UPI : యూపీఐ చెల్లింపులు చేస్తున్నారా.. పారాహుషార్
సులభతర డిజిటల్ చెల్లింపుల్లో ఓ విప్లవాత్మక మార్పు యూపీఐ (UPI) (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్). ఈ లావాదేవీలు (Transactions) 2026-27 కల్లా రోజుకు 100 కోట్లకు చేరతాయని తాజాగా పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక అంచనా వేసింది. ఈ నేపథ్యంలో యూపీఐ ద్వారా జరుగుతున్న మోసాలపై కూడా ఓ లుక్కేయండి.
యూపీఐను (UPI) ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు (cyber criminals) మోసాలకు పాల్పడుతున్నారు. 2020-21 సంవత్సరంలో 77 వేల యూపీఐ మోసాలు వెలుగు చూసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021-22లో ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 84 వేలకు ఎగబాకింది. ఈ తరహా మోసాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని ఈ సంఖ్య చూస్తే తెలుస్తోంది.
లక్షకు చేరువలో కేసులు
పెద్ద నోట్ల రద్దు, కొవిడ్ మహమ్మారి ప్రజలను డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించాయి. టీ తాగి ఇచ్చే చిల్లర మొదలుకొని వేలల్లో చేసే ఆన్లైన్ షాపింగ్ వరకూ అంతా యూపీఐతో చకచకా జరిగిపోతోంది. చెల్లింపులు ఎంత వేగం పుంజుకున్నాయో.. అదే స్థాయిలో ఆన్లైన్ మోసాలు పెరిగాయి. వాట్సప్ స్కామ్, పార్ట్ టైమ్ జాబ్ స్కామ్లాగే యూపీఐ స్కామ్లు వచ్చేశాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం.. 2022-23లో ఏకంగా 95 వేలకు పైగా యూపీఐ మోసాల కేసులు నమోదయ్యాయి.
పోలీస్స్టేషన్లకు తాకిడి
డబ్బులు, నగలు పోగొట్టుకున్నామని గతంలో ఎక్కువ మంది పోలీసులను ఆశ్రయించేవారు. ఇప్పుడు ఆన్లైన్లో నగదు పోగొట్టుకున్నామని కేసులు పెట్టే వారి సంఖ్య పెరిగిపోయింది. ముఖ్యంగా కొవిడ్ తర్వాత నుంచి ఎక్కువ మంది ఆన్లైన్ లావాదేవీలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటంతో ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది.
యూపీఐ లావాదేవీల మోసాలు జరగడానికి పోలీసులు ప్రధానంగా కొన్ని కారణాలు చెబుతున్నారు. అవేంటంటే.. తొలుత స్కామర్లు బాధితులకు మాయమాటలు చెప్పి రిమోట్ అసిస్టెన్స్ సాఫ్ట్వేర్లను డౌన్లోడ్ చేయిస్తున్నారు. దాంతో ఫోన్లోని సమాచారం మొత్తం వారి ఆధీనంలోకి వెళ్లిపోతుంది. వెంటనే హ్యాకర్లు తమ పని ప్రారంభించి ఈ-వ్యాలెట్లను నియంత్రణలోకి తెచ్చుకుంటారు. ఇలాంటి కేసుల్లో స్కామర్లు తమను తాము కస్టమర్ కేర్ ప్రతినిధులుగా బాధితులతో పరిచయం చేసుకుంటున్నారు. వెంటనే ఈకేవైసీ పూర్తి చేయాలని, లేని పక్షంలో వ్యాలెట్లు పని చేయవని తొందరపెడుతున్నారు. ఇంకొన్ని కేసుల్లో ఆధార్-పాన్ అనుసంధానం అంటూ బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్ మోసగాళ్లకు వివరాలన్నీ చెప్పిన తరువాత ఓ థర్డ్ పార్టీ యాప్ డౌన్లోడ్ చేసుకోమని లింక్ పంపిస్తున్నారు. ఒక్కసారి ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోగానే వ్యాలెట్లోని మొత్తాన్ని దోచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎక్కువగా జరుగుతున్న యూపీఐ మోసాల తీరును పరిశీలించండి..
1. నకిలీ యూపీఐ రిక్వెస్ట్
ఈ విధానంలో నేరగాళ్లు ముందుగా కొంత మొత్తాన్ని బాధితుల యూపీఐ అకౌంట్లోకి పంపిస్తారు. ఆ తరువాత ఫోన్ చేసి పొరపాటున ఆ నగదు పంపించామని చెబుతారు. ఆ డబ్బుతో అత్యవసరంగా పని ఉందని, తిరిగి పంపించమని ప్రాధేయపడతారు. బాధితులు అందుకు ఓకే చెబితే రీఫండ్ పేరుతో సైబర్ నేరగాళ్లు మరో లింక్ పంపిస్తారు. దాన్ని క్లిక్ చేస్తే స్కామర్లు బాధితుల ఫోన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకుని వ్యాలెట్, బ్యాంకు ఖాతాలోని నగదు దోచేస్తారు.
