5 Unique Railway Stations: పేర్లు లేనివి.. వీసా ఉంటేనే అనుమతిచ్చే రైల్వేస్టేషన్ల గురించి విన్నారా!
రైల్వే స్టేషన్లలోకి వెళ్లాలంటే ఫ్లాట్ఫామ్ టికెట్ ఉంటే సరిపోతుంది. కానీ, ఈ స్టేషన్లోకి వెళ్లాలంటే తప్పనిసరిగా వీసా ఉండాలి.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా రైల్వే స్టేషన్లలోకి వెళ్లాలంటే ఫ్లాట్ఫామ్ టికెట్ ఉంటే సరిపోతుంది. కానీ, ఈ రైల్వే స్టేషన్లోకి ప్రవేశించాలంటే తప్పనిసరిగా వీసా ఉండాల్సిందే. సహజంగా రైల్వేస్టేషన్కు వెళ్లాలంటే ఇంటి నుంచి ఆటోనో, బస్సునో తీసుకొని ఫలానా రైల్వేస్టేషన్ పేరు చెప్పి ప్రయాణాన్ని కొనసాగిస్తాం. కానీ, పేరు లేని రైల్వే స్టేషన్కు వెళ్లాలంటే ఏం పేరు చెబుతాం. అలాంటి అరుదైన, ఆసక్తికరమైన రైల్వేస్టేషన్లు ఎక్కడో లేవండి. మన దేశంలోనే ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం వాటి ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం పదండి..
(photo source: google Maps)
రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న భవానీ మండి రైల్వే స్టేషన్కు ఓ ప్రత్యేకత ఉంది. ఈ స్టేషన్కు రైలు వచ్చి ఆగితే ఇంజిన్ ఒక రాష్ట్రంలో... రైలు బోగీలు మరొక రాష్ట్రంలో ఉంటాయి. మరో ప్రత్యేకత ఏంటంటే.. టికెట్ తీసుకునే ప్రయాణికులు మధ్యప్రదేశ్లో నిలబడితే.. టికెట్ ఆఫీసు మాత్రం రాజస్థాన్లో ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకతలు ఉన్న ఈ రైల్వేస్టేషన్ గురించి 2018లో ‘భవానీ మండి టేసన్ (Bhawani Mandi Tesan)’ అనే బాలీవుడ్ సినిమానూ నిర్మించారు.
వీసా ఉంటేనే అనుమతి..
విదేశాలకు వెళ్లే వారికి వీసా తప్పనిసరి ఉండాలని మనకు తెలుసు. కానీ, పంజాబ్లోని అట్టరీ రైల్వే స్టేషన్లోకి వెళ్లాలంటే కచ్చితంగా వీసా ఉండాలి. ఇది భారత్-పాక్ సరిహద్దుల్లో పంజాబ్లోని అమృత్సర్లో ఉంది. భద్రత ప్రమాణాల దృష్ట్యా ఈ రైల్వేస్టేషన్లోకి ప్రవేశించే వారు వీసా చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ వీసా లేకుండా ఎవరైనా పట్టుబడితే కఠినమైన శిక్ష విధిస్తారు.
పేర్లు లేని రైల్వే స్టేషన్లు..
దేశ వ్యాప్తంగా కొన్ని వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. వాటిలో అన్నింటికీ ఏదో ఒక పేరు ఉండే ఉంటుంది. కానీ, పేర్లు లేని రైల్వేస్టేషన్లు కూడా మన దేశంలో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లోని బంకురా-మసగ్రం మధ్యన ఓ పేరు లేని రైల్వే స్టేషన్ ఉంది. మొదటగా ఈ రైల్వే స్టేషన్ను రైనగర్ అని పిలిచేవారు. కానీ, పక్కనే ఉన్న రైనా గ్రామస్థులు తమ గ్రామం పేరిట మార్చాలని గొడవ చేశారు. దీని కారణంగా రెండు గ్రామాల మధ్య గొడవలు చెలరేగడంతో రైల్వే బోర్డు జోక్యం చేసుకుని ఉన్న పేరును తొలగించింది. దీంతో అప్పటి నుంచి ఈ స్టేషన్ పేరు లేకుండానే నడుస్తోంది. అయితే, టికెట్లు మాత్రం రైనగర్ అనే పేరుతో ఇస్తున్నారు. అలాగే ఝార్ఖండ్లో మరో పేరు లేని రైల్వేస్టేషన్ ఉంది. 2011లో మొదటిసారి ఇక్కడ రైళ్లు నడవడం ప్రారంభించాయి. తొలుత ఈ స్టేషన్ను బక్రీచంపి అని పిలిచినా.. స్థానికులు ఆందోళనలు చేయడంతో పేరును తొలగించారు. ప్రస్తుతం పేరు లేకుండానే ఈ రైల్వే స్టేషన్ కార్యకలాపాలను సాగిస్తోంది.
(photo source: Piyush goyal twitter)
రెండు రాష్ట్రాల్లో రైల్వే బెంచీ..
మహారాష్ట్ర, గుజరాత్ సరిహద్దుల్లో ఉన్న నవపూర్ రైల్వేస్టేషన్కు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఇక్కడ స్టేషన్లోని బెంచీ మధ్యలోంచి మహారాష్ట్ర, గుజరాత్ సరిహద్దు రేఖ వెళ్లింది. దీంతో బెంచీలో సగం మహారాష్ట్రలో ఉంటే మరో సగం గుజరాత్లో ఉంటుంది. బెంచీ మీద రెండు రాష్ట్రాల పేర్లుంటాయి. ఈ రైల్వేస్టేషన్లో టికెట్ కౌంటర్ మహారాష్ట్ర కిందికి వస్తే.. వెయిటింగ్ రూమ్, స్టేషన్ మాస్టర్ ఆఫీసులు గుజరాత్ పరిధిలోకి వస్తాయి. అనౌన్స్మెంట్స్ కూడా నాలుగు (హిందీ, ఇంగ్లిష్, మరాఠీ, గుజరాతీ) భాషల్లో చేస్తారు. అప్పట్లో రైల్వేమంత్రిగా ఉన్నపుడు పీయూష్ గోయల్ కూడా ఈ బెంచీ ఫొటోను ట్విటర్లో షేర్ చేసి ‘రాష్ట్రాలు విడగొట్టినా… రైల్వే కలిపింది’ అంటూ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి