icon icon icon
icon icon icon

Sonia gandhi: ‘మీరు నా మనసుకు దగ్గరగా ఉంటారు..’ తెలంగాణ ప్రజలకు సోనియా సందేశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చారు.

Updated : 28 Nov 2023 15:55 IST

దిల్లీ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections) వేళ కాంగ్రెస్‌ పార్టీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ (Sonia gandhi) తెలంగాణ ప్రజలకు సందేశం ఇచ్చారు. ‘‘నేను మీ వద్దకు రాలేకపోతున్నా. మీరు నా మనసుకు చాలా దగ్గరగా ఉంటారు. రాష్ట్రాన్ని ప్రజల తెలంగాణగా మార్చుకుందాం. (Congress) తెలంగాణ ప్రజలకు మంచి ప్రభుత్వం లభించాలి. తెలంగాణ ప్రజల స్వప్నాలు సాకారం కావాలి. సోనియమ్మ అంటూ నాపై ఎంతో ప్రేమ చూపారు. మీ ప్రేమ, అభిమానాలకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. మీ ప్రేమకు నేను ఎప్పుడూ కృతజ్ఞురాలిని. మార్పు కావాలి.. కాంగ్రెస్‌ రావాలి. మార్పు కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయండి’’ అని సోనియా గాంధీ సందేశం ఇచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img