2. ఫేక్ క్యూఆర్ కోడ్
సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న మరో టెక్నిక్ క్యూఆర్ కోడ్. ఈ విధానంలో క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు వచ్చినట్లు బాధితులకు రిక్వెస్ట్ సందేశం పంపిస్తారు. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే బాధితుల అకౌంట్లో నుంచే డబ్బులు డ్రా అయిపోతాయి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
యూపీఐ లావాదేవీలు నిజానికి చాలా భద్రమైనవి. ఓటీపీ, యూపీఐ పిన్ వివరాలు చెప్పనంత వరకు స్కామర్లు ఏమీ చేయలేరు. యూపీఐ మోసాల బారిన పడకుండా ఉండాలంటే..
- యూపీఐ పిన్ను ప్రతి నెల మార్చుకోవాలి.
- ఎవరైనా పొరపాటున నగదు పంపించి.. వెంటనే ఆ డబ్బు తిరిగి పంపించమని మరో లింక్ పంపిస్తే దాన్ని క్లిక్ చేయొద్దు. అవసరమైతే ఆ వ్యక్తి ఫోన్ నంబర్ తీసుకొని లావాదేవీలు పూర్తి చేయాలి.
- ఏటీఏం పిన్ లాగే యూపీఐ పిన్ చాలా ముఖ్యమైనది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దు.
- కస్టమర్ కేర్ ప్రతినిధులు, మీకు తెలిసిన వారి స్నేహితులు, బంధువులు అని చెప్పి డబ్బులు అడుగుతూ సందేశం పంపించగానే లేదా ఫోన్ చేయగానే నమ్మకూడదు. పూర్తిగా నిర్థారించుకున్న తరువాతే నిర్ణయం తీసుకోవాలి.
- ఆన్లైన్లో జరుగుతున్న కొత్త తరహా మోసాలపై అవగాహన పెంచుకోవాలి. మీ ఇంట్లో వారిని సైతం అప్రమత్తం చేయాలి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎడారి దేశంలో ఎందుకీ వరదలు.. క్లౌడ్ సీడింగ్ కారణమా?
అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే ఎడారి దేశమైన యూఏఈలో కుండపోత వర్షాలకు ‘క్లౌడ్ సీడింగ్’ (Cloud seeding) కారణమనే అభిప్రాయాలున్నాయి. -
సింగం vs సింగై.. మధ్యలో గణపతి
త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూర్ నుంచి భాజపా అభ్యర్థిగా అన్నామలై పోటీలో నిలిచారు. ఆయనకు పోటీగా డీఎంకే నుంచి మాజీ మేయర్ గణపతి రాజ్కుమార్, అన్నాడీఎంకే నుంచి సింగై రామచంద్రన్ బరిలో ఉన్నారు. -
కచ్చతీవు.. కథేంటి? అసలు ఎక్కడుంది ఈ దీవి?
భారత్కు చెందిన కచ్చతీవు దీవిని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. తమిళనాడు భాజపా నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడంతో ఇది మళ్లీ వార్తల్లోకి వచ్చింది. -
ఆజానుబాహుడు.. ఆ బానిస 200 మంది పిల్లలకు తండ్రి..!
బ్రెజిల్కు చెందిన నల్లజాతి బానిస.. దాదాపు 200 మందికి పైగా చిన్నారులకు తండ్రయ్యాడు. -
Rainwater Harvesting: తక్కువ ఖర్చు.. ఇంట్లోనే వర్షపు నీటిని ఎలా ఆదా చేయొచ్చంటే?
అడుగంటిపోతున్న భూగర్భ జలాలకు పునర్జీవం ఇచ్చేందుకు తక్కువ ఖర్చుతో వాన నీటిని ఒడిసి పట్టే ప్రక్రియను ముంబయికి చెందిన వ్యక్తి రూపొందించాడు. -
Happiest Country: ఏడోసారి ‘హ్యాపీ’గా.. ఫిన్లాండ్ అద్భుత విజయానికి కారణాలివే!
ఇటీవల యూఎన్ ఆధారిత సంస్థ ప్రకటించిన ఆనందకర దేశాల జాబితాలో వరుసగా ఏడోసారి ఫిన్లాండ్ అగ్ర స్థానంలో నిలిచింది. ఈ అద్భుత విజయం వెనక కారణాలివే.. -
Underwater Metro: మరో అద్భుతం! నది కింద మెట్రో సర్వీసులు.. విశేషాలివే..
రైల్వే రవాణా చరిత్రలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. కోల్కతాలో నది కింద మెట్రో రైలు సర్వీసుల్ని ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ప్రారంభించబోతున్నారు. -
Wolfs: అక్కడ తోడేళ్లు అరవడం లేదట.. ఎందుకంటే?
తోడేళ్లు రాత్రి సమయాల్లో ఊళలు వేస్తుంటాయి. అయితే.. ఇటీవల మహారాష్ట్రలో తోడేళ్ల సముదాయాలు రాత్రిళ్లు ఇలా చేయడం లేదని ఒక సర్వేలో వెల్లడైంది. అసలు కారణం ఇదే.. -
పితృదేవతలకు అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటో తెలుసా?
ప్రతి మాసంలోనూ వచ్చే అమావాస్య, మహాలయ అమావాస్య పితృదేవతలకు ఎంతో ఇష్టమనీ, ఆ రోజు శ్రాద్ధ కర్మాదుల్ని చేస్తే మంచి ఫలితం ఉంటుందనీ పెద్దలంతా అంటుంటారు. అసలు పితృదేవతలకూ, అమావాస్యకూ ఉన్న సంబంధం ఏంటంటే.. -
సరస్వతీ దేవి రూపం ఎందుకంత విశిష్టమైనది?
Vasantha panchami: ఒకసారి సరస్వతి మూర్తిని గమనించండి - ఆమె ఒక చేతిలో వీణ (సంగీత వాయిద్యం), మరొక చేతిలో పుస్తకం ఉంటాయి. పుస్తకం, మన ఎడమ మెదడు చేసే కార్యకలాపాలను సూచిస్తుంది. ప్రాచీన వాయిద్యాల్లో ఒకటైన వీణ, సంగీతాన్ని, కళలను, సృజనాత్మకను.. మన కుడి మెదడు చేసే పనులను సూచిస్తుంది. -
Hindu Temple: అబుదాబిలో అతి పెద్ద ‘హిందూ ఆలయం’ రేపే ప్రారంభం.. ఈ విశేషాలు తెలుసా?
అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో అతిపెద్ద హిందూ ఆలయం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఫిబ్రవరి 14న ఈ ఆలయాన్ని ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అక్కడికి చేరుకున్నారు. -
PV Narasimha Rao: అదీ పీవీ అంటే.. ఆర్థికం తెలియకున్నా.. వెనక్కి తగ్గలే!
ప్రధానిగా పీవీ నరసింహారావు చేసిన కృషి నిరుపమానమైంది.. దేశం దాదాపు దివాళా తీసే పరిస్థితులు ఉన్న కాలంలో ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలే ఈరోజు దేశాన్ని ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేశాయి. అలాంటి గొప్ప రాజనీతిజ్ఞుడైన పీవీకి కేంద్ర భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భంగా ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: పీఠాధిపతి కాబోయి.. ప్రధాని పీఠం అధిరోహించి..!
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించిన నేపథ్యంలో ఆయన జీవితంలో కొన్ని అరుదైన ఘటనల గురించి తెలుసుకుందాం. -
PV Narasimha Rao: తెలుగువారి కోహినూరు.. పీవీ నరసింహారావు
బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. బహు భాషాకోవిదుడైన ఆయన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రి, ప్రధాని హోదాల్లో పనిచేసి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు అవిశ్రాంతంగా కృషిచేశారు. తెలుగుజాతి గర్వించే పీవీ.. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపికైన సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.. -
PV Narasimha Rao: భావిగతి మార్చిన సంస్కర్తకి భారతరత్న.. అప్పుల భారతాన్ని అభివృద్ధి వైపు నడిపిన పీవీ
PV Narasimha Rao: భారత ఆర్థిక మూలాల బలోపేతానికి మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకున్న నిర్ణయాలు, కృషి అనిర్వచనీయమైనది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించిన వేళ ఆ ఆసక్తికర విషయాలు.. -
Cervical cancer: ఏంటీ సర్వైకల్ క్యాన్సర్? ఎలా గుర్తించాలి?
సర్వైకల్ క్యాన్సర్.. ఏంటీ వ్యాధి..? ఎలా గుర్తించాలి? -
Explained: ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియమే ఎందుకు?
ట్యాబ్లెట్ల ప్యాకింగ్కు అల్యూమినియంనే ఎందుకు వాడతారో తెలుసా? కారణమేంటి? -
Nitish Kumar: మళ్లీ జంప్..! ఎందుకంటే..?
బిహార్ సీఎం, జేడీయూ అధినేత నీతీశ్కుమార్ తిరిగి ఎన్డీయే గూటికి చేరే అవకాశాలున్నాయి. విపక్ష ‘ఇండియా’ కూటమిలో కీలక నేతగా ఉన్న ఆయన భాజపాతో చేతులు కలపడంపై పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. -
Karpoori Thakur: ‘కర్పూరీ’ లెక్కలు.. పాస్ చేస్తాయా?
సోషలిస్టు నేత, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్.. 1970, 80ల్లో ఎంబీసీ నేతగా వేసిన ముద్ర బిహార్ రాజకీయాలను మార్చివేసింది. -
శీతాకాలంలో మాయం.. వసంతంలో ప్రత్యక్షం.. ఎలా?
కీటకాలు, పురుగులు, సూక్ష్మజీవులు, పక్షులు.. నిత్యం ప్రకృతిలో సవాళ్లను ఎదుర్కొంటాయి. తమకంటే పెద్దవైన క్రూర జంతువుల నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు వివిధ రకాల వ్యూహాలను అనుసరిస్తుంటాయి. -
Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె