UPI : యూపీఐ చెల్లింపులు చేస్తున్నారా.. పారాహుషార్
సులభతర డిజిటల్ చెల్లింపుల్లో ఓ విప్లవాత్మక మార్పు యూపీఐ (UPI) (యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్). ఈ లావాదేవీలు (Transactions) 2026-27 కల్లా రోజుకు 100 కోట్లకు చేరతాయని తాజాగా పీడబ్ల్యూసీ ఇండియా నివేదిక అంచనా వేసింది. ఈ నేపథ్యంలో యూపీఐ ద్వారా జరుగుతున్న మోసాలపై కూడా ఓ లుక్కేయండి.
యూపీఐను (UPI) ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు (cyber criminals) మోసాలకు పాల్పడుతున్నారు. 2020-21 సంవత్సరంలో 77 వేల యూపీఐ మోసాలు వెలుగు చూసినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2021-22లో ఆర్థిక సంవత్సరంలో ఈ సంఖ్య 84 వేలకు ఎగబాకింది. ఈ తరహా మోసాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదని ఈ సంఖ్య చూస్తే తెలుస్తోంది.
లక్షకు చేరువలో కేసులు
పెద్ద నోట్ల రద్దు, కొవిడ్ మహమ్మారి ప్రజలను డిజిటల్ లావాదేవీల వైపు మళ్లించాయి. టీ తాగి ఇచ్చే చిల్లర మొదలుకొని వేలల్లో చేసే ఆన్లైన్ షాపింగ్ వరకూ అంతా యూపీఐతో చకచకా జరిగిపోతోంది. చెల్లింపులు ఎంత వేగం పుంజుకున్నాయో.. అదే స్థాయిలో ఆన్లైన్ మోసాలు పెరిగాయి. వాట్సప్ స్కామ్, పార్ట్ టైమ్ జాబ్ స్కామ్లాగే యూపీఐ స్కామ్లు వచ్చేశాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం.. 2022-23లో ఏకంగా 95 వేలకు పైగా యూపీఐ మోసాల కేసులు నమోదయ్యాయి.
పోలీస్స్టేషన్లకు తాకిడి
డబ్బులు, నగలు పోగొట్టుకున్నామని గతంలో ఎక్కువ మంది పోలీసులను ఆశ్రయించేవారు. ఇప్పుడు ఆన్లైన్లో నగదు పోగొట్టుకున్నామని కేసులు పెట్టే వారి సంఖ్య పెరిగిపోయింది. ముఖ్యంగా కొవిడ్ తర్వాత నుంచి ఎక్కువ మంది ఆన్లైన్ లావాదేవీలు చేయడానికి ఆసక్తి చూపిస్తుండటంతో ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది.
యూపీఐ లావాదేవీల మోసాలు జరగడానికి పోలీసులు ప్రధానంగా కొన్ని కారణాలు చెబుతున్నారు. అవేంటంటే.. తొలుత స్కామర్లు బాధితులకు మాయమాటలు చెప్పి రిమోట్ అసిస్టెన్స్ సాఫ్ట్వేర్లను డౌన్లోడ్ చేయిస్తున్నారు. దాంతో ఫోన్లోని సమాచారం మొత్తం వారి ఆధీనంలోకి వెళ్లిపోతుంది. వెంటనే హ్యాకర్లు తమ పని ప్రారంభించి ఈ-వ్యాలెట్లను నియంత్రణలోకి తెచ్చుకుంటారు. ఇలాంటి కేసుల్లో స్కామర్లు తమను తాము కస్టమర్ కేర్ ప్రతినిధులుగా బాధితులతో పరిచయం చేసుకుంటున్నారు. వెంటనే ఈకేవైసీ పూర్తి చేయాలని, లేని పక్షంలో వ్యాలెట్లు పని చేయవని తొందరపెడుతున్నారు. ఇంకొన్ని కేసుల్లో ఆధార్-పాన్ అనుసంధానం అంటూ బురిడీ కొట్టిస్తున్నారు. సైబర్ మోసగాళ్లకు వివరాలన్నీ చెప్పిన తరువాత ఓ థర్డ్ పార్టీ యాప్ డౌన్లోడ్ చేసుకోమని లింక్ పంపిస్తున్నారు. ఒక్కసారి ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకోగానే వ్యాలెట్లోని మొత్తాన్ని దోచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎక్కువగా జరుగుతున్న యూపీఐ మోసాల తీరును పరిశీలించండి..
1. నకిలీ యూపీఐ రిక్వెస్ట్
ఈ విధానంలో నేరగాళ్లు ముందుగా కొంత మొత్తాన్ని బాధితుల యూపీఐ అకౌంట్లోకి పంపిస్తారు. ఆ తరువాత ఫోన్ చేసి పొరపాటున ఆ నగదు పంపించామని చెబుతారు. ఆ డబ్బుతో అత్యవసరంగా పని ఉందని, తిరిగి పంపించమని ప్రాధేయపడతారు. బాధితులు అందుకు ఓకే చెబితే రీఫండ్ పేరుతో సైబర్ నేరగాళ్లు మరో లింక్ పంపిస్తారు. దాన్ని క్లిక్ చేస్తే స్కామర్లు బాధితుల ఫోన్ను తమ ఆధీనంలోకి తెచ్చుకుని వ్యాలెట్, బ్యాంకు ఖాతాలోని నగదు దోచేస్తారు.
2. ఫేక్ క్యూఆర్ కోడ్
సైబర్ నేరగాళ్లు ఉపయోగిస్తున్న మరో టెక్నిక్ క్యూఆర్ కోడ్. ఈ విధానంలో క్యూఆర్ కోడ్ ద్వారా డబ్బులు వచ్చినట్లు బాధితులకు రిక్వెస్ట్ సందేశం పంపిస్తారు. ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే బాధితుల అకౌంట్లో నుంచే డబ్బులు డ్రా అయిపోతాయి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి
యూపీఐ లావాదేవీలు నిజానికి చాలా భద్రమైనవి. ఓటీపీ, యూపీఐ పిన్ వివరాలు చెప్పనంత వరకు స్కామర్లు ఏమీ చేయలేరు. యూపీఐ మోసాల బారిన పడకుండా ఉండాలంటే..
- యూపీఐ పిన్ను ప్రతి నెల మార్చుకోవాలి.
- ఎవరైనా పొరపాటున నగదు పంపించి.. వెంటనే ఆ డబ్బు తిరిగి పంపించమని మరో లింక్ పంపిస్తే దాన్ని క్లిక్ చేయొద్దు. అవసరమైతే ఆ వ్యక్తి ఫోన్ నంబర్ తీసుకొని లావాదేవీలు పూర్తి చేయాలి.
- ఏటీఏం పిన్ లాగే యూపీఐ పిన్ చాలా ముఖ్యమైనది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులతో పంచుకోవద్దు.
- కస్టమర్ కేర్ ప్రతినిధులు, మీకు తెలిసిన వారి స్నేహితులు, బంధువులు అని చెప్పి డబ్బులు అడుగుతూ సందేశం పంపించగానే లేదా ఫోన్ చేయగానే నమ్మకూడదు. పూర్తిగా నిర్థారించుకున్న తరువాతే నిర్ణయం తీసుకోవాలి.
- ఆన్లైన్లో జరుగుతున్న కొత్త తరహా మోసాలపై అవగాహన పెంచుకోవాలి. మీ ఇంట్లో వారిని సైతం అప్రమత్తం చేయాలి.
-ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థి దశలో రాసిన కావ్యం.. పరీక్షలో అతడికే ప్రశ్నగా వచ్చిన వేళ!
ఒక విద్యార్థి తాను రాసిన పుస్తకంపై పరీక్షలో తిరిగి జవాబుగా రాయడం ఒక అద్భతఘట్టమే అని చెప్పవచ్చు. -
అప్పట్లో ‘Y2K’ భయం.. ఇప్పుడు ‘క్రౌడ్స్ట్రైక్’ ఎఫెక్ట్!
2000లో డెస్క్టాప్ యుగం నడుస్తోన్న వేళ ‘వై2కే’ రూపంలో వచ్చిన ఉప ద్రవం ప్రపంచ దేశాలను కలవరపాటుకు గురిచేసింది. -
మన్సా మూసా.. ఈయన ముందు మస్క్ చాలా చిన్నోడు!
ప్రస్తుతం విశ్వకుబేరుడిగా ఖ్యాతికెక్కిన ఎలాన్ మస్క్ కన్నా దాదాపు రెండు రెట్ల సంపద ఒక వ్యక్తి వద్ద ఉండేది. ఆయనెవరో తెలుసా..! -
నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి
త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యం చేసినట్టు ప్రాచీన వాజ్మయం ద్వారా తెలుస్తోంది. ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి. -
అబ్రహం లింకన్ నుంచి ట్రంప్ వరకు..నాయకులే లక్ష్యంగా దాడులు..!
రాజకీయ హింసకు సంబంధించిన ఘటనలు అగ్రరాజ్యానికి కొత్తేమీ కాదు. పలువురు మాజీ అధ్యక్షులు, పార్టీల అధ్యక్ష అభ్యర్థులు ఈ తరహా దాడులను ఎదుర్కొన్నారు. -
అంబానీ ఇంట పెళ్లి.. ఏడు నెలల వేడుక, రూ.వందల కోట్లు ఖర్చు!
అనంత్-రాధికా మర్చంట్ ఎంగేజిమెంట్ ఏడు నెలల క్రితం జరగగా.. జులై 12న ఏడడుగులతో ఒక్కటి కానున్నారు. -
ఆడతోడు కోసం అలుపెరగని.. రెండు ‘సింహాల సాహసయాత్ర’!
ఓ ఆడతోడు కోసం రెండు సింహాలు అలుపెరగకుండా సాహస ప్రయాణం చేసిన ఘటన ఆఫ్రికాలో చోటుచేసుకుంది. -
వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే ...
మన శరీరానికి ఆహారం, నీరు ఎంత అవసరమో వ్యాయామమూ(exercise) అంతే ముఖ్యం. మనదేశంలో సగంమందికి పైగా వయోజనులు ఆ విషయాన్ని గుర్తించడం లేదు. ఎలాంటి శారీరక శ్రమ లేకుండా రోజులు వెళ్లదీస్తున్నారని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. -
నచ్చని ‘బాస్’లను అమ్మేస్తున్నారిలా.. జాబ్ మార్కెట్లో నయా ట్రెండ్!
చైనాలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ వైరల్ అవుతోంది. పలువురు ఉద్యోగులు తమకు నచ్చని ఉద్యోగాలను, బాస్లను, సహోద్యోగులను ఆన్లైన్లో అమ్మకానికి పెడుతున్నారు. -
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
బ్రిటన్ ప్రధానమంత్రి అధికారిక నివాసం ‘10 డౌనింగ్ స్ట్రీట్’లో గత 14ఏళ్లలో ఐదుగురు ప్రధానులు మారినప్పటికీ.. ల్యారీ అనే పిల్లి మాత్రం అక్కడే మకాం వేసింది. -
రిషి సునాక్కు షాకిచ్చిన బారిస్టర్.. ఎవరీ కీర్ స్టార్మర్..?
Keir Starmer: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ అఖండ విజయం సాధించింది. దీంతో ఆ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇంతకీ ఎవరాయన..? -
కాళ్లకింద నలిగిపోతున్న ప్రాణాలు.. భారత్లో ఈ తరహా భారీ ఘటనలివే!
Stampedes: ఉత్తర్ప్రదేశ్లోని హాథ్రస్లో జరిగిన తొక్కిసలాటలో 116 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దేశంలో గతంలో చోటు చేసుకున్న ఈ తరహా ఘటనలను ఓ సారి పరిశీలిస్తే.. -
ఆ క్షిపణి చైనాను కొడుతుందా? అయితే ఓకే.. ఆ దీవిని ఇస్తాను..
ఒడిశా తీరంలోని వీలర్ దీవిని ‘డీఆర్డీవో’కు కేటాయించడం వెనుక దాగిఉన్న ఆసక్తికర కథనం ఇది.. -
రింగురింగులుగానే టెలిఫోన్ రిసీవర్ వైరు.. ఎందుకో తెలుసా?
టెలిఫోన్ రిసీవర్ వైరు రింగురింగులా ఉంటుంది. మనం చాలాసార్లు దీనిని చూసినా అలాగే ఎందుకుంటుందో పెద్దగా పట్టించుకోం. అది కచ్చితంగా ఆలాగే ఎందుకుండాలి? -
హెలికాప్టర్లతో లక్షలాది ‘మగ దోమలు’ విడుదల.. ఎందుకంటే!
కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు లక్షలాది దోమలను విడిచిపెడుతున్నారు. -
ఎన్నిక ఎరుగని ‘స్పీకర్’ పీఠం.. చరిత్ర తిరగరాస్తారా?
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకాభిప్రాయంతోనే జరుగుతోంది. -
అన్నమో రామచంద్రా నుంచి.. అన్నపూర్ణగా..!
పట్టెడు అన్నం కోసం బిడ్డలను అమ్ముకునే పరిస్థితుల నుంచి అన్నపూర్ణగా ఎదిగిన ఒడిశా రాష్ట్రంలోని కలహండి జిల్లా విజయ గాథ ఇది. -
ఎనిమిదోసారి.. లోక్సభలో ‘సీనియర్ మోస్ట్’ ఎంపీలు!
ఇంద్రజిత్ గుప్తా, వాజ్పేయీ, కమల్నాథ్ వంటి దిగ్గజ నేతల నుంచి మేనకాగాంధీ, సంతోష్ కుమార్ గంగ్వార్ వంటి నేతలు దశాబ్దాల పాటు లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు. -
కణకణలాడుతున్న కాంక్రీట్ జంగిల్స్.. నగరాలకే ఈ నరకం ఎందుకో?
దేశ రాజధాని దిల్లీతోపాటు వివిధ మెట్రోపాలిటన్ నగరాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వివిధ నగరాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో కంటే.. నగరాలు, పట్టణాల్లో మాత్రం ఎండలు భయపెడుతున్నాయి. దీనికి కారణాలేంటి? -
వారానికి ఎంత బరువు తగ్గొచ్చు.. నిపుణులు ఏం చెబుతున్నారంటే!
ఊబకాయ ముప్పును ఎదుర్కొనేందుకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లతోపాటు నిత్యం వ్యాయామం వంటి ద్విముఖ విధానం అవసరమని స్పష్టం చేస్తున్నారు. -
మిలమిల మెరిసి.. మాయమవుతున్న చుక్కలు!
కొన్నేళ్లుగా నక్షత్రాలు అదృశ్యమవుతున్న తీరు అంతరిక్ష శాస్త్రవేత్తలను కలవరపాటుకు గురి చేస్తోంది. గత 70 ఏళ్లలో దాదాపు 800 నక్షత్రాలు కనిపించకుండా పోయినట్టు వారు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
-
మీది తప్పు అనుకుంటే.. రిక్వెస్ట్ అనే వాడిని కాదు: హరీశ్ శంకర్