతో నాయకులు ఈమేరకు నడుచుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది.
తాజా వార్తలు
-
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
-
హైదరాబాద్లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాల స్వాధీనానికి సీఎం రేవంత్ ఆదేశం
-
మీరు అలా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది: శివానీ రాజశేఖర్
-
మా ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదు.. హరియాణా మంత్రి
-
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM